NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Vyomika Singh and Sophia Qureshi:ఆపరేషన్ సింధూర్..ఎవరి..సోఫియా ఖురేషి, వ్యోమికా సింగ్ ?
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Vyomika Singh and Sophia Qureshi:ఆపరేషన్ సింధూర్..ఎవరి..సోఫియా ఖురేషి, వ్యోమికా సింగ్ ?
    ఆపరేషన్ సింధూర్..ఎవరి..సోఫియా ఖురేషి, వ్యోమికా సింగ్ ?

    Vyomika Singh and Sophia Qureshi:ఆపరేషన్ సింధూర్..ఎవరి..సోఫియా ఖురేషి, వ్యోమికా సింగ్ ?

    వ్రాసిన వారు Sirish Praharaju
    May 07, 2025
    11:56 am

    ఈ వార్తాకథనం ఏంటి

    పహల్గామ్‌లో జరిగిన దారుణమైన ఉగ్రదాడికి ప్రతిస్పందనగా, భారత సైన్యం మంగళవారం అర్ధరాత్రి పాకిస్థాన్, పీఓకేలోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై గగనతల దాడులు జరిపింది.

    ఈ భారీ ఆపరేషన్‌కు "ఆపరేషన్ సింధూర్" అనే పేరు పెట్టారు.

    ఈ దాడులలో సుమారు 90 మంది పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రవాదులు హతమయ్యారని ప్రాథమిక సమాచారం.

    బుధవారం ఉదయం భారత సాయుధ దళాలు ఈ ఆపరేషన్‌ గురించి వివరించేందుకు ఇద్దరు ధైర్యవంతులైన మహిళా అధికారులను మీడియా ముందు ప్రవేశపెట్టాయి.

    వారిలో ఒకరు భారత వైమానిక దళానికి చెందిన వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ కాగా, మరొకరు భారత సైన్యంలో సేవలందిస్తున్న కల్నల్ సోఫియా ఖురేషి.

    వివరాలు 

     లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో కల్నల్ సోఫియా ఖురేషి

    ఈ ఇద్దరు అధికారి మహిళలు జర్నలిస్టులకు వివరాలు ఇచ్చారు.

    పాకిస్తాన్ పుట్టించిన ఉగ్రవాద కర్మాగారాలు ఎలాంటి విధంగా లక్ష్యంగా చేయబడ్డాయో వారు వెల్లడించారు.

    కల్నల్ సోఫియా ఖురేషి ప్రస్తుతం లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో ఉన్నారు, కాగా వ్యోమికా సింగ్ భారత వైమానిక దళంలో వింగ్ కమాండర్‌గా విధులు నిర్వహిస్తున్నారు.

    కల్నల్ సోఫియా ఖురేషి ఒక ఉత్తమ నాయకురాలిగా పేరొందారు. ఆమె పూణేలో నిర్వహించిన "ఎక్సర్‌సైజ్ ఫోర్స్ 18" అనే అంతర్జాతీయ సైనిక విన్యాస కార్యక్రమంలో భారత బృందానికి నాయకత్వం వహించిన తొలి మహిళా అధికారిగా చరిత్ర సృష్టించారు.

    వివరాలు 

    పహల్గామ్‌ అమాయక పౌరులకు న్యాయం చేయడమే లక్ష్యంగా..

    సోఫియా వెల్లడించిన వివరాల ప్రకారం, గత మూడు దశాబ్దాలుగా పాకిస్తాన్, పీఓకే ప్రాంతాల్లో ఉగ్రవాద సంబంధిత నిర్మాణాలు కొనసాగుతున్నాయి.

    ఈ కేంద్రాలు మౌలికంగా ఉగ్రవాదాన్ని పెంపొందించేందుకు ఉపయోగపడుతున్నాయని ఆమె వివరించారు.

    పహల్గామ్‌లో జరిగిన అమానవీయ దాడిలో అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోవడంతో, వారికి న్యాయం చేయడమే లక్ష్యంగా భారత సైన్యం "ఆపరేషన్ సింధూర్"ను చేపట్టింది.

