English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Sambit Patra: "పొరపాటున నోరు జారి" పశ్చాత్తాపం కోసం "ఉపవాసం" చేపట్టిన బీజేపీ నేత 
    తదుపరి వార్తా కథనం
    Sambit Patra: "పొరపాటున నోరు జారి" పశ్చాత్తాపం కోసం "ఉపవాసం" చేపట్టిన బీజేపీ నేత 
    "పొరపాటున నోరు జారి" పశ్చాత్తాపం కోసం "ఉపవాసం" చేపట్టిన బీజేపీ నేత

    Sambit Patra: "పొరపాటున నోరు జారి" పశ్చాత్తాపం కోసం "ఉపవాసం" చేపట్టిన బీజేపీ నేత 

    వ్రాసిన వారు Sirish Praharaju
    May 21, 2024
    09:29 am

    ఈ వార్తాకథనం ఏంటి

    సోమవారం పూరీలో ప్రధాని నరేంద్ర మోదీ రోడ్ షో చేసిన సంగతి తెలిసిందే. ఈ రోడ్‌షోకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు.

    ఈ క్రమంలో బీజేపీ నేత సంబిత్ పాత్రా జగన్నాథుడి గురించి చేసిన వ్యాఖ్యలపై చాలా విమర్శలు వచ్చాయి.

    అయితే ఇప్పుడు అయన తన ప్రకటనపై క్లారిటీ ఇచ్చాడు. తన ప్రకటనపై బీజేపీ నేత క్షమాపణలు చెప్పారు.

    నోరు జారినందుకు క్షమాపణలు చెబుతున్నానని, ప్రాయశ్చిత్తం కోసం ఆయన ''ఉపవాసం'' ఉంటున్నట్లు ప్రకటించారు.

    Details 

    సంబిత్ పాత్రా వివరణ 

    సోమవారం ఒడిశా పూరిలో ప్రధాని నరేంద్ర మోదీ రోడ్ షో నిర్వహించారు. దీని తర్వాతఅనంతరం మీడియాతో సంబిత్ పాత్ర మాట్లాడుతూ.. పూరి పట్టణంలో కొలువదీరిన జగన్నాథుడు ప్రధాని నరేంద్రమోడీ భక్తుడని నోరు జారారు.

    దీనిపై బిజూ జనతాదళ్(బీజేడీ) తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. ఇటు నెటిజన్లు కూడా సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు.

    అయితే, తాను జగన్నాథుడిపై ప్రధాని మోదీకి ఉన్న భక్తి గురించి తెలియజేస్తూ పొరపాటున జనన్నాథుడు మోదీ భక్తుడు పేర్కొన్నానని వివరణ ఇచ్చారు.

    మీరు
    33%
    శాతం పూర్తి చేశారు

    Details 

    మీడియా ఛానెల్‌లకు వివరణ ఇచ్చిన సంబిత్ 

    టంగ్ స్లిప్ అయ్యినందుకు పశ్చాత్తాపంగా ఆయన ''ఉపవాసం'' ఉంటున్నట్లు ప్రకటించారు. ''నేను అన్న ఒక మాట వివాదాన్ని సృష్టించింది.

    పూరీలో ప్రధాని నరేంద్ర మోదీ రోడ్‌షో తర్వాత, నేను చాలా మీడియా ఛానెల్‌లకు వివరణ ఇచ్చాను, ప్రధాని నరేంద్ర మోదీ మహాప్రభు జగన్నాథ భక్తుడని ప్రతిచోటా అదే మాట చెప్పాను, అయితే అనుకోకుండా నోరు జారాను.

    అనుకోకుండా ఈ తప్పు చేశాను. కానీ దేవుడు అనుకోకుండా చేసిన తప్పుల్ని క్షమిస్తాడు. దీనికి పశ్చాత్తాపంగా జగన్నాథుడి కోసం ఉపవాసం చేయాలని నిర్ణయించుకున్నాను'' అని సంబిత్ పాత్ర చెప్పారు.

    మీరు
    66%
    శాతం పూర్తి చేశారు

    Details 

    నవీన్ పట్నాయక్ ఎదురుదాడి

    సంబిత్ పాత్ర ప్రకటనపై ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఎదురుదాడి చేశారు.

    ఇది ఒకరకంగా దేవుడిని అవమానించడమేనన్నారు. జగన్నాథుడు విశ్వానికి ప్రభువు అని, ఆయనను మానవ భక్తుడిగా పిలవడం ఆయనను అవమానించడమేనని, ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది జగన్నాథ భక్తులు, ఒరియా ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీసిందని సీఎం పట్నాయక్ సోషల్ మీడియా పోస్టులో రాసుకొచ్చారు.

    మీరు పూర్తి చేశారు
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    బీజేపీ
    ఒడిశా

    తాజా

    PM Modi: ఉగ్రవాదులను చావు దెబ్బకొట్టాం.. సైనికుల ధైర్యానికి దేశం గర్విస్తోంది : మోదీ నరేంద్ర మోదీ
    Truecaller: ట్రూకాలర్‌లో కొత్త ఏఐ ఫీచర్.. స్పామ్ సందేశాలకు చెక్‌! ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
    OG : పవన్ కళ్యాణ్ 'ఓజీ' షూట్ రీస్టార్ట్.. ఆనందంలో ఫ్యాన్స్! పవన్ కళ్యాణ్
    PM Modi: మోదీ ప్రెస్‌మీట్‌పై ఉత్కంఠ.. కీలక ప్రకటన వచ్చే అవకాశం! నరేంద్ర మోదీ

    బీజేపీ

    Manohar Lal Khattar: హర్యానా సీఎం మనోహర్ లాల్ రాజీనామా  మనోహర్ లాల్ ఖట్టర్
    CAA: ' సీఏఏపై అబద్ధాలు చెప్పడం ఆపండి'.. కేజ్రీవాల్‌పై బీజేపీ ఎదురుదాడి  దిల్లీ
    Haryana: హర్యానా అసెంబ్లీలో విశ్వాస పరీక్ష.. సీఎం నయాబ్ సైనీ విజయం హర్యానా
    BJP Candidate List : బీజేపీ రెండో జాబితా విడుదల.. తెలంగాణ నుంచి ఆరుగురికి చోటు   భారతదేశం

    ఒడిశా

    ప్రతి రిలే గది వద్ద 'డబుల్ లాకింగ్' ఏర్పాటు; రైల్వే శాఖ కీలక ఆదేశాలు  రైలు ప్రమాదం
    ఒడిశా రైలు ప్రమాదంపై సీబీఐ విచారణ ఎందకంటే?  రైలు ప్రమాదం
    రాజధాని ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన ప్రమాదం; రైల్వే గేటును ఢీకొట్టిన ట్రాక్టర్  రైలు ప్రమాదం
    ఒడిషా ఘటనలో 51 గంటల ఆపరేషన్.. స్వయంగా నడిపించిన రైల్వే మంత్రి రైల్వే శాఖ మంత్రి
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025