NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / శ్రీవారి మ్యూజియానికి టీటీడీ భూమి పూజ.. రూ.145 కోట్లతో అత్యాధునిక భవనానికి శ్రీకారం
    తదుపరి వార్తా కథనం
    శ్రీవారి మ్యూజియానికి టీటీడీ భూమి పూజ.. రూ.145 కోట్లతో అత్యాధునిక భవనానికి శ్రీకారం
    రూ.145 కోట్లతో అత్యాధునిక భవనానికి శ్రీకారం

    శ్రీవారి మ్యూజియానికి టీటీడీ భూమి పూజ.. రూ.145 కోట్లతో అత్యాధునిక భవనానికి శ్రీకారం

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Aug 11, 2023
    12:40 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    తిరుమల సన్నిధిలో ఎస్వీ మ్యూజియం నిర్మాణం కోసం పూజ భూమి జరిగింది.

    స్వామి వారి భక్తుల సౌకర్యార్థం అత్యాధునిక సాంకేతికతతో కూడిన శ్రీ వెంకటేశ్వర మ్యూజియాన్ని నిర్మించేందుకు శుక్రవారం టీటీడీ పాలక మండలి శ్రీకారం చుట్టింది.

    దాదాపు రూ. 145 కోట్లతో ఎస్వీ మ్యూజియం ఆధునీకరణ పనులను ప్రారంభించినట్లు టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ప్రకటించారు.

    టీసీఎస్(TCS) కంపెనీ, బెంగుళూరుకు చెందిన మ్యాప్ సిస్టమ్ సంస్థతో కలసి మ్యూజియాన్ని లేటెస్ట్ టెక్నాలజీ‌తో అభివృద్ధి చేస్తున్నట్లు వెల్లడించారు.

    ఈ పుణ్యకార్యానికి ప్రముఖ ఐటీ కంపెనీ టీసీఎస్ రూ. 125 కోట్లు, మ్యాప్ సిస్టమ్ రూ 20 కోట్లను విరాళంగా ఇస్తున్నట్లు చెప్పారు. ఈ నిధులను వెచ్చించి డిసెంబరులోగా నిర్మాణం పూర్తి చేయనున్నట్లు పేర్కొన్నారు.

    DETAILS

    మ్యూజియంలో శ్రీవారి ఆలయ విశిష్టతలు, తిరుమలకు సంబంధించిన కీలక సమాచారం

    మొత్తం ఈ భవనం మూడు ఫ్లోర్లలో ఉంటుందని, వాటిల్లో శ్రీవారి ఆలయ విశిష్టతలు, తిరుమలకు సంబంధించిన కీలకమైన సమాచారం తదితర అంశాలను ఏర్పాటు చేయనున్నామని టీటీడీ ఛైర్మన్ కరుణాకర్ రెడ్డి తెలిపారు.

    కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కొత్త ఛైర్మన్‌గా గురువారం బాధ్యతలు స్వీకరించిన తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి శుక్రవారమే కార్యచరణకు దిగారు.

    ఈ మేరకు శ్రీవారి వైభవాన్ని చాటి చెప్పేలా వెంకటేశ్వర స్వామి పేరిట ఎస్వీ మ్యూజియంను ఏర్పాటు చేసేందుకు సంకల్పించారు.

    ఈ క్రమంలోనే టీటీడీ ఈఓ(EO) ధర్మారెడ్డితో కలిసి భూమి పూజ చేశారు. అంతకుముందు వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    టీటీడీ
    తిరుమల తిరుపతి
    భూమన కరుణాకర్‌ రెడ్డి

    తాజా

    Earthquake: చైనాలో 4.5 తీవ్రతతో భూకంపం చైనా
    Robinhood: థియేట‌ర్‌లో ఫెయిల్.. ఓటీటీలో హిట్.. రాబిన్‌హుడ్‌కు అద్భుత రెస్పాన్స్ నితిన్
    Neeraj Chopra: దోహా డైమండ్‌ లీగ్‌లో సత్తా చాటడమే లక్ష్యంగా బరిలోకి నీరజ్‌ చోప్రా నీరజ్ చోప్రా
    Olympic Games-BCCI: ఒలింపిక్స్‌లో భారత అథ్లెట్లకు అండగా  కేంద్ర క్రీడా శాఖ.. బీసీసీఐ,కార్పొరేట్‌ సంస్థల మద్దతు  బీసీసీఐ

    టీటీడీ

    టీటీడీ కొత్త ఛైర్మన్ గా జంగా కృష్ణమూర్తి.. పార్టీ విధేయుడి పేరు పరిశీలిస్తున్నసీఎం జగన్ తిరుమల తిరుపతి
    టీటీడీ బోర్డు కొత్త సారథిగా భూమన కరుణాకర్‌ రెడ్డి నియమాకం ఆంధ్రప్రదేశ్

    తిరుమల తిరుపతి

    ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టమ్ ను ప్రారంభించిన తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతి
    TSRTC: 'బాలాజీ దర్శనం' ప్యాకేజీకి విశేష స్పందన; తిరుమలకు 1.14 లక్షల మంది భక్తులు తెలంగాణ
    తిరుమలో భద్రతా లోపం: 'ఆనంద నిలయం' దృశ్యాలను ఫోన్‌లో చిత్రీకరించిన భక్తుడు  తిరుపతి
    తిరుమల: ఏడాదిలోపు చిన్నారుల తల్లిదండ్రులకు శ్రీవారి ప్రత్యేక దర్శనం; అదెలాగో తెలుసుకోండి తాజా వార్తలు

    భూమన కరుణాకర్‌ రెడ్డి

    Bhumana Karunakar Reddy: టీటీడీ చైర్మన్‌గా బాధ్యతలను స్వీకరించిన భూమన కరుణాకర్‌రెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025