NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Warangal Railway Station: ఆధునిక సౌకర్యాలతో సుందరంగా మారిన వరంగల్ స్టేషన్‌
    తదుపరి వార్తా కథనం
    Warangal Railway Station: ఆధునిక సౌకర్యాలతో సుందరంగా మారిన వరంగల్ స్టేషన్‌
    ఆధునిక సౌకర్యాలతో సుందరంగా మారిన వరంగల్ స్టేషన్‌

    Warangal Railway Station: ఆధునిక సౌకర్యాలతో సుందరంగా మారిన వరంగల్ స్టేషన్‌

    వ్రాసిన వారు Jayachandra Akuri
    May 19, 2025
    04:27 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    వరంగల్‌ రైల్వే స్టేషన్‌ను చరిత్రాత్మక కాకతీయుల కళను ప్రతిబింబించేలా సుందరంగా ఆధునీకరించారు. ఈ రైల్వే స్టేషన్‌ను మే 22న పునఃప్రారంభం చేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.

    కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ 'ఎక్స్‌'లో ఈ స్టేషన్‌ కొత్త రూపాన్ని పలు ఫొటోలతో పంచుకున్నారు. 2024 ఫిబ్రవరిలో ఈ ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన జరగగా, 2025 మే నాటికి పనులు పూర్తి అయ్యాయని తెలిపారు.

    గతంలో స్టేషన్ ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా మారిందో చూసేందుకు ఫొటోలు ఎంతో ఆకర్షణీయంగా ఉన్నాయి.

    వరంగల్‌ ఎంపీ కడియం కావ్య పేర్కొన్నట్లుగా, ఈ పునఃప్రారంభ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్‌గా పాల్గొంటారు.

    Details

    వరంగల్‌ రైల్వే స్టేషన్‌లో ఎస్కలేటర్లు

    రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ కూడా ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. ఎంపీ కావ్యకి ప్రత్యేక ఆహ్వానం అందిందని ఆమె తెలిపింది.

    వరంగల్‌ రైల్వే స్టేషన్‌లో ఎస్కలేటర్లు, విశాలమైన పాదచారుల వంతెన, కళాత్మక శిల్పాలు, విశాలమైన ప్రాంగణం వంటి ఆధునిక సౌకర్యాలు కల్పించారు.

    అమృత్‌ భారత్‌ రైల్వే స్టేషన్ల అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా రూ. 25.11 కోట్ల ఖర్చుతో ఈ స్టేషన్‌ను మరింత అందంగా తీర్చిదిద్దారు. అయితే, కాజీపేటలో పనులు ఇంకా వేగంగా కొనసాగాల్సి ఉందని ఎంపీ కావ్య గుర్తుచేశారు.

    వరంగల్ రైల్వే స్టేషన్ అభివృద్ధి ద్వారా ప్రదేశం చరిత్రకళను మేళవిస్తూ ప్రయాణికులకు సౌకర్యవంతమైన వాతావరణాన్ని అందించనున్నది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    వరంగల్ తూర్పు
    రైల్వే స్టేషన్

    తాజా

    Warangal Railway Station: ఆధునిక సౌకర్యాలతో సుందరంగా మారిన వరంగల్ స్టేషన్‌ వరంగల్ తూర్పు
    Stock market: నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. సెన్సెక్స్‌ 271, నిఫ్టీ 74 పాయింట్ల చొప్పున నష్టం  స్టాక్ మార్కెట్
    Telangana: తెలంగాణా రాష్ట్రంలోని మూడు రైల్వే స్టేషన్లు పునః ప్రారంభం.. విశేషాలివే  తెలంగాణ
    IPL 2025: ఆర్సీబీ జట్టులో జింబాబ్వే ఫాస్ట్ బౌలర్‌కి అవకాశం బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్

    వరంగల్ తూర్పు

    రెండోరోజు కూడా 10వ తరగతి పేపర్ లీక్! విచారణకు ఆదేశించిన విద్యాశాఖ తెలంగాణ
    10వ తరగతి ప్రశ్నపత్రం లీకేజీ కేసులో బండి సంజయ్ ఏ1: వరంగల్ సీపీ రంగనాథ్ బండి సంజయ్
    తెలంగాణలో మరో 5రోజుల పాటు వర్షాలు; ఉత్తర జిల్లాల్లో వడగళ్ల వాన తెలంగాణ
    ఈ నెల 8న ప్రధాని మోదీ వరంగల్‌ పర్యటన షెడ్యూల్ ఇదే  నరేంద్ర మోదీ

    రైల్వే స్టేషన్

    ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌లో షార్ట్‌ సర్క్యూట్‌ కలకలం.. 4 బోగీలు పూర్తిగా దగ్ధం రైలు ప్రమాదం
    కాషాయ రంగులోకి మారిన వందే భారత్ రైలు.. కారణం ఇదేనా? వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలు
    తిరుపతి యార్డులో పట్టాలు తప్పిన పద్మావతి ఎక్స్‌ప్రెస్‌, రెండు రైళ్లు రీ షెడ్యూల్‌ తిరుమల తిరుపతి
    హైదరాబాద్: తప్పిన రైలు ప్రమాదం.. ఒకే ట్రాక్‌పైకి రెండు ఎంఎంటీఎస్‌లు హైదరాబాద్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025