NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / PM Modi: నేడు కేంద్ర కేబినెట్ సమావేశం.. భద్రతా అంశాలపై చర్చించనున్న ప్రధాని
    తదుపరి వార్తా కథనం
    PM Modi: నేడు కేంద్ర కేబినెట్ సమావేశం.. భద్రతా అంశాలపై చర్చించనున్న ప్రధాని
    నేడు కేంద్ర కేబినెట్ సమావేశం.. భద్రతా అంశాలపై చర్చించనున్న ప్రధాని

    PM Modi: నేడు కేంద్ర కేబినెట్ సమావేశం.. భద్రతా అంశాలపై చర్చించనున్న ప్రధాని

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Jun 04, 2025
    09:17 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం నాడు కేంద్ర కేబినెట్ సమావేశం జరగనుంది. 'ఆపరేషన్ సిందూర్' ప్రారంభమైన తరువాత తొలిసారిగా కేబినెట్ భేటీ జరగడం ఈ సమావేశానికి ప్రత్యేక ప్రాధాన్యతను కలిగించింది.

    ప్రధాన మంత్రితో పాటు కేంద్ర కేబినెట్ మంత్రులు, సహాయ మంత్రులు కూడా ఈ సమావేశానికి హాజరుకానున్నారు. ఇదిలా ఉంటే, ఎన్డీఏ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తరువాత త్వరలో ఏడాది పూర్తి కానుంది.

    ఈ దశలో జరగనున్న కేబినెట్ సమావేశం పాలనాపరంగా కీలకమైనదిగా చెప్పొచ్చు. ఢిల్లీకి చెందిన సుష్మా స్వరాజ్ భవన్‌లో ఈ భేటీ నిర్వహించనున్నారు.

    ఇందులో 'ఆపరేషన్ సిందూర్'కు దారితీసిన పరిణామాలు, ఆపరేషన్ అనంతరం చోటు చేసుకున్న పరిస్థితులపై ప్రధాని మోదీ తన సహచర మంత్రులకు వివరించే అవకాశముంది.

    Details

    కుల గణన, జనాభా లెక్కలపై నిశితంగా చర్చించే అవకాశం

    తీవ్రవాద కార్యకలాపాలను అణిచివేయడంలో త్రివిధ దళాల పాత్ర, ఈ చర్యల్ని ప్రజల్లోకి చక్కగా తీసుకెళ్లే రీతిపై కూడా చర్చ జరగనుంది.

    ఈ నేపథ్యంలో ఈ సమావేశానికి భిన్న కోణాల నుంచి ప్రాధాన్యత ఏర్పడింది. ఇంతకీ, కేబినెట్ సమావేశంలో మరొక ప్రధాన అంశంగా జనాభా లెక్కలు, కుల గణనపై చర్చ జరుగనుంది.

    ఇప్పటికే ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో కుల గణన అంశంపై చర్చ జరగిన విషయం విదితమే.

    ఇప్పుడు కేంద్ర కేబినెట్‌ స్థాయిలోనూ ఈ అంశాన్ని పరిశీలించే అవకాశం ఉన్నట్టు సమాచారం.

    ఈ మేరకు బుధవారం జరగబోయే కేబినెట్ భేటీ... దేశ రాజకీయ, రక్షణ, పరిపాలనా పరంగా కీలక మలుపుగా మారే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కేంద్ర కేబినెట్
    నరేంద్ర మోదీ

    తాజా

    PM Modi: నేడు కేంద్ర కేబినెట్ సమావేశం.. భద్రతా అంశాలపై చర్చించనున్న ప్రధాని కేంద్ర కేబినెట్
    Odisha: ఒడిశా ప్రభుత్వాసుపత్రిలో దారుణం.. నర్సు తప్పుడు ఇంజెక్షన్‌.. ఐదుగురు రోగులు మృతి ఒడిశా
    Iran: ఇరాన్‌లో తప్పిపోయిన ముగ్గురు భారతీయులు క్షేమం.. రాయబార కార్యాలయం వెల్లడి  ఇరాన్
    AAP: తరగతి గదుల నిర్మాణాల్లో అవినీతి.. మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్‌లకు సమన్లు మనీష్ సిసోడియా

    కేంద్ర కేబినెట్

    సిలిండర్‌పై సబ్సిడీ రూ.300కి పెంపు.. తెలంగాణలో పసుపు బోర్టు ఏర్పాటు కేంద్రం ఆమోదం  వంటగ్యాస్ సిలిండర్
    కేంద్రం ఉద్యోగులకు 4శాతం డీఏ.. గోధుమకు రూ.150 మద్దతు ధర పెంపు  అనురాగ్ సింగ్ ఠాకూర్
    కొత్త క్రిమినల్ చట్టాలను కేంద్ర కేబినెట్ ఆమోదం.. వ్యభిచారం, స్వలింగ అంశాలపై మాత్రం..  తాజా వార్తలు
    Huge funds: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు.. రైతాంగం కోసం భారీగా నిధులు కేటాయింపు  నరేంద్ర మోదీ

    నరేంద్ర మోదీ

    IPL 2025: అతను చిచ్చర పిడుగులా రాణిస్తున్నాడు.. వైభవ్ సూర్యవంశీపై మోదీ ప్రశంసలు క్రికెట్
     PM Modi: ప్రధాని నరేంద్రమోదీతో రక్షణశాఖ కార్యదర్శి భేటీ  భారతదేశం
     Modi-Ajit Doval: మరోసారి ప్రధాని మోదీతో జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్ సమావేశం  అజిత్ దోవల్‌
    India and UK: బ్రిటన్‎తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్న భారత్ భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025