Page Loader
Rammohan Naidu: ఇండియా-పాక్ ఉద్రిక్తతల మధ్య రామ్మోహన్ నాయుడికి వై ప్లస్ భద్రత 
ఇండియా-పాక్ ఉద్రిక్తతల మధ్య రామ్మోహన్ నాయుడికి వై ప్లస్ భద్రత

Rammohan Naidu: ఇండియా-పాక్ ఉద్రిక్తతల మధ్య రామ్మోహన్ నాయుడికి వై ప్లస్ భద్రత 

వ్రాసిన వారు Jayachandra Akuri
May 09, 2025
12:59 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడికి కేంద్ర ప్రభుత్వం భద్రతను పెంచింది. ఇప్పటివరకు ఆయనకు ఉన్న వై కేటగిరీ భద్రతను తాజాగా వై ప్లస్ కేటగిరీకి అభివృద్ధి చేశారు. ఈ కేటగిరీ మార్పుతో రామ్మోహన్ నాయుడికి రాష్ట్ర పోలీసుల తరపున ఇద్దరు గన్‌మెన్‌లు, అలాగే ఇద్దరు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) కమాండోలు భద్రతను కల్పిస్తారు. తాజా పరిస్థితుల్లో రామ్మోహన్ నాయుడిని నలుగురు భద్రతా సిబ్బంది కాపాడనున్నారు. ఇదే సమయంలో, వై ప్లస్ కేటగిరీ భద్రతకు అనుగుణంగా కేంద్రం నియమించిన చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్, సీఆర్పీఎఫ్ కమాండో రామ్మోహన్ నాయుడి భద్రతకు విధుల్లో చేరారు.

Details

సీఎం భద్రతకు పటిష్ట ఆదేశాలు

ఇంకా, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి భద్రతపైనా అధికారులు పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు. ఆపరేషన్ సిందూర్ అనంతరం ఏపీలో జరిగిన హైలెవల్ రివ్యూ సమావేశంలో రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఇంటెలిజెన్స్ చీఫ్ మహేష్ చంద్ర లడ్హా తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇందులో వీఐపీలతోపాటు ప్రజల భద్రతపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భద్రత విషయంలో ప్రాధాన్యత కలిగిన ఆదేశాలు జారీ చేశారు. భద్రతా చర్యలు మరింత పటిష్టంగా ఉండాలని, భద్రతకు సంబంధించిన ప్రోటోకాల్స్‌ను ఖచ్చితంగా పాటించాలంటూ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. జనసమూహాల్లో సీఎం రక్షణపై ప్రత్యేక ఏర్పాట్లను చేయాలని అధికారులను ఆదేశించారు. భద్రత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడకూడదని డీజీపీ అధికారులకు హెచ్చరించారు.