NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Rammohan Naidu: ఇండియా-పాక్ ఉద్రిక్తతల మధ్య రామ్మోహన్ నాయుడికి వై ప్లస్ భద్రత 
    తదుపరి వార్తా కథనం
    Rammohan Naidu: ఇండియా-పాక్ ఉద్రిక్తతల మధ్య రామ్మోహన్ నాయుడికి వై ప్లస్ భద్రత 
    ఇండియా-పాక్ ఉద్రిక్తతల మధ్య రామ్మోహన్ నాయుడికి వై ప్లస్ భద్రత

    Rammohan Naidu: ఇండియా-పాక్ ఉద్రిక్తతల మధ్య రామ్మోహన్ నాయుడికి వై ప్లస్ భద్రత 

    వ్రాసిన వారు Jayachandra Akuri
    May 09, 2025
    12:59 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడికి కేంద్ర ప్రభుత్వం భద్రతను పెంచింది.

    ఇప్పటివరకు ఆయనకు ఉన్న వై కేటగిరీ భద్రతను తాజాగా వై ప్లస్ కేటగిరీకి అభివృద్ధి చేశారు. ఈ కేటగిరీ మార్పుతో రామ్మోహన్ నాయుడికి రాష్ట్ర పోలీసుల తరపున ఇద్దరు గన్‌మెన్‌లు, అలాగే ఇద్దరు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) కమాండోలు భద్రతను కల్పిస్తారు.

    తాజా పరిస్థితుల్లో రామ్మోహన్ నాయుడిని నలుగురు భద్రతా సిబ్బంది కాపాడనున్నారు.

    ఇదే సమయంలో, వై ప్లస్ కేటగిరీ భద్రతకు అనుగుణంగా కేంద్రం నియమించిన చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్, సీఆర్పీఎఫ్ కమాండో రామ్మోహన్ నాయుడి భద్రతకు విధుల్లో చేరారు.

    Details

    సీఎం భద్రతకు పటిష్ట ఆదేశాలు

    ఇంకా, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి భద్రతపైనా అధికారులు పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు.

    ఆపరేషన్ సిందూర్ అనంతరం ఏపీలో జరిగిన హైలెవల్ రివ్యూ సమావేశంలో రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఇంటెలిజెన్స్ చీఫ్ మహేష్ చంద్ర లడ్హా తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇందులో వీఐపీలతోపాటు ప్రజల భద్రతపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

    ఈ సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భద్రత విషయంలో ప్రాధాన్యత కలిగిన ఆదేశాలు జారీ చేశారు.

    భద్రతా చర్యలు మరింత పటిష్టంగా ఉండాలని, భద్రతకు సంబంధించిన ప్రోటోకాల్స్‌ను ఖచ్చితంగా పాటించాలంటూ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.

    జనసమూహాల్లో సీఎం రక్షణపై ప్రత్యేక ఏర్పాట్లను చేయాలని అధికారులను ఆదేశించారు. భద్రత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడకూడదని డీజీపీ అధికారులకు హెచ్చరించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కింజరాపు రామ్మోహన్ నాయుడు
    ఆపరేషన్‌ సిందూర్‌

    తాజా

    Rammohan Naidu: ఇండియా-పాక్ ఉద్రిక్తతల మధ్య రామ్మోహన్ నాయుడికి వై ప్లస్ భద్రత  కింజరాపు రామ్మోహన్ నాయుడు
    Operation Sindoor: భారత్‌లోకి ప్రవేశించేందుకు ముష్కరుల ప్రయత్నాలు.. అడ్డుకొన్న బీఎస్‌ఎఫ్‌.. ఏడుగురు హతం ఆపరేషన్‌ సిందూర్‌
    China: భారత్‌-పాక్‌ ఉద్రిక్తతలపై చైనా ఆందోళన.. సంయమనం పాటించాలని విజ్ఞప్తి చైనా
    BCCI: ధర్మశాల నుంచి ఢిల్లీకి ఐపీఎల్ జట్లు షిఫ్ట్.. బీసీసీఐ ప్రత్యేక రైలు ఏర్పాటు! బీసీసీఐ

    కింజరాపు రామ్మోహన్ నాయుడు

    Bharatiya Vayuyan Vidheyak 2024: బ్రిటిష్ కాలం నాటి ఎయిర్‌క్రాఫ్ట్ చట్టం స్థానంలో కొత్త ఏవియేషన్ బిల్లు  కేంద్ర పౌర విమానయాన శాఖ
    Rammohan Naidu: రాజమహేంద్రవరం నుండి దిల్లీకి త్వరలోనే సర్వీసు: రామ్మోహన్‌ నాయుడు రాజమహేంద్రవరం
    Bhogapuram Airport: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి స్వాతంత్య్ర సమరయోధుడి పేరు  విజయనగరం
    Hoax calls: భద్రతలో రాజీ పడేదేలే.. బాంబు బెదిరింపులపై రామ్మోహన్ నాయుడు సీరియస్ బాంబు బెదిరింపు

    ఆపరేషన్‌ సిందూర్‌

    Operation Sindoor: ఆత్మాహుతి డ్రోన్లు, స్కాల్ప్ క్షిపణులతో విరుచుకుపడ్డ భారత్ భారతదేశం
    Operation Sindoor: పాక్‌లోని ఉగ్రవాద శిబిరాలపై 'ఆపరేషర్‌ సిందూర్‌'.. దేశవ్యాప్తంగా అప్రమత్తమైన భద్రతా బలగాలు, పోలీసులు  భారతదేశం
    Vyomika Singh and Sophia Qureshi:ఆపరేషన్ సింధూర్..ఎవరి..సోఫియా ఖురేషి, వ్యోమికా సింగ్ ? భారతదేశం
    Operation Sindoor: పాక్‌లో ఉగ్ర స్థావరాలపై మెరుపుదాడి.. మాజీ, ప్రస్తుత క్రికెటర్ల స్పందనలివే!  క్రీడలు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025