NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Uravakonda: ఉరవకొండ ఓటరు జాబితా అవకతవకలు.. మరో అధికారిపై సస్పెన్షన్ వేటు 
    తదుపరి వార్తా కథనం
    Uravakonda: ఉరవకొండ ఓటరు జాబితా అవకతవకలు.. మరో అధికారిపై సస్పెన్షన్ వేటు 
    ఉరవకొండ ఓటరు జాబితా అవకతవకలు.. మరో అధికారిపై సస్పెన్షన్ వేటు

    Uravakonda: ఉరవకొండ ఓటరు జాబితా అవకతవకలు.. మరో అధికారిపై సస్పెన్షన్ వేటు 

    వ్రాసిన వారు Stalin
    Aug 21, 2023
    02:49 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఓటర్ల జాబితా తయారీలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై అనంతపురం జడ్పీ సీఈఓ, ఉరవకొండ రిటర్నింగ్‌అధికారి భాస్కర్‌రెడ్డిపై ఎన్నికల సంఘం సస్పెన్షన్‌వేటు వేసిన విషయం తెలిసిందే.

    ఇదే వ్యవవహారంలో తాజాగా ఈసీ మరో అధికారిని సస్పెండ్ చేసింది. భాస్కర్‌రెడ్డికి ముందు సీఈఓగా ఉన్న శోభా స్వరూపా రాణిపై సస్పెన్షన్‌వేటు పడింది.

    ఈ మేరకు ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

    స్థానిక ఎమ్మెల్యే, టీడీపీ నాయకుడు పయ్యావుల కేశవ్ ఫిర్యాదు మేరకు ఈసీ విచారణ చేపట్టింది.

    తన నియోజకవర్గంలో దాదాపు 6వేల బోగస్ ఓట్లను చేర్చడంతో పాటు దాదాపు 2వేలకు పైగా టీడీపీ సానుభూతిపరుల ఓట్లు తొలగించడానికి భాస్కరరెడ్డి కారణమని కేశవ్ ఆరోపించారు.

    కేశవ్

    భాస్కర్ రెడ్డిపై మళ్లీ ఈసీకి ఫిర్యాదు చేసిన పయ్యావుల కేశవ్ 

    ఓటరు జాబితా తయారీలో జరిగిన అవకతవకలు జరిగాయంటూ గత ఆరు నెలలుగా జిల్లా కలెక్టర్, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో)తో సహా వివిధ స్థాయిల్లో పయ్యావుల కేశవ్ ఫిర్యాదు చేసినా, పట్టించుకోలేదు. దీంతో ఆయన నేరుగా కేంద్రం ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించారు.

    దీనికి సంబంధించిన ఆధారాలను కూడా కేశవ్ ఎన్నికల సంఘానికి అందజేశారు.

    ఈ క్రమంలో విచారణ చేపట్టిన రాష్ట్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాలో చోటుచేసుకున్న పొరపాట్లకు బాధ్యులుగా పేర్కొంటూ ఇద్దరు తహసీల్దార్లు, మరికొందరు వీఆర్వోలను సస్పెండ్ చేసింది.

    అయితే రిటర్నింగ్ అధికారి, జెడ్పీ సీఈవో భాస్కరరెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ కేశవ మళ్లీ ఈసీకి ఫిర్యాదు చేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఓటు
    ఎన్నికల సంఘం
    ఆంధ్రప్రదేశ్

    తాజా

    Hyderabad: దేశంలో మొదటి ఏఐ బేస్డ్ డయాగ్నస్టిక్ టూల్.. నిలోఫర్ లో అందుబాటులోకి..  హైదరాబాద్
    Shilpa shirodkar: కొవిడ్‌ బారిన పడిన బాలీవుడ్‌ నటి శిల్పా శిరోద్కర్‌.. సోషల్‌ మీడియాలో పోస్టు  బాలీవుడ్
    HariHara VeeraMallu : హరిహర వీరమల్లు నుంచి మూడో సాంగ్.. రిలీజ్ ఎప్పుడో తెలుసా? హరిహర వీరమల్లు
    Jaish-e-Mohammed: జైషే మహ్మద్ ఎలా పుట్టింది? దాని పేరు ప్రతిసారి ఎందుకు మారుతూనే ఉంది? జైషే మహ్మద్

    ఓటు

    వృద్ధులు, వికలాంగులు ఇంటి నుంచి ఓటు వేయొచ్చు: ఎన్నికల సంఘం ఎన్నికల సంఘం
    ఆ తేదీ నాటికి 18ఏళ్లు నిండిన వారిని ఓటరు జాబితాలో చేర్చండి: ఎన్నికల సంఘం  ఎన్నికల సంఘం

    ఎన్నికల సంఘం

    అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌: త్రిపురలో ఫిబ్రవరి 16న, మేఘాలయ, నాగాలాండ్‌లో 27న పోలింగ్ అసెంబ్లీ ఎన్నికలు
    National Voters Day: యువ ఓటర్లే ​​భారత ప్రజాస్వామ్యానికి భవిష్యత్: సీఈసీ భారతదేశం
    ఏపీ, తెలంగాణల్లో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల తెలంగాణ
    తెలంగాణ కొత్త సచివాలయ ప్రారంభోత్సవం వాయిదా, ఎన్నికల కోడ్ కారణం హైదరాబాద్

    ఆంధ్రప్రదేశ్

    ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా ధీరజ్ సింగ్ ఠాకూర్ ప్రమాణం.. గవర్నర్ సమక్షంలో బాధ్యతల స్వీకరణ భారతదేశం
    హైదరాబాద్‌-విజయవాడ రెగ్యులర్ సర్వీసుల నిలిపివేత.. గుంటూరు మీదుగా దారి మళ్లింపు టీఎస్ఆర్టీసీ
    విశాఖపట్నం జిల్లాలో ఘోరం.. బంగారం కోసం యజమాని తల్లిని హత్య చేసిన వాలంటీర్ విశాఖపట్టణం
    Amrit Bharat Station Scheme: విజయవాడ డివిజన్‌లో 11 రైల్వే స్టేషన్లకు మహర్దశ  విజయవాడ సెంట్రల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025