హిందీ భారతదేశాన్ని ఏకం చేస్తుందని చెప్పడం అసంబద్ధం: అమిత్ షా హిందీ దివాస్ ప్రసంగంపై ఉదయనిధి
'హిందీ దివస్' సందర్భంగా గురువారం అమిత్ షా చేసిన ఒక ప్రసంగంలో.. హిందీ భారతదేశంలోని భాషల వైవిధ్యాన్ని ఏకం చేస్తుందని, ఇది వివిధ భారతీయ, ప్రపంచ భాషలు,మాండలికాలను గౌరవించిందని అన్నారు. హిందీ ఎప్పుడూ ఏ ఇతర భారతీయ భాషతోనూ పోటీపడలేదని, దానిలోని అన్ని భాషలను బలోపేతం చేయడం ద్వారానే బలమైన దేశం ఆవిర్భవించదని హోంమంత్రి అన్నారు. ఈ సందర్భంగా అమిత్ షా చేసిన ప్రసంగాన్ని తమిళనాడు మంత్రి, డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ ఖండించారు. కేవలం 4-5 రాష్ట్రాల్లో మాట్లాడే భాష దేశాన్ని ఏకం చేయదని అన్నారు.
హిందీ ఈ రెండు రాష్ట్రాలను ఎక్కడ కలుపుతుంది?: ఉదయనిధి
అమిత్ షా వ్యాఖ్యను విమర్శిస్తూ, ఉదయనిధి స్టాలిన్ X లో ఒక పోస్ట్ పెట్టారు. హిందీ దేశ ప్రజలను ఏకం చేస్తుంది - ప్రాంతీయ భాషలకు అధికారం ఇస్తుంది' అని కేంద్ర మంత్రి అమిత్ షా అనడం చూస్తే.. ఆయన ఎప్పటిలాగే, హిందీ భాషపై తన ప్రేమను కురిపించారన్నారు. ఆలోచన అనేది హిందీ చదివితే పురోగమించవచ్చన్న నినాదానికి ఈ ఆలోచన ప్రత్యామ్నాయ రూపమని మండిపడ్డారు. తమిళనాడులో తమిళం, కేరళలో మలయాళం మాట్లాడతారని అలాంటప్పుడు హిందీ ఈ రెండు రాష్ట్రాలను ఎక్కడ కలుపుతుంది? సాధికారత ఎక్కడ వస్తుంది? అంటూ ప్రశ్నించారు. అమిత్ షా హిందీ కాకుండా ఇతర భాషలను ప్రాంతీయ భాషలుగా కించపరచడం మానేయాలి' అంటూ #StopHindiImposition అంటూ తన పోస్ట్ను ముగించారు.