
Tariff On India: నవంబర్ చివరి నాటికి అమెరికా 25 శాతం టారిఫ్ తొలగించే అవకాశం: CEA
ఈ వార్తాకథనం ఏంటి
రష్యా నుంచి చమురు దిగుమతులు చేస్తున్నారంటూ అమెరికా 25 శాతం పరస్పర సుంకాలతో పాటు మరో 25 శాతం శిక్షార్హమైన సుంకాలను విధించింది ఈ క్రమంలో ట్రంప్ ప్రభుత్వం ప్రపంచంలోని ఏ దేశంపైనా లేని విధంగా భారత్పై మొత్తం 50 శాతం వరకు టారిఫ్లను అమలు చేసింది. అయితే ఇప్పుడు అమెరికా తన నిర్ణయంపై పునరాలోచన చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. భారత్పై కఠినమైన సుంకాలు కొనసాగితే, న్యూఢిల్లీ రష్యా, చైనా దేశాలకు మరింత చేరువ అవుతుందనే ఆందోళన అమెరికా పాలకవర్గాలను వేధిస్తోంది. అందువల్ల ఏదో విధంగా భారత్తో జరుగుతున్న ఈ టారిఫ్ల యుద్ధానికి ముగింపు పలకాలని అమెరికా ప్రయత్నిస్తోంది.
వివరాలు
శుభవార్త తెలిపిన ఆర్థిక సలహాదారు
ఈ నేపథ్యంలో, భారత ప్రధాన ఆర్థిక సలహాదారు వి. ఆనంద నాగేశ్వర్ గురువారం ఒక శుభవార్తను పంచుకున్నారు. రాబోయే కాలంలో అమెరికా భారత్పై విధించిన సుంకాలను ఉపసంహరించుకోవచ్చని, పరస్పర సుంకాలను కూడా సడలించే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. న్యూఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ, ఆగస్టులో అమెరికా విధించిన 25 శాతం శిక్షార్హ సుంకాన్ని నవంబర్ చివరి నాటికే వాపసు తీసుకునే అవకాశముందని తెలిపారు. అయితే ఇది తాను గట్టి ఆధారాలతో చెప్పడం కాదని, పరిస్థితుల ఆధారంగా ఇలాగే కొనసాగితే అవి ఉపసంహరించబడతాయన్న అంచనా మాత్రమేనని స్పష్టం చేశారు.
వివరాలు
ఇరుదేశాల మధ్య మొదటి అధికారిక సమావేశం
అలాగే ప్రస్తుతం అమలులో ఉన్న మరో 25 శాతం పరస్పర సుంకాన్ని 10-15 శాతం మధ్యకే తగ్గించే అవకాశం ఉందని తన వ్యక్తిగత అంచనాను వెల్లడించారు. భారత వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రత్యేక కార్యదర్శి, దేశ ప్రధాన వాణిజ్య సంధానకర్త రాజేష్ అగర్వాల్, దక్షిణ, మధ్య ఆసియాకు అమెరికా వాణిజ్య ప్రతినిధి బ్రెండన్ లించ్ను న్యూఢిల్లీలో కొన్ని రోజుల క్రితం కలిసిన నేపథ్యంలోనే ఈ వ్యాఖ్యలు వెలువడినట్టు భావిస్తున్నారు. గడిచిన నెలలో ట్రంప్ సుంకాల నిర్ణయం తర్వాత ఇరుదేశాల మధ్య ఇదే మొదటి అధికారిక సమావేశం కావడం గమనార్హం.