NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / రాజకీయాల్లోకి వైఎస్ భారతి; జమ్మలమడుగు నుంచి అసెంబ్లీ బరిలో?
    రాజకీయాల్లోకి వైఎస్ భారతి; జమ్మలమడుగు నుంచి అసెంబ్లీ బరిలో?
    భారతదేశం

    రాజకీయాల్లోకి వైఎస్ భారతి; జమ్మలమడుగు నుంచి అసెంబ్లీ బరిలో?

    వ్రాసిన వారు Naveen Stalin
    February 20, 2023 | 03:20 pm 0 నిమి చదవండి
    రాజకీయాల్లోకి వైఎస్ భారతి; జమ్మలమడుగు నుంచి అసెంబ్లీ బరిలో?
    రాజకీయాల్లోకి వైఎస్ భారతి; జమ్మలమడుగు నుంచి అసెంబ్లీ బరిలో?

    ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్‌రెడ్డి భార్య భారతి ప్రత్యేక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. వచ్చేసారి ఎన్నికల్లో పోటీ చేయడం ఖాయమని కడప రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. జగన్ మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గం కడప జిల్లాలోని జమ్మలమడుగు నుంచి ఆమె పోటీ చేస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 2024 ఎన్నికల్లో భారతిని నిలబెట్టేందుకు పులివెందులతో సమానంగా జమ్మలమడుగులో వైసీపీని పటిష్టం చేయాలని సీఎం జగన్ భావిస్తున్నారు. అందుకే సీఎం జగన్ జమ్మలమడుగు అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారినట్లు కనిపిస్తోంది. ఇటీవల నిర్వహించిన కడప జిల్లా పర్యటనలో కూడా జమ్మలమడుగుకే అధిక ప్రాధాన్యం ఇచ్చారు. రాష్ట్ర స్థాయి ప్రాజెక్టులను సాధ్యమైనంత వరకు జమ్మలమడుగులోనే ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటురున్నారు.

    మాజీ మంత్రి రామ‌సుబ్బా రెడ్డికి ఎమ్మెల్సీ ఆఫర్

    కడప జిల్లాలో ఏర్పాటు చేయాలనుకున్న ఉక్కు కర్మాగారాన్ని జమ్మలమడుగు మండలం సున్నపరాళ్లపల్లికు తరలించి ఇటీవల సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. ఈ నియోజకవర్గంలో విమానాశ్రయం కూడా ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ఉంది. అభివృద్ధి పథకాలను పెద్ద ఎత్తున చేపడుతున్న నేపథ్యంలో ఈ నియోజకవర్గాన్ని తన కుటుంబానికి కంచుకోటగా మార్చుకునేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థికి గట్టి ప్రత్యర్థిగా భారతిని బరిలోకి దింపాలని జగన్ యోచిస్తున్నారు. ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న సుధీర్ రెడ్డికి వేరే నియోజకవర్గం కేటాయించే అవకాశం ఉంది. ఇటీవల టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిన మాజీ మంత్రి రామ‌సుబ్బా రెడ్డికి ఎమ్మెల్సీ ఇస్తానని జ‌గ‌న్ హామీ ఇచ్చినట్లు సమాచారం.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    జమ్మలమడుగు
    వైఎస్ జగన్మోహన్ రెడ్డి
    ఆంధ్రప్రదేశ్
    వైఎస్ షర్మిల

    జమ్మలమడుగు

    కడప: జమ్మలమడుగులో స్టీల్‌ ప్లాంట్‌కు శంకుస్థాపన చేసిన వైఎస్‌ జగన్‌ కడప

    వైఎస్ జగన్మోహన్ రెడ్డి

    Andhra pradesh: ఉత్కంఠగా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్; ఓటేసిన సీఎం జగన్ ఆంధ్రప్రదేశ్
    పులివెందులలో కాల్పుల కలకలం; తుపాకీతో ఇద్దరిని కాల్చిన భరత్ యాదవ్ పులివెందుల
    ముగిసిన సీఎం వైఎస్ జగన్ దిల్లీ పర్యటన; అమిత్ షా, నిర్మలతో కీలక భేటీ ఆంధ్రప్రదేశ్
    ఒంట్టిమిట్ట సీతా‌రాముల కల్యాణానికి సీఎం జగన్ గైర్హాజరకు కారణాలేంటి? ఆంధ్రప్రదేశ్

    ఆంధ్రప్రదేశ్

    ఫిబ్రవరి 27 నుంచి ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు బడ్జెట్
    ఆంధ్రప్రదేశ్: త్వరలో జగన్ కేబినెట్ పునర్వ్యవస్థీకరణ: ఆ మంత్రులపై వేటు తప్పదా? వై.ఎస్.జగన్
    ఆంధ్రప్రదేశ్‌‌కు కేంద్రం షాక్: ప్రత్యేక హోదా డిమాండ్‌ను పరిగణలోకి తీసుకోబోమని నిర్మల ప్రకటన నిర్మలా సీతారామన్
    ఆంధ్రప్రదేశ్ క్షత్రియ కార్పొరేషన్ ఛైర్మన్ పాతపాటి సర్రాజు కన్నుమూత వై.ఎస్.జగన్

    వైఎస్ షర్మిల

    లోటస్ పాండ్ వద్ద హై టెన్షన్; మహిళా కానిస్టేబుల్‌ను చెంపదెబ్బ కొట్టిన షర్మిల హైదరాబాద్
    కాంగ్రెస్‌లోకి వైఎస్ షర్మిల రావడాన్ని ఆహ్వానిస్తున్నాం : మాజీ ఎంపీ కేవీపీ కాంగ్రెస్
    సీఎం జగన్‌తో తెలంగాణ మాజీ ఎంపీ పొంగులేటీ భేటీ వై.ఎస్.జగన్
    వివేకా హత్య కేసులో కీలక పరిణామం.. సాక్షిగా వైఎస్‌ షర్మిల వైఎస్సార్ తెలంగాణ పార్టీ (వైఎస్సార్‌టీపీ)
    తదుపరి వార్తా కథనం

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023