NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / రాజకీయాల్లోకి వైఎస్ భారతి; జమ్మలమడుగు నుంచి అసెంబ్లీ బరిలో?
    తదుపరి వార్తా కథనం
    రాజకీయాల్లోకి వైఎస్ భారతి; జమ్మలమడుగు నుంచి అసెంబ్లీ బరిలో?
    రాజకీయాల్లోకి వైఎస్ భారతి; జమ్మలమడుగు నుంచి అసెంబ్లీ బరిలో?

    రాజకీయాల్లోకి వైఎస్ భారతి; జమ్మలమడుగు నుంచి అసెంబ్లీ బరిలో?

    వ్రాసిన వారు Stalin
    Feb 20, 2023
    03:20 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్‌రెడ్డి భార్య భారతి ప్రత్యేక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. వచ్చేసారి ఎన్నికల్లో పోటీ చేయడం ఖాయమని కడప రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. జగన్ మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గం కడప జిల్లాలోని జమ్మలమడుగు నుంచి ఆమె పోటీ చేస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

    2024 ఎన్నికల్లో భారతిని నిలబెట్టేందుకు పులివెందులతో సమానంగా జమ్మలమడుగులో వైసీపీని పటిష్టం చేయాలని సీఎం జగన్ భావిస్తున్నారు.

    అందుకే సీఎం జగన్ జమ్మలమడుగు అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారినట్లు కనిపిస్తోంది. ఇటీవల నిర్వహించిన కడప జిల్లా పర్యటనలో కూడా జమ్మలమడుగుకే అధిక ప్రాధాన్యం ఇచ్చారు.

    రాష్ట్ర స్థాయి ప్రాజెక్టులను సాధ్యమైనంత వరకు జమ్మలమడుగులోనే ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటురున్నారు.

    జమ్మలమడుగు

    మాజీ మంత్రి రామ‌సుబ్బా రెడ్డికి ఎమ్మెల్సీ ఆఫర్

    కడప జిల్లాలో ఏర్పాటు చేయాలనుకున్న ఉక్కు కర్మాగారాన్ని జమ్మలమడుగు మండలం సున్నపరాళ్లపల్లికు తరలించి ఇటీవల సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. ఈ నియోజకవర్గంలో విమానాశ్రయం కూడా ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ఉంది. అభివృద్ధి పథకాలను పెద్ద ఎత్తున చేపడుతున్న నేపథ్యంలో ఈ నియోజకవర్గాన్ని తన కుటుంబానికి కంచుకోటగా మార్చుకునేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

    ఈ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థికి గట్టి ప్రత్యర్థిగా భారతిని బరిలోకి దింపాలని జగన్ యోచిస్తున్నారు. ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న సుధీర్ రెడ్డికి వేరే నియోజకవర్గం కేటాయించే అవకాశం ఉంది. ఇటీవల టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిన మాజీ మంత్రి రామ‌సుబ్బా రెడ్డికి ఎమ్మెల్సీ ఇస్తానని జ‌గ‌న్ హామీ ఇచ్చినట్లు సమాచారం.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    జమ్మలమడుగు
    ఆంధ్రప్రదేశ్

    తాజా

    Tabu: మళ్లీ వార్తల్లో కృష్ణజింక కేసు.. సైఫ్‌, టబు, నీలం, సోనాలీపై విచారణ కొనసాగుతోంది బాలీవుడ్
    Neeraj Chopra: 90 మీటర్ల మార్క్ దాటిన నీరజ్‌ చోప్రా.. అభినందనలు తెలిపిన నరేంద్ర మోదీ నీరజ్ చోప్రా
    ChatGPT: చాట్‌జీపీటీలో నిమిషాల్లో కోడింగ్‌, బగ్స్‌ ఫిక్స్‌ చేసే ఏఐ టూల్ చాట్‌జీపీటీ
    IPL 2025: నేటి నుంచే ఐపీఎల్ పునఃప్రారంభం.. ఆర్సీబీ, కేకేఆర్ మధ్య హోరాహోరీ పోటీ! ఐపీఎల్

    జమ్మలమడుగు

    కడప: జమ్మలమడుగులో స్టీల్‌ ప్లాంట్‌కు శంకుస్థాపన చేసిన వైఎస్‌ జగన్‌ కడప

    ఆంధ్రప్రదేశ్

    'తెలంగాణ తీరుతో మా హక్కులను కోల్పోతున్నాం'.. కేంద్రానికి జగన్ ఫిర్యాదు వై.ఎస్.జగన్
    కందుకూరు దుర్ఘటనకు కారణం ఎవరు? ప్రమాదంపై రాజకీయమా? చంద్రబాబు నాయుడు
    తెలుగు రాష్ట్రాల్లో నకిలీ డాక్టర్ల స్కామ్.. రంగంలోకి సీబీఐ తెలంగాణ
    చంద్రబాబుకే ఎందుకు ఇలా జరుగుతోంది? మరోసారి తొక్కిసలాట.. ముగ్గురు మృతి చంద్రబాబు నాయుడు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025