Page Loader
#NewsBytesExplainer: అత్యాధునిక టెక్నాలజీతో కొత్త భారతీయ పాస్‌పోర్ట్.. నకిలీ పాస్‌పోర్టులకు చెక్
అత్యాధునిక టెక్నాలజీతో కొత్త భారతీయ పాస్‌పోర్ట్.. నకిలీ పాస్‌పోర్టులకు చెక్

#NewsBytesExplainer: అత్యాధునిక టెక్నాలజీతో కొత్త భారతీయ పాస్‌పోర్ట్.. నకిలీ పాస్‌పోర్టులకు చెక్

వ్రాసిన వారు Sirish Praharaju
May 13, 2025
02:55 pm

ఈ వార్తాకథనం ఏంటి

అంతర్జాతీయంగా ప్రయాణించే భారతీయుల కోసం కేంద్ర ప్రభుత్వం కొత్త టెక్నాలజీతో కూడిన ఈ-పాస్‌పోర్ట్‌లను దేశ వ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురానుంది. చిప్ ఆధారిత ఈ పాస్‌పోర్ట్‌లు 2025 మే నెల నుంచి ప్రజలకు లభించనున్నట్టు విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రకటించింది. నకిలీ పాస్‌పోర్ట్‌లను నిరోధించడంతో పాటు, ప్రయాణ భద్రతను మెరుగుపరచడం, ఇమ్మిగ్రేషన్ ప్రక్రియను వేగవంతం చేయడమే ఈ కొత్త పాస్‌పోర్ట్‌ల లక్ష్యంగా ఉంది. మహారాష్ట్రలోని ఇండియా సెక్యూరిటీ ప్రెస్ (ISP) సహకారంతో ఈ పాస్‌పోర్ట్‌ల తయారీ జరుగుతోంది.

వివరాలు 

ఈ-పాస్‌పోర్ట్ అంటే ఏమిటి? 

ఈ-పాస్‌పోర్ట్ అనేది సాధారణ పాస్‌పోర్ట్‌కి ప్రత్యామ్నాయంగా రూపొందించబడిన ఆధునిక పాస్‌పోర్ట్. ఇందులో రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (RFID) చిప్ అమర్చబడుతుంది. ఆ చిప్‌లోనే ప్రయాణికుడి బయోమెట్రిక్ వివరాలు - అంటే వేలిముద్రలు, కన్ను స్కానింగ్, పేరు, చిరునామా, జన్మతేది వంటి అన్ని వ్యక్తిగత సమాచారం డిజిటల్ రూపంలో భద్రపరిచారు. ఇది పాస్‌పోర్ట్‌లో తవ్వకం చేయడం లేదా నకిలీ పాస్‌పోర్ట్ సృష్టించడం చాలా కష్టతరంగా మార్చుతుంది.

వివరాలు 

ప్రారంభంలోనే లాంచ్ చేసిన ఈ టెక్నాలజీ 

ఈ-పాస్‌పోర్ట్‌ల ప్రాజెక్ట్‌ను నిజానికి ఏప్రిల్ 1, 2024న పాస్‌పోర్ట్ సేవా ప్రోగ్రామ్ వర్షన్ 2.0 కింద ప్రారంభించారు. అయితే అది దేశవ్యాప్తంగా కాకుండా పరిమిత స్థాయిలో మాత్రమే అమలైంది. ప్రస్తుతం ఈ-పాస్‌పోర్ట్‌లు కొద్ది నగరాలలో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అవి చెన్నై, జైపూర్, హైదరాబాద్, నాగ్‌పూర్, అమృత్‌సర్, గోవా, రాయ్‌పూర్, సూరత్, రాంచీ, భువనేశ్వర్, జమ్ము, సిమ్లా వంటి ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయాలలో జారీ అవుతున్నాయి.

వివరాలు 

తమిళనాడులో పూర్తి స్థాయిలో అమలు 

తమిళనాడు రాజధాని చెన్నైలో మార్చి 3, 2025 నుంచి ఈ-పాస్‌పోర్ట్‌ల జారీ ప్రారంభమైంది. మార్చి 3 నుంచి మార్చి 22 వరకు జరిగిన ఈ కాలంలో మొత్తం 20,729 ఈ-పాస్‌పోర్ట్‌లు జారీ అయినట్లు అధికారికంగా వెల్లడించారు. సైబర్ భద్రతకు ప్రత్యేక కేరింగ్ ఈ-పాస్‌పోర్ట్‌లలోని డేటా ఎన్‌క్రిప్షన్ ద్వారా భద్రతగా నిలుస్తుంది. సైబర్ దొంగల నుంచి సమాచారం రక్షించేందుకు ఇందులో ఆధునిక అథెంటికేషన్ ప్రొటోకాల్స్‌ను అమలు చేశారు. డేటా గోప్యతను కాపాడేందుకు ఇది పూర్తి స్థాయి భద్రత కలిగిన వ్యవస్థ అని ప్రభుత్వం పేర్కొంది.

వివరాలు 

ప్రయాణ సమయంలో వేగవంతమైన ప్రక్రియ 

ఈ పాస్‌పోర్ట్‌లలో అమర్చిన చిప్‌ సహాయంతో ప్రయాణికుడి గుర్తింపు సులభంగా, వేగంగా నిర్ధారించవచ్చు. తద్వారా ఇమ్మిగ్రేషన్ ప్రక్రియ త్వరగా పూర్తవుతుంది. అంతేగాక, భారతీయ పాస్‌పోర్ట్ అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉండటంతో, ఇతర దేశాల్లోనూ గుర్తింపు పెరుగుతుంది. అంతర్జాతీయ ప్రాముఖ్యత పొందనున్న భారత్ ఈ టెక్నాలజీని దేశవ్యాప్తంగా అమలు చేసిన తరువాత, భారతదేశం ,అమెరికా, జర్మనీ, యుకె లాంటి దేశాల సరసన చేరుతుంది. ఈ దేశాలన్నీ ఇప్పటికే ప్రయాణీకులు భద్రత, సౌకర్యం కోసం ఈ-పాస్‌పోర్ట్ లు జారీ చేస్తున్నాయి.