NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Telangana:టీటీడీ తరహాలో యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు: సీఎం రేవంత్ రెడ్డి
    తదుపరి వార్తా కథనం
    Telangana:టీటీడీ తరహాలో యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు: సీఎం రేవంత్ రెడ్డి
    టీటీడీ తరహాలో యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు: సీఎం రేవంత్ రెడ్డి

    Telangana:టీటీడీ తరహాలో యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు: సీఎం రేవంత్ రెడ్డి

    వ్రాసిన వారు Sirish Praharaju
    Aug 30, 2024
    05:33 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సారి సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం, ఎకో,టెంపుల్ పర్యాటక అభివృద్ధిపై దృష్టి పెట్టింది.

    ముఖ్యంగా, యాదగిరిగుట్ట ఆలయాన్ని మరింత అభివృద్ధి చేయడానికి ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

    ఏపీలోని తిరుమల ఆలయానికి ఉన్న టీటీడీ బోర్డు లానే, యాదాద్రి ఆలయానికి తెలంగాణలో ప్రత్యేక టెంపుల్ బోర్డు ఏర్పాటు చేయాలని సీఎం నిర్ణయించారు.

    టూరిజం,యాదగిరిగుట్ట ఆలయం అభివృద్ధిపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో అధికారులతో సీఎం రేవంత్ చర్చించారు.

    రాష్ట్రంలో హెల్త్ టూరిజాన్ని కూడా మరింతగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.

    హైదరాబాద్‌లోని జూపార్క్‌కు ప్రత్యామ్నాయంగా మరో జూపార్క్ ఏర్పాటు చేయాలని అధికారులకు దిశా నిర్దేశం చేశారు.

    వివరాలు 

    స్పీడ్‌ ప్రాజెక్టులపై సీఎం సమీక్ష 

    సచివాలయంలో నిర్వహించిన మరో సమీక్షలో, స్పీడ్ (స్మార్ట్ ప్రోయాక్టివ్ ఎఫిషియెంట్ అండ్ ఎఫెక్టివ్ డెలివరీ) ప్రాజెక్టులు, హెల్త్, ఎకో టూరిజం ప్రాజెక్టుల అభివృద్ధిపై అధికారులతో ఆయన చర్చించారు.

    ఈ సమావేశంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

    ఇదిలా ఉండగా, హైడ్రా కూల్చివేతలపై ప్రభుత్వం తీవ్ర విమర్శలను ఎదుర్కొంటోంది.

    ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి నివాసానికి కూడా నోటీసులు పంపించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

    ఈ వ్యవహారంపై సీఎం రేవంత్ సహా మంత్రులు, ప్రభుత్వం ఎవరినీ లక్ష్యంగా చేసుకోలేదని, నిబంధనల ప్రకారం సమానంగా వ్యవహరిస్తున్నామని పునరుద్ఘాటించారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 

    స్పీడ్‌పై (స్మార్ట్ ప్రోయాక్టివ్ ఎఫిషియెంట్ అండ్ ఎఫెక్టివ్
    డెలివరీ) ప్రాజెక్టులపై సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష.

    హాజరైన మంత్రి జూపల్లి కృష్ణారావు, టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, వివిధ విభాగాల… pic.twitter.com/ugm3aGbb9J

    — Congress for Telangana (@Congress4TS) August 30, 2024
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    రేవంత్ రెడ్డి

    తాజా

    Andhra News: డిగ్రీ కోర్సుల్లో కీలక మార్పులు - కృత్రిమ మేధ, క్వాంటం కంప్యూటింగ్ వంటి కోర్సులకు ప్రవేశం  ఆంధ్రప్రదేశ్
    Maharashtra: ఫడ్నవిస్ మంత్రివర్గంలో భుజ్‌బాల్.. ఇవాళే ప్రమాణ స్వీకారం మహారాష్ట్ర
    Vishal-Sai Dhansika: విశాల్‌ పెళ్లికి ముహూర్తం ఫిక్స్‌.. బర్త్‌డే రోజునే వెడ్డింగ్‌ విశాల్
    Hyderabad: ఔటర్‌ రింగ్‌ రోడ్డు-ఆర్‌ఆర్‌ఆర్‌ మధ్య లాజిస్టిక్‌ హబ్‌ల నిర్మాణం లక్ష్యంగా హెచ్‌ఎండీఏ ప్రణాళిక  హైదరాబాద్

    రేవంత్ రెడ్డి

    Medigadda tour: మేడిగడ్డకు సీఎం రేవంత్, మంత్రులు, ఎమ్మెల్యేలు  మేడిగడ్డ బ్యారేజీ
    Medigadda Barrage: మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు  మేడిగడ్డ బ్యారేజీ
    KCR Birthday: కేసీఆర్‌కు బర్త్ డే విషెష్ చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి.. వీడియో వైరల్  కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కె.సి.ఆర్)
    TSPSC: గ్రూప్ 1 నోటిఫికేషన్‌ను రద్దు చేసిన టీఎస్‌పీఎస్పీ  టీఎస్పీఎస్సీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025