NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Andhra Pradesh: గుంటూరు నుండి సికింద్రాబాద్‌కు 3 గంటల్లోనే ప్రయాణం!
    తదుపరి వార్తా కథనం
    Andhra Pradesh: గుంటూరు నుండి సికింద్రాబాద్‌కు 3 గంటల్లోనే ప్రయాణం!
    గుంటూరు నుండి సికింద్రాబాద్‌కు 3 గంటల్లోనే ప్రయాణం!

    Andhra Pradesh: గుంటూరు నుండి సికింద్రాబాద్‌కు 3 గంటల్లోనే ప్రయాణం!

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Jan 12, 2025
    01:12 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    తెలుగు రాష్ట్రాల ప్రజలుగా బీబీనగర్ - నడికుడి రైల్వే మార్గాన్ని డబ్లింగ్ చేయాలని ఎన్నో ఏళ్లుగా డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే.

    గతేడాది ఈ మార్గంలో బీబీనగర్ - గుంటూరు మధ్య 239 కి.మీ ఉండేది. రెండో లైను నిర్మాణానికి కేంద్రం ఆమోదం తెలిపింది. ఇటీవల విశాఖ పర్యటనలో ప్రధాని మోదీ ఈ డబ్లింగ్ పనులకూ శంకుస్థాపన చేశారు.

    ఈ రైల్వే మార్గం ద్వారా మొత్తం నిర్మాణ వ్యయం రూ.2853.23 కోట్లు అవుతుందని, ఇందులో సిగ్నలింగ్, టెలికాం పనులకు రూ.319.62 కోట్లు, సివిల్ పనులకు రూ.1947.44 కోట్లు, ఎలక్రికల్ ఇంజనీరింగ్ పనులకు రూ.586.17 కోట్లు అంచనా వేశారు.

    ప్రస్తుతం సికింద్రాబాద్ - విజయవాడ మధ్య రెండు రైల్వే మార్గాలున్నాయి.

    Details

    46కి.మీ తగ్గే అవకాశం

    అందులో ఒకటి ఖాజీపేట-ఖమ్మం మార్గం, మరొకటి బీబీనగర్ - నడికుడి - గుంటూరు మార్గం.

    ఇది ప్రస్తుతం సింగిల్ లైన్ ఉండడంతో రైలు ఒకదాని వెనుక మరో రైలు వస్తున్నప్పుడు వేచి ఉండాల్సి వస్తుంది.

    రెండో లైను నిర్మాణం పూర్తయితే రైళ్ల వేగం పెరగడమే కాకుండా అదనపు రైళ్లు నడపడానికి అవకాశం ఉంటుంది. ఈ మార్గంలో 139 కిలోమీటర్లు తెలంగాణలో, 100 కిలోమీటర్లు ఆంధ్రప్రదేశ్‌లో ఉంటాయి.

    ప్రస్తుతం సింగిల్ లైను గరిష్ట వేగం 130 కిలోమీటర్లు కాగా, వందేభారత్ రైలు వేగం 160 కిలోమీటర్లు. కొత్తగా చేపట్టే రెండో లైను వేగ సామర్థ్యం 150-160 కిలోమీటర్లుగా ఉంటుంది.

    ఈ డబ్లింగ్ మార్గంతో, సికింద్రాబాద్ నుండి తిరుపతి, చెన్నైలకు దూరం 46 కి.మీ. తగ్గుతుంది.

    Details

    తెలుగు రాష్ట్రాలకు చాలా ప్రయోజనం

    సికింద్రాబాద్ - విజయవాడ మార్గంలో ప్రస్తుతం 350 కిలోమీటర్ల దూరం ఉంది.

    కానీ బీబీనగర్ - నడికుడి - గుంటూరు మార్గం 336 కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంది. దీంతో ఈ మార్గం అత్యంత రద్దీగా మారింది. ప్రస్తుతం దక్షిణ మధ్య రైల్వేలో ఈ మార్గం సామర్థ్య వినియోగం 148.25% ఉంటుంది.

    ఈ డబ్లింగ్ మార్గం తెలుగు రాష్ట్రాలకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ప్రత్యేకించి, సిమెంట్, బొగ్గు, వ్యవసాయ ఉత్పత్తుల రవాణా సులభతరమవుతుంది.

    ఈ మార్గాలలో జగ్గయ్యపేట, నడికుడి, మేళ్లచెరువు, విష్ణుపురం, జాన్ పహాడ్ ప్రాంతాలలో సిమెంట్ పరిశ్రమలు ఉండడం విశేషం.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    సికింద్రాబాద్
    విజయవాడ తూర్పు

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    సికింద్రాబాద్

    జనవరిలోనే సికింద్రాబాద్-విజయవాడ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను పట్టాలెక్కనుందా? నరేంద్ర మోదీ
    సికింద్రాబాద్‌ డెక్కన్‌ స్పోర్ట్స్ భవనంలో భారీ అగ్ని ప్రమాదం, ఎగిసిపడుతున్న అగ్నికీలలు హైదరాబాద్
    తెలంగాణ: బీబీనగర్‌లో పట్టాలు తప్పిన గోదావరి ఎక్స్‌ప్రెస్ తెలంగాణ
    సికింద్రాబాద్‌: దక్షిణ మధ్య రైల్వే ఆధ్వర్యంలో 200ఏళ్ల నాటి బావి పునరుద్ధరణ దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ డివిజన్

    విజయవాడ తూర్పు

    Sea plane: విజయవంతమైన విజయవాడ-శ్రీశైలం 'సీ ప్లేన్' ట్రయల్ రన్  శ్రీశైలం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025