NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / ఉత్తరాఖండ్ : టన్నెల్‌లో చిక్కుకున్న 40 మంది కార్మికులు..పైపుల ద్వారా ఆహారం, ఆక్సిజన్ సరఫరా
    తదుపరి వార్తా కథనం
    ఉత్తరాఖండ్ : టన్నెల్‌లో చిక్కుకున్న 40 మంది కార్మికులు..పైపుల ద్వారా ఆహారం, ఆక్సిజన్ సరఫరా
    40 మందిని రక్షించేందుకు భారీ ఆప్షన్

    ఉత్తరాఖండ్ : టన్నెల్‌లో చిక్కుకున్న 40 మంది కార్మికులు..పైపుల ద్వారా ఆహారం, ఆక్సిజన్ సరఫరా

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Nov 13, 2023
    07:14 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ మేరకు నిర్మాణంలో ఉన్న ఓ సొరంగం మధ్యలో కుప్పకూలిపోయింది. ఫలితంగా అందులోని 40 మంది కార్మికులు చిక్కుకుపోయారు. ఈ ఘటన ఆదివారం జరిగింది.

    ఈ క్రమంలో సొరంగం రాళ్లు కార్మికుల మీద పడటంతో అందులో ఇరుక్కుపోయారు. సహాయక చర్యలు చేపట్టేందుకు ప్రయత్నిస్తున్నా సొరంగం రాళ్లు మీద పడే ప్రమాదం ఉంది.

    ఈ నేపథ్యంలో సొరంగంలో చిక్కుకున్న వారికి ఓ పైపు ద్వారా ఆహారం, ఆక్సిజన్ అందిస్తున్నారు.

    ఉత్తరకాశీ జిల్లాలో యమునోత్రి జాతీయ రహదారిపై సిక్యారా-దండల్గావ్ మధ్య నిర్మాణంలో ఉన్న ఉన్న ఓ సొరంగం కూలిపోయింది.

    ఈ మేరకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం కేంద్రామనికి సమాచారం అందించింది.తక్షణమే రంగంలోకి దిగిన ఎన్డీఆర్ఎఫ్ సహాయ చర్యల్లో నిమగ్నమైంది.

    Details

    మరో 35 మీటర్లు వెళ్లాల్సి ఉంది : పోలీసులు  

    సొరంగంలో చిక్కుకుపోయిన వారికి ఆక్సిజన్ సహా ఆహారం పైపులైన్ లో పంపిస్తున్నారు.

    ఇదే సమయంలో సొరంగంలోకి 15 మీటర్ల మేర ప్రవేశించామని, మరో 35 మీటర్లు వెళ్లాల్సి ఉందని పోలీసులు వెల్లడించారు.

    ప్రస్తుతం సొరంగంలో ఉన్న వారంతా సురక్షితంగానే ఉన్నారన్న పోలీసులు, సొరంగంలోకి ప్రవేశించేందుకు ఇతర మార్గాలను అన్వేషిస్తున్నామన్నారు.

    ఘటనపై ప్రధాని మోదీ సైతం స్పందించారు. ఈ క్రమంలోనే సొంరంగంలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ఉత్తరాఖండ్ కు అన్నివిధాలా సహాయ సహకారాలను అందిస్తామని స్పష్టం చేశారు.

    ఎన్డీఆర్ఎఫ్, ఎస్టీఆర్ఎఫ్ సహా పోలీసులు, స్ధానిక ప్రభుత్వ అధికారులు సహాయక చర్యల్లో భాగమయ్యారు.

    ఆపరేషన్‌లో 13 మీటర్ల వెడల్పు సొరంగం లోపల చెత్తను తొలగించేందుకు రెండు జేసీబీలు, ఓ పోక్లెయిన్ యంత్రాన్ని ఉపయోగిస్తున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఉత్తరాఖండ్

    తాజా

    CSK vs RR : చైన్నై సూపర్ కింగ్స్‌పై రాజస్థాన్ విజయం రాజస్థాన్ రాయల్స్
    Andhra Pradesh: ఏపీలో వైద్య విప్లవానికి రంగం సిద్ధం.. బీమా ద్వారా ప్రతి కుటుంబానికి ఉచిత వైద్య సేవలు! ఆంధ్రప్రదేశ్
    Tata Harrier EV: జూన్ 3న హారియర్ EV ఆవిష్కరణ.. టాటా నుండి మరో ఎలక్ట్రిక్ మాస్టర్‌పీస్! టాటా మోటార్స్
    Turkey: టర్కీ,అజర్‌బైజాన్‌లకు షాక్ ఇస్తున్న భారతీయులు.. 42% తగ్గిన వీసా అప్లికేషన్స్..  టర్కీ

    ఉత్తరాఖండ్

    50వేల మందిని రాత్రికిరాత్రి బలవంతంగా ఖాళీ చేయించలేం: సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు
    డేంజర్ జోన్‌లో జోషిమఠ్.. 678 భవనాలకు పగుళ్లు భారతదేశం
    జోషిమఠ్‌ సంక్షోభం: 'హిమాలయాల్లో చాలా పట్టణాలు మునిగిపోతాయ్'.. నిపుణుల హెచ్చరిక భారతదేశం
    ISRO: జోషిమఠ్‌ పట్టణంలో 12రోజుల్లో 5.4 సెం.మీ కుంగిన భూమి ఇస్రో
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025