NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Delhi: 15 ఏళ్లు దాటిన వాహనాలకు ఇకపై ఇంధనం అందదు
    తదుపరి వార్తా కథనం
    Delhi: 15 ఏళ్లు దాటిన వాహనాలకు ఇకపై ఇంధనం అందదు
    15 ఏళ్లు దాటిన వాహనాలకు ఇకపై ఇంధనం అందదు

    Delhi: 15 ఏళ్లు దాటిన వాహనాలకు ఇకపై ఇంధనం అందదు

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Mar 01, 2025
    05:29 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    దేశ రాజధాని దిల్లీలో కొత్త ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించిన వెంటనే కాలుష్య నియంత్రణపై దృష్టి సారించింది.

    శనివారం పర్యావరణ మంత్రి మంజిందర్ సింగ్ సిర్సా అధికారులతో సమావేశమై పలు కీలక నిర్ణయాలను ప్రకటించారు.

    ఈ క్రమంలో 15 ఏళ్ల పైబడిన వాహనాలకు మార్చి 31 తర్వాత ఇంధనం అందకూడదని కీలక నిబంధన తీసుకొచ్చారు.

    15 ఏళ్ల వాహనాలకు ఇంధనంపై ఆంక్షలు

    మంత్రి సిర్సా ప్రకటన మేరకు పెట్రోల్ బంకుల వద్ద ప్రత్యేక గాడ్జెట్‌లు అమర్చనున్నారు.

    వీటి ద్వారా 15 ఏళ్లు పైబడిన వాహనాలను గుర్తించి, వాటికి ఇంధనం అందకుండా చేయనున్నారు. ఈ ఆంక్షల గురించి కేంద్ర పెట్రోలియం శాఖకు సమాచారం అందిస్తామని మంత్రి తెలిపారు.

    Details

    యాంటీ స్మోగ్ గన్ల అమలు

    దిల్లీలో అధిక కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఎత్తైన భవనాలు, హోటళ్లు, వాణిజ్య సముదాయాల్లో యాంటీ స్మోగ్ గన్లు అమర్చడం తప్పనిసరి చేయనున్నట్లు మంత్రి ప్రకటించారు.

    ఎలక్ట్రిక్ బస్సుల ప్రోత్సాహం

    కాలుష్యాన్ని తగ్గించేందుకు 90 శాతం సీఎన్‌జీ బస్సులను డిసెంబర్ 2024 నాటికి దశలవారీగా ఉపసంహరించి, వాటి స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టనున్నారు.

    కాలుష్య కట్టడిపై నిర్లక్ష్యానికి విమర్శలు

    ప్రతేడాది శీతాకాలంలో దిల్లీ తీవ్ర వాయు కాలుష్యానికి గురవుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తాత్కాలిక చర్యలకే పరిమితం అవుతున్నాయన్న విమర్శలు ఉన్నాయి.

    కాలుష్య సమస్య కారణంగా విద్యా సంస్థలు మూతపడటం, విమానాల రాకపోకలకు అంతరాయం కలగడం, నగరవాసులకు ఊపిరి తీసుకోవడం కష్టంగా మారడం లాంటి సమస్యలు నెలకొంటున్నాయి.

    Detals

     తుక్కు విధానం అమలు 

    ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాలుష్య సమస్య ప్రధాన అంశంగా మారింది.

    బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)పై తీవ్ర విమర్శలు గుప్పించగా, ప్రభుత్వంలోకి వచ్చిన వెంటనే కొత్త ఆప్ సర్కారు కాలుష్య నియంత్రణ చర్యలకు శ్రీకారం చుట్టింది.

    కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన తుక్కు విధానాన్ని (Scrappage Policy) సమర్థవంతంగా అమలు చేయనున్నట్లు వెల్లడించారు.

    ఈ విధానం ద్వారా పాత, ఫిట్‌నెస్ లేని వాహనాలను తొలగించడం ద్వారా కాలుష్యాన్ని అదుపులోకి తేనున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    దిల్లీ
    కేంద్ర ప్రభుత్వం

    తాజా

    KTR: బీఆర్ఎస్ నేత కేటీఆర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు కల్వకుంట్ల తారక రామరావు (కేటీఆర్)
    CIRCADIAN APP: 7 సెకన్లలో గుండె సమస్యలను గుర్తించే యాప్‌.. 14 ఏళ్ల బాలుడి ఆవిష్కరణ గుండె
    #NewsBytesExplainer: డోనాల్డ్ ట్రంప్,ఎలాన్ మస్క్ స్నేహ బంధం ఎక్కడ చెడింది? డొనాల్డ్ ట్రంప్
    Starlink: ఎలాన్‌ మస్క్‌ స్టార్‌ లింక్‌కు సేవలకు గ్రీన్‌ సిగ్నల్‌  స్టార్‌లింక్‌

    దిల్లీ

    Arvind Kejriwal: కేజ్రీవాల్‌కి భారీ ఎదురుదెబ్బ: ఎర్లీ ట్రెండ్స్‌లో వెనకబడ్డ ఆప్! బీజేపీ
    Delhi Election Results: దిల్లీలో కమలం జోరు.. మ్యాజిక్ ఫిగర్ దాటేసిన బీజేపీ బీజేపీ
    AAP: ఆప్‌కు షాక్‌.. కేజ్రీవాల్ సహా కీలక నేతలంతా వెనకంజలో! అరవింద్ కేజ్రీవాల్
    Congress: దిల్లీలో కాంగ్రెస్ దారుణ ఓటమి.. ఖాతా కూడా తెరవలేకపోయిన హస్తం కాంగ్రెస్

    కేంద్ర ప్రభుత్వం

    OTT Platforms:  ఓటీటీ కంటెంట్‌పై కేంద్రం వార్నింగ్‌.. ఆ సన్నివేశాలు ఉంటే కఠిన చర్యలు  ఓటిటి
    JPC Members: జమిలి బిల్లుపై 48 గంటల గడువు.. జేపీసీ ఏర్పాటుకు స్పీకర్ ముందడుగు జమిలి ఎన్నికలు
    Vijay malya: విజయ్ మాల్యా ఆస్తుల విక్రయంతో బ్యాంకులకు రూ.14 వేల కోట్లు నిర్మలా సీతారామన్
    Delhi: పంట వ్యర్థాలను బహిరంగంగా దహనం చేసేవారికి కఠిన శిక్షతో పాటు భారీ జరిమానా భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025