Page Loader
Warangal Railway Station: ఆధునిక సౌకర్యాలతో సుందరంగా మారిన వరంగల్ స్టేషన్‌
ఆధునిక సౌకర్యాలతో సుందరంగా మారిన వరంగల్ స్టేషన్‌

Warangal Railway Station: ఆధునిక సౌకర్యాలతో సుందరంగా మారిన వరంగల్ స్టేషన్‌

వ్రాసిన వారు Jayachandra Akuri
May 19, 2025
04:27 pm

ఈ వార్తాకథనం ఏంటి

వరంగల్‌ రైల్వే స్టేషన్‌ను చరిత్రాత్మక కాకతీయుల కళను ప్రతిబింబించేలా సుందరంగా ఆధునీకరించారు. ఈ రైల్వే స్టేషన్‌ను మే 22న పునఃప్రారంభం చేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ 'ఎక్స్‌'లో ఈ స్టేషన్‌ కొత్త రూపాన్ని పలు ఫొటోలతో పంచుకున్నారు. 2024 ఫిబ్రవరిలో ఈ ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన జరగగా, 2025 మే నాటికి పనులు పూర్తి అయ్యాయని తెలిపారు. గతంలో స్టేషన్ ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా మారిందో చూసేందుకు ఫొటోలు ఎంతో ఆకర్షణీయంగా ఉన్నాయి. వరంగల్‌ ఎంపీ కడియం కావ్య పేర్కొన్నట్లుగా, ఈ పునఃప్రారంభ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్‌గా పాల్గొంటారు.

Details

వరంగల్‌ రైల్వే స్టేషన్‌లో ఎస్కలేటర్లు

రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ కూడా ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. ఎంపీ కావ్యకి ప్రత్యేక ఆహ్వానం అందిందని ఆమె తెలిపింది. వరంగల్‌ రైల్వే స్టేషన్‌లో ఎస్కలేటర్లు, విశాలమైన పాదచారుల వంతెన, కళాత్మక శిల్పాలు, విశాలమైన ప్రాంగణం వంటి ఆధునిక సౌకర్యాలు కల్పించారు. అమృత్‌ భారత్‌ రైల్వే స్టేషన్ల అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా రూ. 25.11 కోట్ల ఖర్చుతో ఈ స్టేషన్‌ను మరింత అందంగా తీర్చిదిద్దారు. అయితే, కాజీపేటలో పనులు ఇంకా వేగంగా కొనసాగాల్సి ఉందని ఎంపీ కావ్య గుర్తుచేశారు. వరంగల్ రైల్వే స్టేషన్ అభివృద్ధి ద్వారా ప్రదేశం చరిత్రకళను మేళవిస్తూ ప్రయాణికులకు సౌకర్యవంతమైన వాతావరణాన్ని అందించనున్నది.