Page Loader
India-Pak: భారత్‌-పాక్‌ ఉద్రిక్తతలు.. జైశంకర్,పాక్ ప్రధానికి అమెరికా విదేశాంగ కార్యదర్శి ఫోన్  
భారత్‌-పాక్‌ ఉద్రిక్తతలు.. జైశంకర్,పాక్ ప్రధానికి అమెరికా విదేశాంగ కార్యదర్శి ఫోన్

India-Pak: భారత్‌-పాక్‌ ఉద్రిక్తతలు.. జైశంకర్,పాక్ ప్రధానికి అమెరికా విదేశాంగ కార్యదర్శి ఫోన్  

వ్రాసిన వారు Sirish Praharaju
May 01, 2025
09:08 am

ఈ వార్తాకథనం ఏంటి

పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో భారత్‌, పాకిస్థాన్‌ దేశాల మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. ఈ పరిస్థితిని యావత్‌ ప్రపంచం గమనిస్తూ, ఆందోళన వ్యక్తం చేస్తోంది. తాజా పరిణామాల నేపథ్యంలో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో స్పందించారు. ఆయన భారత విదేశాంగ మంత్రి ఎస్‌. జైశంకర్‌, పాకిస్థాన్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌లతో ఫోన్‌ కాల్ ద్వారా మాట్లాడారు. ఉత్కంఠను తగ్గించే దిశగా చర్యలు తీసుకోవాలని ఇరు దేశాలకు సూచించారు. అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి టమ్మీ బ్రూస్ ఈ విషయాన్ని ఓ అధికారిక ప్రకటనలో వెల్లడించారు.

వివరాలు 

దర్యాప్తుకు పాకిస్థాన్‌ అధికారులు పూర్తి స్థాయిలో సహకరించాలి 

"భారత్‌ ఉగ్రవాదంపై తీసుకునే అన్ని చర్యలకు మేము సంపూర్ణ మద్దతు ఇస్తాం," అని రూబియో జైశంకర్‌తో మాట్లాడిన సమయంలో హామీ ఇచ్చారని ఆమె చెప్పారు. అదే సమయంలో దక్షిణాసియాలో శాంతి,భద్రత నెలకొల్పడానికి భారత్‌, పాకిస్థాన్‌ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారని పేర్కొన్నారు. అంతేకాకుండా,షెహబాజ్‌ షరీఫ్‌తో మాట్లాడినప్పుడు రూబియో,పహల్గాం ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. ఈ దాడికి సంబంధించి జరిపే దర్యాప్తుకు పాకిస్థాన్‌ అధికారులు పూర్తి స్థాయిలో సహకరించాలని ఆయన కోరారు. భారత్‌తో నేరుగా చర్చలకు ముందుకు రావాలని కూడా సూచించారు.ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే చర్యలకు పూర్తిగా చెక్‌ వేయాల్సిందేనని,అటువంటి హింసాత్మక చర్యలకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించాలని రూబియో స్పష్టం చేశారు.