NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. అందుబాటులోకి వచ్చిన డిజిటల్ లగేజీ నిర్వహణ
    తదుపరి వార్తా కథనం
    తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. అందుబాటులోకి వచ్చిన డిజిటల్ లగేజీ నిర్వహణ
    అందుబాటులోకి వచ్చిన డిజిటల్ లగేజీ నిర్వహణ

    తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. అందుబాటులోకి వచ్చిన డిజిటల్ లగేజీ నిర్వహణ

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Aug 23, 2023
    02:40 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    తిరుమల శ్రీవారి భక్తుల కోసం మరో కొత్త సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈ మేరకు లగేజీ నిర్వహణ నిమిత్తం నూతన వ్యవస్థకు టీటీడీ శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలోనే BBMS (బాలాజీ బ్యాగేజ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్)ను లాంచ్ చేసింది.

    లగేజ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌కు డిజిటలైజ్ చేయడం ద్వారా భక్తులకు సులభంగా, వేగంగా సేవలు అందించగలుగుతుంది. ఈ నేపథ్యంలోనే ప్రయోగాత్మకంగా చేపట్టిన బీబీఎంఎస్ వ్యవస్థ విజయవంతమైందని టీటీడీ ఈఓ ధర్మారెడ్డి తెలిపారు.

    అంతకుముందు టీటీడీ చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ (CVSO) డి.నరసింహ కిషోర్‌తో కలిసి బీబీఎంఎస్‌ నిర్వహణపై సమీక్షించారు.

    ప్రస్తుతం బ్యాగేజీ నిర్వహణ చేసేందుకు మాన్యువల్ పద్ధతినే కొనసాగిస్తున్నామన్నారు. దీని స్థానంలో తాజాగా ఆధునిక పద్ధతిలో భాగంగా డిజిటలైజ్ చేస్తున్నట్లు తెలిపారు.

    DETAILS

    భక్తుల సౌకర్యార్థం కొత్త వ్యవస్థను తీసుకొచ్చాం : ఈఓ ధర్మారెడ్డి

    తిరుమలలో స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు మొబైల్ ఫోన్లు, లగేజీ డిపాజిట్ కోసం బీబీఎంఎస్‌ పద్ధతిని ప్రవేశపెట్టామని ఈఓ ధర్మారెడ్డి వివరించారు.

    దర్శనానికి వెళ్లే ముందు భక్తులు జేబుల్లో దాచుకున్న ఫోన్ల జమ ప్రక్రియలో అవాంతరాలు ఏర్పడుతున్నట్లు ఆయన చెప్పారు. అందుకే సౌకర్యవంతం కోసం కొత్త వ్యవస్థను పారదర్శకంగా తీర్చిదిద్దామన్నారు.

    నూతన విధానంలో దర్శన టిక్కెట్లను స్కాన్ చేస్తామని, దీంతో లగేజీ, ఫోన్ల వివరాలు ఆటోమేటిక్‌గా నిక్షిప్తం అవుతాయన్నారు. దర్శనం టిక్కెట్లు లేని వారి వస్తువులనూ స్కాన్ చేస్తామని, QR కోడ్ రసీదుతో RFID నెంబర్ ఇస్తామన్నారు.

    మొబైల్ డిపాజిట్ నిమిత్తం శ్రీవారి దర్శన టిక్కెట్లు సహా ఆధార్ డేటాను సేకరిస్తామని, ఈ మేరకు క్యూఆర్ కోడ్, రశీదు ఇస్తామని స్పష్టం చేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తిరుపతి
    టీటీడీ

    తాజా

    Covid 19 : హాంకాంగ్, సింగపూర్ లో మళ్ళీ పెరుగుతున్న కోవిడ్ కేసులు కోవిడ్
    India Womens Squad : హర్మన్ ప్రీత్ సారథ్యంలో ఇంగ్లండ్ టూర్ కు వెళ్తున్న వుమెన్స్ జట్టు ఇదే.. బీసీసీఐ
    Turkey: టర్కీపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం.. ఒప్పందాలు రద్దు చేసుకుంటున్న భారత యూనివర్సిటీలు.. బాయ్‌కాట్‌ టర్కీ
    India Turkey: టర్కీకి బిగ్ షాక్ ఇచ్చిన భారత్.. విమానయాన సంస్థతో ఒప్పందం రద్దు.. కేంద్ర ప్రభుత్వం

    తిరుపతి

    ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టమ్ ను ప్రారంభించిన తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమల తిరుపతి
    TSRTC: 'బాలాజీ దర్శనం' ప్యాకేజీకి విశేష స్పందన; తిరుమలకు 1.14 లక్షల మంది భక్తులు తెలంగాణ
    ఏప్రిల్ 8న సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం; టికెట్ ధరలు, ట్రైన్ రూట్ వివరాలు ఇలా ఉన్నాయి! వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలు
    రేపు సికింద్రాబాద్-తిరుపతి వందే‌భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం; ట్రైన్ రూట్, టికెట్ ధరలను తెలుసుకోండి వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలు

    టీటీడీ

    టీటీడీ కొత్త ఛైర్మన్ గా జంగా కృష్ణమూర్తి.. పార్టీ విధేయుడి పేరు పరిశీలిస్తున్నసీఎం జగన్ తిరుమల తిరుపతి
    టీటీడీ బోర్డు కొత్త సారథిగా భూమన కరుణాకర్‌ రెడ్డి నియమాకం ఆంధ్రప్రదేశ్
    శ్రీవారి మ్యూజియానికి టీటీడీ భూమి పూజ.. రూ.145 కోట్లతో అత్యాధునిక భవనానికి శ్రీకారం భూమన కరుణాకర్‌ రెడ్డి
    తిరుమల: నడక మార్గంలో భద్రతా ఏర్పాట్లను పెంచిన టీటీడీ  భూమన కరుణాకర్‌ రెడ్డి
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025