NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Rahul Gandi: వయనాడ్‌ ప్రజల కోసం నిరంతరం పోరాడతా : రాహుల్‌ గాంధీ
    తదుపరి వార్తా కథనం
    Rahul Gandi: వయనాడ్‌ ప్రజల కోసం నిరంతరం పోరాడతా : రాహుల్‌ గాంధీ
    వయనాడ్‌ ప్రజల కోసం నిరంతరం పోరాడతా : రాహుల్‌ గాంధీ

    Rahul Gandi: వయనాడ్‌ ప్రజల కోసం నిరంతరం పోరాడతా : రాహుల్‌ గాంధీ

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Nov 30, 2024
    04:17 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ వయనాడ్‌ ప్రజల అభివృద్ధి కోసం తాము నిరంతరం పోరాడతామని హామీ ఇచ్చారు.

    అయితే కేంద్రంలో అధికారంలో లేకపోవడం వల్ల ఎక్కువ చేయలేకపోతున్నామంటూ తన బాధను వ్యక్తం చేశారు.

    ప్రధాని మోదీ వయనాడ్ ప్రజల పట్ల వివక్ష చూపుతున్నారని, పారిశ్రామిక వేత్త అదానీకి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నారని విమర్శించారు.

    మీడియా, సీబీఐ, ఈడీ, ఆదాయ పన్నుశాఖలన్నీ మోదీ ఆధీనంలో ఉన్నాయని, కానీ తమకు ప్రజల అండ ఉందన్నారు. మోదీ ప్రభుత్వ అన్యాయాలపై తమ పోరాటం కొనసాగుతుందని రాహుల్‌ చెప్పారు.

    Details

    మృతుల కుటుంబాలకు న్యాయం చేస్తా

    వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు న్యాయం జరిగే వరకు యూడీఎఫ్ నేతలతో కలిసి పోరాడతానని ఆయన స్పష్టం చేశారు.

    వయనాడ్ ఎంపీగా ఎన్నికైన ప్రియాంక గాంధీ, ప్రజల సంక్షేమం కోసం నిరంతరం శక్తివంచన లేకుండా కృషి చేస్తానని చెప్పారు.

    పార్లమెంట్ వేదికగా వయనాడ్ సమస్యలను ప్రపంచానికి వినిపిస్తానని హామీ ఇచ్చారు. ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసే ప్రయత్నాల్లో ఉన్న బీజేపీని నిలువరించడం కోసం ప్రజలు కాంగ్రెస్‌కు మద్దతుగా నిలిచారన్నారు.

    వయనాడ్ ఎంపీగా ఎన్నికైన ప్రియాంక గాంధీ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ప్రజల సంక్షేమం కోసం కట్టుబడి పనిచేస్తానని హామీ ఇచ్చారు.

    Details

    ప్రజాస్వామ్య వ్యవస్థను బీజేపీ నాశనం చేసింది : ప్రియాంక గాంధీ

    వయనాడ్ ప్రజల గొంతుకగా మారి, వారికి న్యాయం చేసేలా పార్లమెంట్ లో కృషి చేస్తానని ప్రియాంక గాంధీ తెలిపారు.

    ప్రజాస్వామ్య వ్యవస్థను బీజేపీ ధ్వంసం చేయాలని ప్రయత్నించినా, వయనాడ్ ప్రజలు కాంగ్రెస్‌కు బలంగా అండగా నిలిచారని పేర్కొన్నారు.

    వయనాడ్ ఉపఎన్నికల్లో ప్రియాంక గాంధీ 4,10,931 ఓట్ల మెజార్టీతో ఘనవిజయం సాధించారు. ఇది ఆమె రాజకీయ జీవితానికి మైలురాయిగా నిలిచింది.

    ఈ విజయాన్ని ప్రజల నమ్మకానికి ప్రతిఫలంగా ఆమె గుర్తించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    రాహుల్ గాంధీ
    ప్రియాంక గాంధీ

    తాజా

    Rajnath Singh:మసూద్ అజార్‌కు పాకిస్తాన్ ₹14 కోట్లు పరిహారం.. IMF రుణం గురించి పునరాలోచించాలి': రాజ్ నాథ్ సింగ్  రాజ్‌నాథ్ సింగ్
    NTR: హృతిక్‌ రోషన్‌ స్పెషల్‌ సర్‌ప్రైజ్‌'పై స్పందించిన ఎన్టీఆర్‌  జూనియర్ ఎన్టీఆర్
    Prophase: సైబర్ యుద్ధంలో భారత్‌ రక్షణ కవచంగా నిలిచిన 'ప్రొఫేజ్‌' టెక్నాలజీ
    Pillalamarri Banyan Tree: నేడు పాలమూరుని సందర్శించనున్న ప్రపంచ అందగత్తెలు !  తెలంగాణ

    రాహుల్ గాంధీ

    Rahul Gandhi: నాపై ఈడీ దాడులు జరగొచ్చు.. చాయ్ బిస్కెట్లతో సిద్ధంగా ఉంటా సీబీఐ
    Rahulgandhi:ఒలింపిక్ ఫైనల్స్‌లోకి వినేష్ ఫోగట్ ఎంట్రీ..  రాహుల్ గాంధీ అభినందన భారతదేశం
    Viral Video: పార్లమెంటులో నిద్రపోయిన రాహుల్ గాంధీ.. బీజేపీ మంత్రుల ట్రోల్స్ భారతదేశం
    Lateral entry: లేటరల్ ఎంట్రీపై రాహుల్ గాంధీ ఆరోపణలకు అశ్విని వైష్ణవ్ కౌంటర్‌ అశ్విని వైష్ణవ్

    ప్రియాంక గాంధీ

    మోదీ జీ, మీ మాట కోసమే న్యాయం వేచి చేస్తోంది: ప్రియాంక గాంధీ  నరేంద్ర మోదీ
    మే 8న హైదరాబాద్‌కు రానున్న ప్రియాంక గాంధీ  కాంగ్రెస్
    నేడు హైదరాబాద్‌కు ప్రియాంక గాంధీ రాక: అమె 'పొలిటికల్ టూరిస్ట్' అంటూ కేటీఆర్ ఫైర్ హైదరాబాద్
    కర్ణాటక ముఖ్యమంత్రి ఎవరు? ఇంకా వీడని ఉత్కంఠ  కర్ణాటక
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025