    ఈ క్రమంలో తొమ్మిది ఉగ్ర శిబిరాలను సుదూర లక్ష్యంగా చేసి ధ్వంసం చేసింది.

    వివరాలు 

    వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ గురించిన సమాచారం 

    భారత వైమానిక దళంలో వింగ్ కమాండర్‌గా పనిచేస్తున్న వ్యోమికా సింగ్, చిన్ననాటి నుంచే విమానాల పై ప్రేమతో భారత సైన్యంలో చేరాలని ఆకాంక్షించారు.

    ఆమె ప్రస్తుతం హెలికాప్టర్ పైలట్‌గా పని చేస్తున్నారు. ప్రమాదభరిత ప్రాంతాల్లో విమానాలను నడిపిన అనుభవం ఆమెకు విస్తారంగా ఉంది.

    ఇప్పటి వరకు వ్యోమికా సుమారుగా 2,500 గంటలకుపైగా విమానానుభవాన్ని పొందారు.

    చిత్తశుద్ధితో, ధైర్యంగా ఈశాన్య భారత రాష్ట్రాలు, జమ్మూ కాశ్మీర్ వంటి కఠినమైన వాతావరణాల్లో ఆమె చేతక్, చీతా తరహా హెలికాప్టర్లను నడిపారు.

    వివరాలు 

     రక్షణ మిషన్లను విజయవంతంగా ..

    ఆమె ఎన్నో రక్షణ మిషన్లను విజయవంతంగా పూర్తిచేశారు. 2020 నవంబరులో అరుణాచల్ ప్రదేశ్‌లో ఆమె నేతృత్వంలో ఒక అత్యంత క్లిష్టమైన రక్షణ మిషన్‌ను నిర్వహించి పలు ప్రాణాలను రక్షించారు.

    మీడియా సమావేశంలో వ్యోమికా మాట్లాడుతూ, "పహల్గామ్ ఉగ్రదాడిలో మరణించిన నిరపరాధుల కుటుంబాలకు న్యాయం చేయడం కోసం భారత సాయుధ దళాలు 'ఆపరేషన్ సింధూర్'ను చేపట్టాయి. తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని, పౌర ప్రాణాలు మరియు మౌలిక వసతులకు హాని కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటూ విజయవంతంగా దాడులు నిర్వహించాం" అని చెప్పారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆపరేషన్‌ సిందూర్‌

    తాజా

    BCCI: భారత్‌ - పాకిస్థాన్‌ దేశాల మధ్య ఉద్రిక్తతలు.. ఐపీఎల్‌కు ఎలాంటి ఆటంకం లేదన్న బీసీసీఐ..!  బీసీసీఐ
    Tollywood: చిరంజీవితో తీద్దామనుకుని.. చివరకు వెంకటేష్‌తో చిత్రీకరణ - కృష్ణంరాజు కేసుతో డిజాస్టర్  టాలీవుడ్
    PM Modi: ఆపరేషన్‌ సిందూర్‌ నేపథ్యంలో.. పలు దేశాల పర్యటనలను రద్దు చేసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ  నరేంద్ర మోదీ
    Khawaja Asif: వెనక్కి తగ్గిన పాకిస్థాన్.. 'దాడులను ఆపండి.. మేము ఏమీ చేయము' పాక్  రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్   పాకిస్థాన్

    ఆపరేషన్‌ సిందూర్‌

    Operation Sindoor: ఆత్మాహుతి డ్రోన్లు, స్కాల్ప్ క్షిపణులతో విరుచుకుపడ్డ భారత్ భారతదేశం
    Operation Sindoor: పాక్‌లోని ఉగ్రవాద శిబిరాలపై 'ఆపరేషర్‌ సిందూర్‌'.. దేశవ్యాప్తంగా అప్రమత్తమైన భద్రతా బలగాలు, పోలీసులు  భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025