NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / visakha Division: నాలుగు డివిజన్లతో దక్షిణ కోస్తా రైల్వే జోన్‌.. ముసాయిదా డీపీఆర్‌ సిద్ధం చేయాలని రైల్వేశాఖ ఆదేశాలు
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    visakha Division: నాలుగు డివిజన్లతో దక్షిణ కోస్తా రైల్వే జోన్‌.. ముసాయిదా డీపీఆర్‌ సిద్ధం చేయాలని రైల్వేశాఖ ఆదేశాలు
    నాలుగు డివిజన్లతో దక్షిణ కోస్తా రైల్వే జోన్‌.. ముసాయిదా డీపీఆర్‌ సిద్ధం చేయాలని రైల్వేశాఖ ఆదేశాలు

    visakha Division: నాలుగు డివిజన్లతో దక్షిణ కోస్తా రైల్వే జోన్‌.. ముసాయిదా డీపీఆర్‌ సిద్ధం చేయాలని రైల్వేశాఖ ఆదేశాలు

    వ్రాసిన వారు Sirish Praharaju
    Feb 06, 2025
    09:25 am

    ఈ వార్తాకథనం ఏంటి

    రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ ప్రయత్నాలు ఫలించాయి.

    విశాఖపట్టణం కేంద్రంగా ఏర్పాటు చేసిన దక్షిణ కోస్తా రైల్వే జోన్‌లో వాల్తేరు డివిజన్‌ను పూర్తిగా తొలగించకూడదని కేంద్రాన్ని ఒత్తిడికి గురి చేయడంతో, రైల్వే శాఖ తాజాగా విశాఖపట్నం డివిజన్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

    కొత్త జోన్‌లో విజయవాడ, గుంటూరు, గుంతకల్లు డివిజన్లు మాత్రమే ఉండేలా డీపీఆర్ సిద్ధమవుతోంది.

    తాజా నిర్ణయంతో విశాఖపట్నం డివిజన్ కూడా ఇందులో చేరనుంది. దీనికోసం ముసాయిదా డీపీఆర్ సిద్ధం చేయాలని జోన్ ప్రత్యేక అధికారి (ఓఎస్‌డీ)కి ఆదేశాలు ఇచ్చారు.

    తుది డీపీఆర్‌పై బోర్డు ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అయితే, డ్రాఫ్ట్ డీపీఆర్ దాదాపు ఖరారయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

    వివరాలు 

    విశాఖపట్నం డివిజన్ పరిధి

    వాల్తేరు డివిజన్‌లోని ఒడిశా ప్రాంతం ఇప్పటికే రాయగడ కేంద్రంగా కొత్త డివిజన్‌గా ఏర్పాటైంది.

    మిగిలిన ప్రాంతం విజయవాడ డివిజన్ పరిధిలోకి వచ్చేలా డీపీఆర్ రూపొందించబడుతోంది.

    తాజా మార్పుల ప్రకారం, పలాస-విశాఖపట్నం-దువ్వాడ, కూనేరు-విజయనగరం-నౌపడ-పర్లాఖెముండి, బొబ్బిలి-సాలూరు, సింహాచలం నార్త్-దువ్వాడ బైపాస్, వడ్లపూడి-దువ్వాడ, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్-జగ్గయ్యపాలెం సెక్షన్లను కలిపి 410 కి.మీ. వ్యాప్తితో విశాఖపట్నం డివిజన్‌ను ఏర్పాటు చేయనున్నారు.

    కొత్తవలస-బచేలి/కిరండోల్, కూనేరు-తెరువలి, సింగ్‌పూర్ రోడ్-కోరాపుట్, పర్లాఖెముండి-గుణుపూర్ సెక్షన్లను 680 కి.మీ. మేర రాయగడ డివిజన్‌లోకి చేర్చనున్నారు.

    ఈ డివిజన్ తూర్పు కోస్తా రైల్వే జోన్‌లో ఉంటుంది.

    వివరాలు 

    కొత్త జోన్‌లో నాలుగు డివిజన్లు

    ఇప్పటివరకు దక్షిణ కోస్తా రైల్వే జోన్‌లో విజయవాడ, గుంటూరు, గుంతకల్లు డివిజన్లు మాత్రమే ఉండేవి.

    తాజా నిర్ణయంతో విశాఖపట్నం డివిజన్ కూడా చేర్చడంతో మొత్తం నాలుగు డివిజన్లు ఉంటాయి.

    సికింద్రాబాద్ కేంద్రంగా ఉన్న దక్షిణ మధ్య రైల్వే జోన్‌లో సికింద్రాబాద్,హైదరాబాద్,నాందేడ్ డివిజన్లు కొనసాగుతాయి.

    తూర్పు కోస్తా రైల్వే జోన్‌లో ఖుర్దా రోడ్, సంబల్‌పూర్, రాయగడ డివిజన్లు ఉంటాయి.

