Page Loader
ఉత్తర్‌ప్రదేశ్ హత్య కేసు: ఉమేష్ పాల్‌పై కాల్పులు జరుపుతున్న సీసీటీవీ వీడియో వైరల్
ఉమేష్ పాల్‌పై కాల్పులు జరుపుతున్న సీసీటీవీ వీడియో వైరల్

ఉత్తర్‌ప్రదేశ్ హత్య కేసు: ఉమేష్ పాల్‌పై కాల్పులు జరుపుతున్న సీసీటీవీ వీడియో వైరల్

వ్రాసిన వారు Stalin
Mar 16, 2023
04:26 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశ‌వ్యాప్తంగా సంచలనంగా మారిన ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన ఉమేష్ పాల్ హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఉమేష్‌పై కాల్పులు జరుపుతున్న దృశ్యాలు రికార్డయిన సీసీటీవీ వీడియో బయటకు వచ్చింది. ఉమేష్ పాల్ తలపై అసద్ కాల్చడానికి ప్రయత్నిస్తున్నట్లు అందులో కనపడుతుంది. అలాగే అసద్ కాల్చకుండా ఉమేష్ అడ్డుకోవడం కూడా చూడవచ్చు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య కొద్దిసేపు ఘర్షణ జరిగింది. అనంతరం ఉమేష్ సమీపంలోని ఇంట్లో ఆశ్రయం పొందేందుకు ప్రయత్నించినట్లు సీసీటీవీ ఫుటేజీలో కనపడుతుంది. అనంతరం అసద్ తుపాకీతో షూట్ చేయడంతో ఆ శబ్దం విన్న ఒక అమ్మాయి బయటికి వచ్చి.. ఉమేష్ కుటుంబ సభ్యులకు తెలియజేస్తుంది.

ఉత్తర్‌ప్రదేశ్

పోలీస్ కానిస్టేబుల్ బాంబు విసిరిన అతిక్ అనుచరుడు గుడ్డు

సీసీటీవీ వీడియో చివర్లో గ్యాంగ్‌స్టర్‌గా మారిన రాజకీయ నాయకుడు అతిక్ అహ్మద్ సహాయకుడు గుడ్డు ముస్లిం, పోలీస్ కానిస్టేబుల్ రాఘవేంద్ర సింగ్‌పై బాంబు విసరడం కనిపిస్తుంది. 2005లో జరిగిన బీఎస్పీ ఎమ్మెల్యే రాజు పాల్ హత్య కేసులో ప్రధాన సాక్షి ఉమేష్ పాల్‌ను ఫిబ్రవరి 24 న ప్రయాగ్‌రాజ్‌లోని ధూమన్‌గంజ్‌లోని అతని ఇంటి వెలుపల కాల్చి కాల్చి చంపారు. ఈ ఘటనలో ఉమేష్ సెక్యూరిటీ గార్డు సందీప్ నిషాద్ కూడా చనిపోయారు. ఉమేష్ పాల్ హత్య కేసులో మాజీ ఎంపీ అతిక్ అహ్మద్ కుమారుడు అసద్ తో పాటు అర్మాన్, గులాం, గుడ్డు, సాబీర్‌ని అరెస్టు చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. వారి పేరు మీద రివార్డును కూడా ప్రకటించారు.