NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Bhatti Virkamarka: యాదాద్రి థర్మల్‌ ప్రాజెక్ట్ భూ నిర్వాసితులకు ఉద్యోగ నియామక పత్రాలు అందజేత
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Bhatti Virkamarka: యాదాద్రి థర్మల్‌ ప్రాజెక్ట్ భూ నిర్వాసితులకు ఉద్యోగ నియామక పత్రాలు అందజేత
    యాదాద్రి థర్మల్‌ ప్రాజెక్ట్ భూ నిర్వాసితులకు ఉద్యోగ నియామక పత్రాలు అందజేత

    Bhatti Virkamarka: యాదాద్రి థర్మల్‌ ప్రాజెక్ట్ భూ నిర్వాసితులకు ఉద్యోగ నియామక పత్రాలు అందజేత

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Apr 04, 2025
    05:16 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    తెలంగాణకు ప్రత్యేక రాష్ట్ర హోదా వస్తే ఉద్యోగాలు వస్తాయని యువత పోరాడిందని, వారి ఆశలను నెరవేర్చేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏడాదిలోనే 53 వేల మందికి నియామకపత్రాలు అందించిందని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు.

    యాదాద్రి థర్మల్‌ పవర్‌ స్టేషన్‌ పరిధిలోని 112 మంది భూ నిర్వాసితులకు టీఎస్‌ జెన్‌కో ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించినట్లు పేర్కొన్నారు.

    మాదాపూర్‌ సైబర్‌ గార్డెన్స్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయా నియామకపత్రాలను భట్టి విక్రమార్క అందజేశారు.

    వీర్లపాలెం (దామచర్ల మండలం) నుంచి 112 మందికి జూనియర్‌ అసిస్టెంట్లు, ప్లాంట్‌ అటెండర్లు, ఆఫీస్‌ సబార్డినేట్లుగా ఉద్యోగాలు కల్పించినట్లు వెల్లడించారు.

    Details

    ఉపాధి కల్పనపై దృష్టి

    ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. గత ప్రభుత్వాలు ప్రాజెక్టుల కోసం భూములు తీసుకున్నా, భూ నిర్వాసితులకు ఉద్యోగాలు కల్పించలేదని విమర్శించారు.

    చాలా మంది నిర్వాసితులు వృద్ధులయ్యారని, అయితే ఇప్పుడు వారికి తక్షణ ఉపాధి కల్పిస్తున్నామని తెలిపారు.

    ప్రభుత్వ ఉద్యోగాలు పొందలేని వారికీ ఉపాధి కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు.

    రాజీవ్‌ యువ వికాసం పథకం ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు అందించేందుకు రూ.9 వేల కోట్లు కేటాయించామని వెల్లడించారు. అంతర్జాతీయ స్థాయిలో ప్రసిద్ధి చెందిన కంపెనీలు హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు తెలిపారు.

    Details

    వేల మందికి ఉపాధి

    రాజీవ్‌ గాంధీ సూచనల మేరకు నేదురమల్లి జనార్దన్‌రెడ్డి హైటెక్‌ సిటీకి శంకుస్థాపన చేశారు.

    నేడు ఐటీ రంగం వేల మందికి ఉపాధి కల్పిస్తోంది. భవిష్యత్‌లో హైదరాబాద్‌ను మరింత విస్తరించేందుకు, పెట్టుబడులను ఆకర్షించేందుకు ఫ్యూచర్‌ సిటీ ప్రణాళికలు రూపొందిస్తున్నాం.

    పెట్టుబడులు పెరిగితే ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    భట్టి విక్రమార్క
    తెలంగాణ

    తాజా

    Operation Sindoor: పాకిస్థాన్ అధికారిని అవాంఛనీయ వ్యక్తిగా ప్రకటించిన భారత్.. 24 గంటల్లో దేశం విడిచి వెళ్లాలని ఆదేశం పాకిస్థాన్
    Mohan Lal: మోహన్‌లాల్ పుట్టినరోజున 'వృషభ' ఫస్ట్ లుక్ విడుదల.. భీకర యోధుడి అవతారంలో లాలెట్టన్ మాలీవుడ్
    Google I/O 2025: గూగుల్ కొత్త ఏఐ మోడ్‌తో షాపింగ్ ఇక స్మార్ట్‌గా.. ట్రై-ఆన్, ట్రాకింగ్, తక్షణ చెల్లింపుల సౌలభ్యం! గూగుల్
    #NewsBytesExplainer: ఫేక్ ప్రామిస్‌తో శారీరక సంబంధం పెట్టుకోవడం నేరం.. చట్టం ఏం చెబుతుందంటే? న్యాయస్థానం

    భట్టి విక్రమార్క

    Bhatti Vikramarka: మహిళా సంఘాలతో సోలార్ పవర్ ప్రాజెక్టులు : భట్టి విక్రమార్క తెలంగాణ
    Bhatti: తెలంగాణలో 20వేల మెగావాట్ల గ్రీన్ పవరే లక్ష్యం: భట్టి విక్రమార్క తెలంగాణ
    Mega DSC : తెలంగాణలో మరో 6వేల పోస్టుల‌తో మెగా డీఎస్సీ.. భ‌ట్టి విక్ర‌మార్క తెలంగాణ
    Bhatti Vikramarka: జాబ్‌ క్యాలెండర్‌ ఆధారంగా నియామకాలు : డిప్యూటీ సీఎం  తెలంగాణ

    తెలంగాణ

    Telangana: నిర్మాణాలు చేపట్టేవారికి రేవంత్ సర్కార్ గుడ్‌న్యూస్.. అన్ని జిల్లాల్లోనూ శాండ్‌ బజార్లు ఏర్పాటు భారతదేశం
    Rain Alert: ఆంధ్రప్రదేశ్,తెలంగాణకు వర్ష సూచన.. రేపు ఈ జిల్లాల్లో తేలికపాటి వర్షాలు వాతావరణ శాఖ
    Telangana Bjp: తెలంగాణ బీజేపీకి చీఫ్ ఎవరు? కిషన్ రెడ్డి ఢిల్లీ టూర్ ఆసక్తికరం! బీజేపీ
    Telangana: అసెంబ్లీలో మళ్లీ ప్రశ్నోత్తరాలు రద్దు.. ఎమ్మెల్యేల్లో అసంతృప్తి! ఇండియా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025