NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్.. ముంద‌స్తు రిజ‌ర్వేష‌న్ చార్జీలు త‌గ్గింపు
    తదుపరి వార్తా కథనం
    ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్.. ముంద‌స్తు రిజ‌ర్వేష‌న్ చార్జీలు త‌గ్గింపు
    టీఎస్ఆర్టీసీలో రిజర్వేషన్ ఛార్జీలు తగ్గింపు

    ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్.. ముంద‌స్తు రిజ‌ర్వేష‌న్ చార్జీలు త‌గ్గింపు

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Jun 26, 2023
    07:15 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ అందించింది. తెలంగాణలోని సుదూర ప్రాంతాల ప్ర‌యాణికులకు ఆర్థిక భారాన్ని త‌గ్గించేందుకు ముంద‌స్తు రిజ‌ర్వేష‌న్ రేట్లను యాజమాన్యం తగ్గించింది.

    ఈ మేరకు రిజ‌ర్వేష‌న్ స‌దుపాయ‌మున్న ఎక్స్ ప్రెస్, డీల‌క్స్, సూప‌ర్ ల‌గ్జ‌రీ, ఏసీ బస్సు స‌ర్వీసుల్లో చార్జీల‌ను త‌గ్గిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.

    ఎక్స్ ప్రెస్, డీల‌క్స్ స‌ర్వీసుల్లో 350 కిలోమీట‌ర్ల లోపు ప్రయాణానికి రూ.20, 350 కిలోమీట‌ర్ల‌ కంటే ఎక్కువగా ఉంటే రూ.30గా రుసుములను నిర్ణ‌యించింది.

    సూప‌ర్ ల‌గ్జ‌రీ, ఏసీ సర్వీసుల్లో మాత్రం ముంద‌స్తు రిజ‌ర్వేష‌న్ చేసుకుంటే రూ.30 వ‌సూలు చేయ‌నున్నట్లు సంస్థ వెల్లడించింది. సవరించిన ఛార్జీలు వెంటనే అమల్లోకి వస్తాయని సంస్థ పేర్కొంది.

    DETAILS

    మంగళవారం రోజు ఒకరి రక్తదానం - ముగ్గురికి ప్రాణదానం పేరిట బ్లడ్ క్యాంప్ : టీఎస్ఆర్టీసీ  

    టీఎస్ఆర్టీసీ బ‌స్సుల్లో సగటున 15 వేల వ‌ర‌కు ప్రతిరోజూ టికెట్ల‌ను రిజ‌ర్వేష‌న్ చేసుకుంటున్నారని వివరించింది.

    రిజ‌ర్వేష‌న్ చార్జీల‌ తగ్గింపు కారణంగా ఈ సౌకర్యాన్ని ప్ర‌యాణికులంద‌రూ ఉప‌యోగించుకోవాలన్నారు. అలాగే సంస్థ‌ను ఆద‌రించాలని ఆర్టీసీ ఛైర్మ‌న్ బాజిరెడ్డి గోవ‌ర్ద‌న్, ఎండీ వీసీ స‌జ్జ‌నార్ విజ్ఞప్తి చేశారు.

    మరోవైపు రక్తదానంపై సంస్థ అవగాహన కార్యక్రమాలు చేపడుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 101 ప్రాంతాల్లో మంగ‌ళ‌వారం ర‌క్త‌దాన శిబిరాల‌ను ఏర్పాటు చేస్తున్నామని తెలిపింది.

    'ఒకరి రక్తదానం - ముగ్గురికి ప్రాణదానం' అనే ట్యాగ్ లైన్‌తో ప్రజల్లోకి వెళ్తున్నామన్నారు. మానవత్వంతో స్పందించి రక్త దానం చేసేందుకు ముందుకు రావాలని సంస్థ కోరింది.

    ప్రతీ డిపో పరిధిలోని 20 నుంచి 30 మంది విద్యార్థులు రక్తదాన శిబిరంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    టీఎస్ఆర్టీసీ
    తెలంగాణ

    తాజా

    Meghalaya Honeymoon Case: మేఘాలయ హనీమూన్ హత్యలో సంచలన ట్విస్ట్.. ఆ ఒక్క క్లూతో మర్డర్ మిస్టరీ వీడింది!  మేఘాలయ
    Stock Market : అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల సంకేతాలు.. ఫ్లాట్‌గా ప్రారంభమైన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు  స్టాక్ మార్కెట్
    Pakistan: పాక్ జట్టుకు షాక్‌.. బాబర్, రిజ్వాన్, షాహీన్‌లను తొలగించిన సెలెక్టర్లు! పాకిస్థాన్
    Gold and Silver Price: స్వల్పంగా తగ్గిన బంగారం ధర, పెరిగిన వెండి.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే బంగారం

    టీఎస్ఆర్టీసీ

    TSRTC: ప్రయాణికులకు టీఎస్‌ ఆర్టీసీ గుడ్‌న్యూస్; హైదరాబాద్‌లో టికెట్ ధరలు రూ.10 తగ్గింపు  తాజా వార్తలు
    TSRTC: విలేజ్ బస్ ఆఫీసర్ల తొలివిడత నియామకం పూర్తి తాజా వార్తలు
    హైదరాబాద్‌-విజయవాడ రూట్‌లో 'ఈ-గరుడ' ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు  హైదరాబాద్
    తెలంగాణ ఆర్టీసీకి గణనీయంగా తగ్గిన నష్టాలు; నల్గొండ రీజియన్ టాప్  బస్

    తెలంగాణ

    కరీంనగర్: ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి ప్రయాణిస్తున్న కారుకు ప్రమాదం భారతదేశం
    సింగరేణి కార్మికులకు రూ.700 కోట్ల బోనస్ బొనాంజ.. దసరాకి చెల్లిస్తామన్న సీఎం ప్రభుత్వం
    రాష్ట్రాలకు మూడో విడత పన్నుల పంపిణీ; రూ.1.1 లక్షల కోట్లను విడుదల చేసిన కేంద్రం  పన్ను
    మక్తల్ మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ రెడ్డి ఇకలేరు తెలుగు దేశం పార్టీ/టీడీపీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025