Page Loader
Mysore: మైసూరు దసరా ఉత్సవాల్లో ప్రాచీన సంప్రదాయ పోటీ.. వైభవంగా 'వజ్రముష్టి కళగ' కుస్తీపోటీలు
మైసూరు దసరా ఉత్సవాల్లో ప్రాచీన సంప్రదాయ పోటీ.. వైభవంగా 'వజ్రముష్టి కళగ' కుస్తీపోటీలు

Mysore: మైసూరు దసరా ఉత్సవాల్లో ప్రాచీన సంప్రదాయ పోటీ.. వైభవంగా 'వజ్రముష్టి కళగ' కుస్తీపోటీలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 13, 2024
10:34 am

ఈ వార్తాకథనం ఏంటి

కర్ణాటకలోని ప్రసిద్ధ రాచనగరి మైసూరు దసరా ఉత్సవాలకు దేశ విదేశాల నుంచి పర్యాటకులు పెద్ద ఎత్తున తరలివస్తారు. 400 ఏళ్ల చరిత్ర గల ఈ వేడుకలు ప్రతి ఏటా అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఈ ఏడాది కూడా వజ్రముష్టి పోటీలు వంటి సంప్రదాయ క్రీడలతో, జంబూ సవారీ వంటి ప్రాచీన విశేషాలతో ఉత్సవాలు కన్నుల పండుగగా మారాయి. వజ్రముష్టి కళగ మైసూరు దసరా ఉత్సవాల్లో ప్రత్యేకంగా నిలిచిన 'వజ్రముష్టి కళగ' పోటీలు. ఈ పోటీల్లో 'జెట్టి వర్గం' కు చెందిన నైపుణ్యం కలిగిన మల్లయోధులు రాజభవనం ప్రాంగణంలో పోరాట నైపుణ్యాలను ప్రదర్శిస్తారు. మహాభారత కాలం నుంచి ఉద్భవించినట్లు భావించే ఈ పోటీలు ఇప్పటికీ రాజ కుటుంబాల మధ్య పరంపరగా కొనసాగుతున్నాయి.

Details

 చారిత్రక గొప్పతనం

మైసూరు దసరా ఉత్సవాలు మొదటగా క్రీ.శ. 1610లో వడయార్ పాలకుల కాలంలో ప్రారంభమయ్యాయి. తర్వాత 1659లో దొడ్డ దేవరాజు చాముండేశ్వరి దేవాలయాన్ని పునరుద్ధరించి, కొండపైకి వెళ్లేందుకు మెట్లు నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. చాముండేశ్వరి అమ్మవారిని తొమ్మిది అవతారాల్లో అలంకరించి పూజలు చేయడం ఈ ఉత్సవాల్లో ఒక ప్రధాన భక్తి కార్యక్రమం. దసరా ముగింపు ఘట్టం - జంబూ సవారీ ఉత్సవాల చివరి రోజు 'జంబూ సవారీ' ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. ఈ సవారీ కోసం ప్రత్యేకంగా సిద్ధం చేసిన గజరాజులు, అలంకరించిన హౌదాతో పాటు గర్వంగా నడుస్తారు. గరుడగంభీరమైన సంగీతం, సాంస్కృతిక ప్రదర్శనలు దసరా ఉత్సవాలకు మరింత వైభవం జోడిస్తాయి.

Details

దేవాలయ చరిత్ర - హోయసలుల నుంచి విజయనగర పాలకుల దాకా

చాముండేశ్వరి దేవాలయం 12వ శతాబ్దంలో 'హోయసల పాలకులు' నిర్మించారని, 17వ శతాబ్దంలో విజయనగర పాలకులు ఆలయ గోపురాన్ని నిర్మించినట్లు చారిత్రక ఆధారాలు సూచిస్తాయి. హైదర్ అలీ, టిప్పు సుల్తాన్‌ వంటి ముస్లిం పాలకులు కూడా చాముండేశ్వరి అమ్మవారికి విశేష ఆభరణాలను సమర్పించి ఆచారాన్ని కొనసాగించారు. భక్తి, సాంస్కృతిక సమ్మేళనం మైసూరు దసరా ఉత్సవాలు కేవలం ఆధ్యాత్మికత మాత్రమే కాకుండా సంగీతం, సాహిత్యం, సాంస్కృతిక సంప్రదాయాలు కలిసిన వేదికగా నిలుస్తాయి. పలు కళా ప్రదర్శనలతో పాటు సంగీత కచేరీలు, సాహిత్య సమ్మేళనాలు పండుగ వేడుకలను మరింత గొప్పగా మార్చుతాయి.