NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Nutrition Security: న్యూట్రిషన్ సెక్యూరిటీపై కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం.. 17,082 కోట్లు కేటాయింపు 
    తదుపరి వార్తా కథనం
    Nutrition Security: న్యూట్రిషన్ సెక్యూరిటీపై కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం.. 17,082 కోట్లు కేటాయింపు 
    న్యూట్రిషన్ సెక్యూరిటీపై కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం

    Nutrition Security: న్యూట్రిషన్ సెక్యూరిటీపై కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం.. 17,082 కోట్లు కేటాయింపు 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Oct 09, 2024
    03:55 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం కేంద్ర మంత్రివర్గ సమావేశం జరిగింది.

    ఈ సమావేశంలో కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆ వివరాలను మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు.

    గుజరాత్ లో నేషనల్ మారిటైం హెరిటేజ్ కాంప్లెక్స్ ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. లోథల్ వద్ద ఈ హెరిటేజ్ కాంప్లెక్స్ ను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి చెప్పారు.

    అలాగే, పంబాజ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో రూ.4,406 కోట్ల వ్యయంతో సరిహద్దు రోడ్లను అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. వైబ్రంట్ విలేజ్ కార్యక్రమం కింద రోడ్లు,టెలికామ్,నీటి సరఫరా,ఆరోగ్యం,విద్య అందించేందుకు ఆమోదం ఇచ్చారు.

    ఇక పాకిస్తాన్ సరిహద్దు వెంబడి ఉన్న గ్రామాలకు కనెక్టయ్యేలా 2,208 కిలోమీటర్ల మేర రాజస్థాన్, పంజాబ్ రాష్ట్రాల్లో కొత్త రోడ్లను నిర్మించాలని నిర్ణయించారు.

    వివరాలు 

    ఫోర్టిఫైడ్ రైస్ ను సరఫరా చేసేందుకు కేంద్రమంత్రివర్గం ఆమోదం

    గ్రామాలను హైవేలతో కలపడం ద్వారా సరిహద్దు గ్రామాల అభివృద్ధికి సంబంధించిన ప్రణాళికలను కేబినెట్ సిద్ధం చేసిందని మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు.

    ఐసీడీఎస్, పీఎం పోషణ సహా అన్ని పథకాల ద్వారా రూ.17,082 కోట్ల వ్యయంతో ఫోర్టిఫైడ్ రైస్ ను సరఫరా చేసేందుకు కేంద్రమంత్రివర్గం ఆమోదం తెలిపిందని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు.

    రక్తహీనత, శరీరంలో మైక్రో-న్యూట్రియెంట్ల కొరతను అధిగమించడమే దీని ప్రధాన లక్ష్యమని చెప్పారు.

    2028 డిసెంబర్ వరకూ ఈ పథకం అమలు అవుతుందని, ఇది పూర్తిగా కేంద్ర నిధులతోనే జరుగుతుందని తెలిపారు.

    వివరాలు 

    80 కోట్ల మందికి లబ్ధి

    ఈ పథకం ద్వారా దేశంలో 80 కోట్ల మంది ప్రజలు పోషకాహార లోపాన్ని అధిగమించే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.

    దీనిపై నీతియోగ్ పూర్తిగా పరిశోధన చేసిందని, మామూలు బియ్యంతోనే వీటిని తయారు చేస్తారని ఆయన చెప్పారు.

    2019 నుంచి 2021 మధ్య దేశంలో నిర్వహించిన ఆరోగ్య సర్వేలో రక్తహీనత సమస్య అధికంగా ఉన్నట్లు తేలిందని, అన్నివయసుల వారిలో ఈ లోపం కనిపించిందని అశ్వినీ వైష్ణవ్ తెలిపారు.

    ఐరన్, విటమిన్ B12, ఫోలిక్ యాసిడ్ వంటి లోపాలు కనిపించాయని వివరించారు. ఆ సర్వే ఆధారంగానే ఫోరిఫైడ్ రైస్ ను సరఫరా చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కేంద్ర కేబినెట్
    అశ్విని వైష్ణవ్

    తాజా

    Bhatti vikramarka: వాణిజ్య పన్నుల వసూళ్లలో 6 శాతం పురోగతి.. వెల్లడించిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు భట్టి విక్రమార్క
    Mangalagiri AIIMS: మంగళగిరి ఎయిమ్స్‌లో గుండె శస్త్రచికిత్స విభాగం ప్రారంభం  మంగళగిరి
    CM Chandrababu: ఏజెన్సీ ప్రాంతాల్లో స్థానిక గిరిజనులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 100 శాతం రిజర్వేషన్లు.. సీఎం చంద్రబాబు స్పష్టీకరణ ఆంధ్రప్రదేశ్
    Andhra News: ఎంసెట్‌,డిగ్రీ,ఇంజినీరింగ్‌ కోర్సులలో 15% కోటా సీట్లు పూర్తిగా ఏపీ విద్యార్థులకే ఆంధ్రప్రదేశ్

    కేంద్ర కేబినెట్

    సిలిండర్‌పై సబ్సిడీ రూ.300కి పెంపు.. తెలంగాణలో పసుపు బోర్టు ఏర్పాటు కేంద్రం ఆమోదం  వంటగ్యాస్ సిలిండర్
    కేంద్రం ఉద్యోగులకు 4శాతం డీఏ.. గోధుమకు రూ.150 మద్దతు ధర పెంపు  అనురాగ్ సింగ్ ఠాకూర్
    కొత్త క్రిమినల్ చట్టాలను కేంద్ర కేబినెట్ ఆమోదం.. వ్యభిచారం, స్వలింగ అంశాలపై మాత్రం..  తాజా వార్తలు
    Huge funds: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు.. రైతాంగం కోసం భారీగా నిధులు కేటాయింపు  నరేంద్ర మోదీ

    అశ్విని వైష్ణవ్

    'అమృత్ భారత్ పథకం' కింద ఆంధ్రప్రదేశ్‌లో 72 రైల్వే స్టేషన్ల అభివృద్ధి: కేంద్రం ఆంధ్రప్రదేశ్
    Odisha train accident: అంతా నిమిషాల్లోనే జరిగిపోయింది; అసలు మూడు ట్రైన్లు ఎలా ఢీకొన్నాయంటే?  ఒడిశా
    ఒడిశా రైలు ప్రమాదంపై రాజకీయ దుమారం; సీబీఐ విచారణను కోరిన రైల్వే శాఖ  రైలు ప్రమాదం
    ఒడిశా విషాదం జరిగిన ట్రాక్‌పై 51గంటల తర్వాత తొలి రైలు ప్రయాణం  రైలు ప్రమాదం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025