NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Hardeep Singh Puri: సునీతా కేజ్రీవాల్ ని రబ్రీ దేవితో పోల్చిన కేంద్ర మంత్రి 
    తదుపరి వార్తా కథనం
    Hardeep Singh Puri: సునీతా కేజ్రీవాల్ ని రబ్రీ దేవితో పోల్చిన కేంద్ర మంత్రి 
    Hardeep Singh Puri: సునీతా కేజ్రీవాల్ ని రబ్రీ దేవితో పోల్చిన కేంద్ర మంత్రి

    Hardeep Singh Puri: సునీతా కేజ్రీవాల్ ని రబ్రీ దేవితో పోల్చిన కేంద్ర మంత్రి 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Mar 29, 2024
    04:08 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ వీడియో సందేశాన్ని విడుదల చేసిన వెంటనే బిజేపి విమర్శనాస్త్రాలను సంధించింది.

    సునీతా కేజ్రీవాల్‌ను బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ భార్య రబ్రీ దేవితో పోల్చారు కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ.

    తన భర్త పదవిని కైవసం చేసుకునేందుకు సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోందంటూ ఆమెను టార్గెట్ చేశారు.

    ఢిల్లీలో బీజేపీ ఎన్నికల కార్యాలయాన్ని ప్రారంభించిన సందర్భంగా కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ విలేఖరుల సమావేశంలో ఒక ప్రశ్నకు సమాధానంగా, మీరు పేరు తీసుకుంటున్న మేడమ్ బహుశా బీహార్‌లో రబ్రీ దేవిలా బాధ్యతలు చేపట్టడానికి సిద్ధమవుతున్నారని అన్నారు.

    సునీతా కేజ్రీవాల్ 

    వీడియో సందేశాన్ని విడుదల చేసిన సునీతా కేజ్రీవాల్ 

    శుక్రవారం మరోసారి సునీతా కేజ్రీవాల్ తన వీడియో సందేశాన్ని విడుదల చేశారు.

    వీడియో సందేశంలో, సునీతా కేజ్రీవాల్ కొత్త ప్రచారాన్ని ప్రారంభించాలని పిలుపునిచ్చారు.

    సునీతా కేజ్రీవాల్ ఈ ప్రచారానికి ''బ్లెస్సింగ్స్ టు కేజ్రీవాల్' అని పేరు పెట్టారు. తన వీడియో సందేశంలో, ఆమె రెండు వాట్సాప్ నంబర్‌లను విడుదల చేశారు. ఆ వాట్సాప్ నంబర్లకు ప్రజలు తమ సందేశాలను పంపాలని విజ్ఞప్తి చేశారు.

    దేశం నలుమూలల నుండి ప్రజలు తమ సందేశాలను కేజ్రీవాల్‌కు పంపవచ్చని సునీతా కేజ్రీవాల్ తన సందేశంలో పేర్కొన్నారు.

    దీంతో పాటు గురువారం రూస్ అవెన్యూ కోర్టులో అరవింద్ కేజ్రీవాల్ ధైర్యంగా తన అభిప్రాయాలను అందించారని తెలిపారు.

    ఇంత ధైర్యంగా కోర్టులో తన అభిప్రాయాలను ప్రదర్శించడం అంత సులువు కాదన్నారు.

    అరవింద్ కేజ్రీవాల్ 

    దేశప్రజల మద్దతు కోరిన సునీతా కేజ్రీవాల్ 

    కొత్త ఎక్సైజ్ పాలసీకి సంబంధించి మనీలాండరింగ్ ఆరోపణలపై అరవింద్ కేజ్రీవాల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కస్టడీలో ఉన్నారు.

    దేశంలోని అత్యంత అవినీతి, నియంతృత్వ శక్తికి తన భర్త సవాల్ విసిరారని సునీతా కేజ్రీవాల్ డిజిటల్ మీడియా సమావేశంలో అన్నారు.

    దీనితో పాటు, ప్రజలు తమ ఆశీర్వాదాలు , ప్రార్థనల ద్వారా తనను ఆదరించాలని కోరారు. అరవింద్ కేజ్రీవాల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ బృందం మార్చి 21న అదుపులోకి తీసుకుంది.

    గురువారం మరోసారి రూస్ అవెన్యూ కోర్టుకు హాజరయ్యారు. కోర్టులో అరవింద్ కేజ్రీవాల్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

    అయితే, తర్వాత కోర్టు అరవింద్ కేజ్రీవాల్‌కు ఈడీ కస్టడీని ఏప్రిల్ 1 వరకు పొడిగించింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    అరవింద్ కేజ్రీవాల్

    తాజా

    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ

    అరవింద్ కేజ్రీవాల్

    Ayodhya Temple: జనవరి 22న అయోధ్యలో మోదీ.. మరి 'ఇండియా' కూటమి నేతలు ఎక్కడంటే!  అయోధ్య
    Arvind Kejriwal: దర్యాప్తు సంస్థ విచారణకు అరవింద్ కేజ్రీవాల్ గైర్హాజరు..గోవా పర్యటనకు కేజ్రీవాల్   భారతదేశం
    Delhi: బీజేపీ కుట్ర.. మా ఏడుగురు ఎమ్మెల్యేలకు రూ.25 కోట్ల చొప్పున ఆఫర్: కేజ్రీవాల్ సంచలన కామెంట్స్ దిల్లీ
    Kejriwal: ఈడీ విచారణకు మరోసారి డుమ్మా కొట్టనున్నఅరవింద్ కేజ్రీవాల్ నరేంద్ర మోదీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025