English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / India-Pak: భారత్‌-పాక్‌ ఉద్రిక్తతలు.. జైశంకర్,పాక్ ప్రధానికి అమెరికా విదేశాంగ కార్యదర్శి ఫోన్  
    తదుపరి వార్తా కథనం
    India-Pak: భారత్‌-పాక్‌ ఉద్రిక్తతలు.. జైశంకర్,పాక్ ప్రధానికి అమెరికా విదేశాంగ కార్యదర్శి ఫోన్  
    భారత్‌-పాక్‌ ఉద్రిక్తతలు.. జైశంకర్,పాక్ ప్రధానికి అమెరికా విదేశాంగ కార్యదర్శి ఫోన్

    India-Pak: భారత్‌-పాక్‌ ఉద్రిక్తతలు.. జైశంకర్,పాక్ ప్రధానికి అమెరికా విదేశాంగ కార్యదర్శి ఫోన్  

    వ్రాసిన వారు Sirish Praharaju
    May 01, 2025
    09:08 am

    ఈ వార్తాకథనం ఏంటి

    పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో భారత్‌, పాకిస్థాన్‌ దేశాల మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి.

    ఈ పరిస్థితిని యావత్‌ ప్రపంచం గమనిస్తూ, ఆందోళన వ్యక్తం చేస్తోంది.

    తాజా పరిణామాల నేపథ్యంలో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో స్పందించారు.

    ఆయన భారత విదేశాంగ మంత్రి ఎస్‌. జైశంకర్‌, పాకిస్థాన్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌లతో ఫోన్‌ కాల్ ద్వారా మాట్లాడారు.

    ఉత్కంఠను తగ్గించే దిశగా చర్యలు తీసుకోవాలని ఇరు దేశాలకు సూచించారు.

    అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి టమ్మీ బ్రూస్ ఈ విషయాన్ని ఓ అధికారిక ప్రకటనలో వెల్లడించారు.

    వివరాలు 

    దర్యాప్తుకు పాకిస్థాన్‌ అధికారులు పూర్తి స్థాయిలో సహకరించాలి 

    "భారత్‌ ఉగ్రవాదంపై తీసుకునే అన్ని చర్యలకు మేము సంపూర్ణ మద్దతు ఇస్తాం," అని రూబియో జైశంకర్‌తో మాట్లాడిన సమయంలో హామీ ఇచ్చారని ఆమె చెప్పారు.

    అదే సమయంలో దక్షిణాసియాలో శాంతి,భద్రత నెలకొల్పడానికి భారత్‌, పాకిస్థాన్‌ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారని పేర్కొన్నారు.

    అంతేకాకుండా,షెహబాజ్‌ షరీఫ్‌తో మాట్లాడినప్పుడు రూబియో,పహల్గాం ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు.

    ఈ దాడికి సంబంధించి జరిపే దర్యాప్తుకు పాకిస్థాన్‌ అధికారులు పూర్తి స్థాయిలో సహకరించాలని ఆయన కోరారు.

    భారత్‌తో నేరుగా చర్చలకు ముందుకు రావాలని కూడా సూచించారు.ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే చర్యలకు పూర్తిగా చెక్‌ వేయాల్సిందేనని,అటువంటి హింసాత్మక చర్యలకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించాలని రూబియో స్పష్టం చేశారు.

    మీరు పూర్తి చేశారు
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    అమెరికా

    తాజా

    Sukhdev Singh Dindsa: కేంద్ర మాజీ మంత్రి సుఖ్‌దేవ్‌ సింగ్‌ దిండ్సా కన్నుమూత కేంద్రమంత్రి
    Lucknow Super Giants: ఐపీఎల్ చరిత్రలో లక్నో జట్టు చెత్త రికార్డు లక్నో సూపర్‌జెయింట్స్
    Chandrababu: టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికైన చంద్రబాబు  తెలుగు దేశం పార్టీ/టీడీపీ
    Jyoti Malhotra: హర్యానా జైల్లో జ్యోతి మల్హోత్రాను కలిసిన తండ్రి హరీష్ జ్యోతి మల్హోత్రా

    అమెరికా

    Donald Trump: భారత్‌ ఫార్మా రంగంపై ట్రంప్ టారిఫ్ బాంబు.. హైదరాబాద్‌పై ప్రభావం డొనాల్డ్ ట్రంప్
    US: అమెరికాలో విదేశీ విద్యార్థులకు వీసాల రద్దుతో కలకలం - న్యాయపోరాటానికి సిద్ధమైన విద్యార్థులు  అంతర్జాతీయం
    USA-China: 145% టారిఫ్‌ల మధ్య చర్చలు.. చైనాతో ఒప్పందానికి గ్రీన్ సిగ్నల్? చైనా
    Indian student: అమెరికాలో వీసా రద్దు కలకలం.. భారత విద్యార్థికి కోర్టులో ఊరట ప్రపంచం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025