NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / UttarPradesh: ప్రాణాల మీదికి తెచ్చిన ఇన్‌స్టా రీల్స్ పిచ్చి.. రైలు పట్టాలపై ప్రాణాలు కోల్పోయిన కుటుంబం
    తదుపరి వార్తా కథనం
    UttarPradesh: ప్రాణాల మీదికి తెచ్చిన ఇన్‌స్టా రీల్స్ పిచ్చి.. రైలు పట్టాలపై ప్రాణాలు కోల్పోయిన కుటుంబం
    ప్రాణాల మీదికి తెచ్చిన ఇన్‌స్టా రీల్స్ పిచ్చి

    UttarPradesh: ప్రాణాల మీదికి తెచ్చిన ఇన్‌స్టా రీల్స్ పిచ్చి.. రైలు పట్టాలపై ప్రాణాలు కోల్పోయిన కుటుంబం

    వ్రాసిన వారు Sirish Praharaju
    Sep 12, 2024
    09:01 am

    ఈ వార్తాకథనం ఏంటి

    సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడానికి చేసే ప్రయత్నాలు ప్రాణాలను బలిగొంటున్నాయి. ఈసారి రీల్స్ చేస్తూ ఉత్తర్‌ప్రదేశ్ లో ఓ కుటుంబం ప్రాణాలు కోల్పోయింది.

    రైలు పట్టాలపై రీల్స్ చేయడానికి ప్రయత్నించిన వారు, అనుకోకుండా జరిగిన ప్రమాదంలో మరణించారు.

    ఈ దుర్ఘటనలో భార్యాభర్తలు, వారి కుమారుడు చనిపోయారు. పోలీసులు, బంధుమిత్రుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.

    సీతాపూర్ జిల్లాలోని లహర్‌పూర్‌కు చెందిన మహ్మద్ అహ్మద్ (26), నజ్రీన్ (24) భార్యాభర్తలు. వీరికి అబ్దుల్లా అనే రెండేళ్ల కుమారుడు ఉన్నాడు.

    హర్గవ్ సమీపంలోని క్యోతి అనే గ్రామంలో జరిగిన శుభకార్యానికి అహ్మద్ తన కుటుంబంతో హాజరయ్యాడు. బుధవారం ఉదయం ముగ్గురు సమీపంలోని రైలు పట్టాల వద్దకు వెళ్లారు.

    వివరాలు 

    లక్నో నుండి మైలానికి వెళ్తున్న ప్యాసింజర్ రైలు ఢీకొట్టడంతో.. 

    ఈ కుటుంబానికి ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చేసే అలవాటు ఉంది. రైల్వే బ్రిడ్జి దగ్గర బైక్‌పై వెళ్లి, రైలు పట్టాలపై రీల్స్ చేస్తున్నారు. రీల్స్‌ లోకంలో మునిగిన వారు వెనుకాల రైలు వస్తున్న విషయం గమనించలేదు.

    ఈ సమయంలో లక్నో నుండి మైలానికి వెళ్తున్న ప్యాసింజర్ రైలు వారిని ఢీకొట్టడంతో, ముగ్గురు కూడా అక్కడికక్కడే మరణించారు.

    రైలు ఢీకొట్టడంతో వారి శరీరాలు పూర్తిగా ఛిద్రమయ్యాయి. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించారు.

    ప్రమాద సమయంలో రీల్స్ తీసుకుంటున్నట్లు సెల్‌ఫోన్‌లో నమోదైన వీడియోల ద్వారా నిర్ధారించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఉత్తర్‌ప్రదేశ్

    తాజా

    Sushmita Sen: 31 ఏళ్ల క్రితం ఫొటో షేర్‌ చేసిన మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్
    Shaktimaan: 'శక్తిమాన్‌' మరోసారి వస్తున్నాడు.. ఆడియో సిరీస్‌గా వచ్చేస్తున్న సూపర్‌హీరో! సినిమా
    Ranyarao: రన్యారావు గోల్డ్‌ స్మగ్లింగ్‌ కేసు.. హోం మంత్రి పరమేశ్వరకు చెందిన విద్యాసంస్థలపై ఈడీ దాడులు  కర్ణాటక
    HariHara veeramallu: సలసల మరిగే రక్తమే.. పవన్ కళ్యాణ్‌ 'హరి హర వీరమల్లు' నుంచి పాట విడుదల!  హరిహర వీరమల్లు

    ఉత్తర్‌ప్రదేశ్

    Election results: ఉత్తర్‌ప్రదేశ్'లో సత్తా చాటిన ఇండియా కూటమి భారతదేశం
    Parliament: నకిలీ ఆధార్ కార్డులు చూపించి పార్లమెంట్‌లోకి ప్రవేశించిన ముగ్గురి అరెస్ట్  పార్లమెంట్ భవనం
    Kanpur: బైక్‌పై టైటానిక్' భంగిమ విన్యాసం.. రూ 12 వేలు జరిమానా భారతదేశం
    UttarPradesh: ఉత్తర్‌ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం..  రెండు కార్లు ఢీకొన్న ఘటనలో నలుగురు యూట్యూబర్‌లు మృతి   భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025