    రైల్వే మార్పులు

    దక్షిణ కోస్తా రైల్వే జోన్ నుంచి 250 కి.మీ. దూరాన్ని దక్షిణ మధ్య రైల్వే జోన్‌కు బదిలీ చేస్తారు.

    అలాగే,దక్షిణ మధ్య రైల్వే జోన్‌లోని 46 కి.మీ. భాగాన్ని దక్షిణ కోస్తా జోన్‌లో చేర్చనున్నారు.

    గుంతకల్లు డివిజన్‌లోని రాయచూరు-వాడి మధ్య 108 కి.మీ. సెక్షన్‌ను సికింద్రాబాద్ డివిజన్ పరిధిలోకి బదిలీ చేయనున్నారు.

    వివరాలు 

    డీపీఆర్ మార్పులు

    ఈ మార్పులతో సింగరేణి బొగ్గు గనుల నుంచి యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌కు బొగ్గు రవాణా మరింత సమర్థవంతంగా మారనుంది.

    విశాఖ కేంద్రంగా ఏర్పాటయ్యే దక్షిణ కోస్తా రైల్వే జోన్‌కు సంబంధించి సమగ్ర ప్రాజెక్ట్ నివేదికలో మార్పులు చేయనున్నారు.

    ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గత నెలలో విశాఖలో జోన్ కార్యాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

    కొత్త డీపీఆర్ ద్వారా మొత్తం లైన్ పొడవు, ట్రాక్ పొడవు, స్టేషన్ల వివరాలు స్పష్టంగా లభించనున్నాయి.

    దీని ఆధారంగా సిబ్బంది కేటాయింపు తదితర నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది.

    ఇకపై, వాల్తేరు డివిజన్‌కు ఉన్న డీఆర్‌ఎం పదవిని విశాఖపట్నం డివిజన్ డీఆర్‌ఎంగా మార్చనున్నారు.

    త్వరలో దక్షిణ కోస్తా రైల్వే జోన్‌కు జనరల్ మేనేజర్‌ను నియమించనున్నారు.

    వివరాలు 

    ఆదాయం కోల్పోతున్న విశాఖ డివిజన్

    వాల్తేరు డివిజన్‌కు ఏటా వచ్చే రూ.10,000 కోట్లలో సగం ఆదాయం విశాఖపట్నం-కిరండోల్ మార్గంలోని ఇనుప ఖనిజ రవాణా ద్వారా వస్తోంది.

    ఈ మార్గాన్ని రాయగడ డివిజన్‌లో చేర్చడం వల్ల, కొత్తగా ఏర్పాటయ్యే విశాఖపట్నం డివిజన్ ఆదాయాన్ని కోల్పోయే పరిస్థితి నెలకొంటుంది.

    జోన్ కల సాకారమవుతోంది

    విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేయాలనే డిమాండ్ దశాబ్దాలుగా ఉంది.

    2014లో రాష్ట్ర విభజన హామీల్లో దీనిని పేర్కొన్నారు. 2019 ఎన్నికలకు ముందు కేంద్రం దీన్ని ప్రకటించింది.

    కానీ వాల్తేరు డివిజన్ తొలగించాలనే ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. తాజా మార్పులతో కొత్త జోన్ త్వరలో కార్యరూపం దాల్చనుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    విశాఖపట్టణం

    తాజా

    2025 Suzuki V-Strom 800DE: భారత్ లో విడుదలైన 2025 సుజుకి V-స్ట్రోమ్ 800DE.. రూ.10,30,000 ఎక్స్-షోరూమ్ ధర ఆటో మొబైల్
    Elon Musk: కొత్త పార్టీ పెట్టేందుకు ఎలాన్ మస్క్ సంచలన నిర్ణయం.. మస్క్ పెట్టిన పోల్‌కు భారీ రెస్పాన్స్..  ఎలాన్ మస్క్
    Chenab bridge: ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే బ్రిడ్జ్ చినాబ్ వంతెన ప్రారంభించిన ప్రధాని మోదీ ..  నరేంద్ర మోదీ
    Home loan: గృహ రుణాలదారులకు ఊరట.. వడ్డీ రేట్లు తగ్గించిన ఆర్‌బీఐ  ఆర్ బి ఐ

    విశాఖపట్టణం

    Visakhapatnam: విశాఖలో తహసీల్దార్‌ దారుణ హత్య.. ఉలిక్కిపడ్డ రెవెన్యూ యంత్రాంగం  ఆంధ్రప్రదేశ్
    Yashasvi Jaiswal: చిన్న వయుసులో టెస్టుల్లో డబుల్ సెంచరీ సాధించిన మూడో ప్లేయర్ జైస్వాల్  టీమిండియా
    Milan 2024: నేటి నుంచి విశాఖపట్నంలో ప్రతిష్టాత్మక మిలన్-2024 .. పాల్గొనున్న 50కి పైగా దేశాలు  భారతదేశం
    IIM Vizag's Campus: ఐఐఎం వైజాగ్ క్యాంపస్‌ను ప్రారంభించనున్న ప్రధాని మోదీ  భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025