NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Waqf bill: రాజ్యసభ ఆమోదం పొందిన వక్ఫ్‌ సవరణ బిల్లు
    తదుపరి వార్తా కథనం
    Waqf bill: రాజ్యసభ ఆమోదం పొందిన వక్ఫ్‌ సవరణ బిల్లు
    రాజ్యసభ ఆమోదం పొందిన వక్ఫ్‌ సవరణ బిల్లు

    Waqf bill: రాజ్యసభ ఆమోదం పొందిన వక్ఫ్‌ సవరణ బిల్లు

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Feb 13, 2025
    12:11 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) అధ్యయనం చేసిన 'వక్ఫ్‌ సవరణ బిల్లు-2024' నివేదికను కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో ఇవాళ ప్రవేశపెట్టింది.

    బీజేపీ ఎంపీ జగదంబికా పాల్‌ జేపీసీకి చైర్మన్‌గా వ్యవహరించగా, సంజయ్‌ తదితరులు ముసాయిదా బిల్లుపై తమ నివేదికను హిందీ, ఇంగ్లీష్‌ భాషల్లో సభ ముందుకు తీసుకొచ్చారు.

    రాజ్యసభ ఎంపీ మేధా కులకర్ణి నివేదికను సభలో ప్రవేశపెట్టిన వెంటనే గందరగోళం ఏర్పడింది.

    విపక్ష ఎంపీలు తమ అసమ్మతి (డిస్సెంట్‌) నోట్ తొలగించారని ఆరోపిస్తూ నిరసన తెలుపుతూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

    దీంతో చైర్మన్‌ జగదీప్‌ ధన్‌ఖర్‌ సభను 20 నిమిషాల పాటు వాయిదా వేశారు. అనంతరం సమావేశాలు పునఃప్రారంభమైనా విపక్షాలు నిరసన కొనసాగించాయి. అయినా రాజ్యసభ ఈ నివేదికను ఆమోదించింది.

    Details

    జేపీసీ నివేదిక కీలకాంశాలు 

    జనవరి 29న కమిటీ ముసాయిదా నివేదికను 15-11 మెజారిటీ ఓటుతో ఆమోదించింది.

    బీజేపీ సూచించిన 14 సవరణలను కమిటీ ఆమోదించగా, ప్రతిపక్ష సభ్యులు సూచించిన మార్పులను తిరస్కరించింది.

    స్వీకరించిన సవరణల ప్రకారం

    రాష్ట్ర వక్ఫ్‌ బోర్డుల్లో ముస్లిం ఓబీసీ వర్గానికి చెందిన ఒక సభ్యుడు ఉండాలి.

    అఘాఖానీ, బొహ్రా వర్గాలకు ప్రత్యేక వక్ఫ్‌ బోర్డుల ఏర్పాటుకు అనుమతి.

    వక్ఫ్‌ అలాల్‌ ఔలాద్‌ (కుటుంబ వక్ఫ్‌)లో మహిళల వారసత్వ హక్కులను రాష్ట్ర ప్రభుత్వాలు పరిరక్షించాలి.

    Details

     ప్రతిపక్షాల వ్యతిరేకత 

    విపక్షాలు ఈ బిల్లును ముస్లిం సమాజం రాజ్యాంగ హక్కులపై దాడిగా అభివర్ణించాయి.

    వక్ఫ్‌ బోర్డుల నిర్వహణలో జోక్యంగా మారుతుందని విమర్శించాయి.

    కాంగ్రెస్‌, డీఎంకే, టీఎంసీ, ఆప్‌, శివసేన (యూబీటీ), ఎఐఎంఐఎం వంటి పక్షాలు తమ అసమ్మతి నోటును సమర్పించాయి.

    బిల్లుపై కేంద్ర ప్రభుత్వ వాదన

    వక్ఫ్‌ ఆస్తుల నిర్వహణను ఆధునికత, పారదర్శకత, జవాబుదారీతనంతో నిర్వహించడమే బిల్లుకి ఉద్దేశం.

    వక్ఫ్‌ బోర్డులపై మరింత పర్యవేక్షణ అవసరమని బీజేపీ సభ్యుల వాదన.

    ఈ వివాదాల నడుమ రాజ్యసభ ఈ 'వక్ఫ్‌ సవరణ బిల్లు-2024' నివేదికను ఆమోదించింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    రాజ్యసభ
    కేంద్ర ప్రభుత్వం

    తాజా

    Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్ రిలీజ్.. కిరణ్ అబ్బవరం
    Rajamouli: గెలుపు ఎవరిదైనా.. ఓటమి గుండెల్లో నిలిచిపోతుంది.. రాజమౌళి ట్వీట్ వైరల్ రాజమౌళి
    PM Modi: జూన్ 04న మంత్రులతో ప్రధాని మోదీ భేటీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇదే మొదటి సమావేశం.. నరేంద్ర మోదీ
    IPL Prize Money: ఐపీఎల్ ఫైనల్ గెలిచిన జట్టుకు భారీగా నగదు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ హోల్డర్లకు ఎంత తెలుసా? ఐపీఎల్

    రాజ్యసభ

    ఫార్మసీ (సవరణ) బిల్లు - 2023కి గ్రీన్ సిగ్నల్.. విపక్షాల గందరగోళం మధ్య రాజ్యసభ ఆమోదం భారతదేశం
    ఆప్ ఎంపీపై సస్పెన్షన్ వేటు.. కారణమిదే? ఆమ్ ఆద్మీ పార్టీ/ఆప్
    'దిల్లీ సర్వీసెస్ బిల్లు'కు రాష్ట్రపతి ఆమోదం; దేశ రాజధానికి ఇక కొత్త చట్టం దిల్లీ సర్వీసెస్ బిల్లు
    రాజ్యసభ సభ్యుల్లో అత్యధిక ధనవంతులు మన తెలుగోళ్లే ఎంపీ

    కేంద్ర ప్రభుత్వం

    Suresh Gopi: పెట్రో ఉత్పత్తులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.38.41 లక్షల కోట్ల ఆదాయం భారతదేశం
    Phone Tapping: అత్యవసర పరిస్థితుల్లోనే ఫోన్ ట్యాపింగ్‌.. కేంద్రం కొత్త నిబంధనలు ఇండియా
    BJP: కేంద్ర నిధులను కేరళ వృథా చేసింది... బీజేపీ ఆరోపణలు! బీజేపీ
    Farmers: రైతులకు ఆధార్‌ తరహా కార్డుల జారీకి కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు తెలంగాణ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025