NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / లైఫ్-స్టైల్ వార్తలు / Sankranti: సంక్రాంతి సంబరాల్లో భాగంగా నిమ్మకాయ రూ.40వేలు
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Sankranti: సంక్రాంతి సంబరాల్లో భాగంగా నిమ్మకాయ రూ.40వేలు
    సంక్రాంతి సంబరాల్లో భాగంగా నిమ్మకాయ రూ.40వేలు

    Sankranti: సంక్రాంతి సంబరాల్లో భాగంగా నిమ్మకాయ రూ.40వేలు

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Jan 14, 2025
    09:06 am

    ఈ వార్తాకథనం ఏంటి

    సంక్రాంతి పండుగను వివిధ ప్రాంతాల్లో విభిన్న ఆచారాలు, సంప్రదాయాలతో జరుపుకుంటారు.

    తమిళనాడులోని శివగంగై జిల్లా సలుగైపురం గ్రామంలో మాత్రం ప్రత్యేకమైన విధానంలో ఈ పండుగను నిర్వహిస్తారు.

    ఇక్కడి ఓ వర్గం ప్రజలు పచ్చైనాచ్చి బిటారి, పొన్నళగి అమ్మవార్లను తమ కులదైవాలుగా పూజిస్తారు.

    కనుమ రోజున ఇక్కడి మహిళలు గాజులు, మెట్టెలు వంటి ఆభరణాలను ధరించకుండా, తెల్లచీర కట్టుకొని, తలపై కుండలు పెట్టుకొని అమ్మవారి ఆలయాల ముందు పొంగళ్లు పెడతారు.

    ఈ ఆచారం ద్వారా దేవతల ముందు ధనిక, పేద తేడా లేకుండా అందరూ సమానమే అని తెలియజేస్తారు. అంతేకాకుండా ఇక్కడ మరో విశిష్ట ఆచారం కూడా ఉంది.

    Details

    నిమ్మకాయలతో మొక్కు చెల్లిస్తారు

    గుడి ముందు చెరకు ఊయల కట్టి, అందులో నిమ్మకాయలు పెట్టి మొక్కులు చెల్లిస్తారు.

    ఆ తర్వాత ఆ నిమ్మకాయలను వేలం వేస్తారు. ఈ నిమ్మకాయలు కొంటే మనసులో అనుకున్న కార్యాలు నెరవేరతాయని గ్రామస్థుల నమ్మకం.

    ఈ కారణంగా ఒక్కో నిమ్మకాయ సుమారు రూ.40 వేలు, చెరకుగడలు సుమారు రూ.16 వేలు వరకు ధర చేస్తాయి.

    ఇంకా సేలం జిల్లా నత్తకరై గ్రామంలోని 300 ఏళ్ల నల్లసేవన్ ఆలయంలో ఐదేళ్లకోసారి పొంగల్ పండుగ సందర్భంగా చుట్టుపక్క గ్రామాల నుంచి వివాహిత మహిళలు వితంతు వేషంలో వచ్చి సూర్యోదయానికి ముందే పొంగళ్లు పెట్టి తమ మొక్కులను తీర్చుకుంటారు.

    Details

    ఆడపిల్లలతో కుమ్మీ ఆడించే ఆచారం 

    పుదుకోట్టై జిల్లా సెరియలూర్ గ్రామంలో ఆడపిల్లలు బతుకమ్మ పండుగలా కుమ్మీ అనే జానపద నృత్యాన్ని ఆడతారు.

    రజస్వల కాని ఆడపిల్లలు ముందుగా వ్రతం చేసి, సంక్రాంతి రోజున పొంగళ్లు వండి, పువ్వులు, వేప, చెరకు, బెల్లం వంటి పదార్థాలతో వెదురు బుట్టను తలపై పెట్టుకొని ఊరేగింపుగా వెళ్తారు. అటవీ ప్రాంతంలో ఉన్న రాకాచ్చి అమ్మవారి వద్ద ఈ వస్తువులను ఉంచి కుమ్మీ ఆడతారు.

    చివరకు పొంగలిని మినహా మిగిలిన వస్తువులను గొయ్యి తీసి పూడ్చిపెడతారు.

    పూర్వకాలంలో పొంగు సోకిన ఓ ఆడపిల్ల పాలచెట్టుపై నుంచి పడి మరణించిందని, అలాంటి సంఘటనలు మళ్లీ జరగకూడదనే ఉద్దేశంతో ఈ పండుగలో 'అమ్మవారి వ్యాధి' నివారణకు మూలికలతో ఊరేగింపుగా వెళ్లి ఈ ఆచారాన్ని కొనసాగిస్తున్నట్లు గ్రామస్థులు విశ్వసిస్తారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    సంక్రాంతి
    తమిళనాడు

    తాజా

    IMD: 4-5 రోజుల్లో రుతుపవనాలు కేరళకు చేరుకునే అవకాశం ఉంది: ఐఎండీ ఐఎండీ
    Vizag Deputy Mayor: జనసేనకు విశాఖలో మరో పదవి.. డిప్యూటీ మేయర్‌గా గోవింద్‌రెడ్డి ఏకగ్రీవ ఎన్నిక విశాఖపట్టణం
    Raashii Khanna: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కు ప్రమాదం.. ముక్కు నుంచి రక్తం.. చేతులకు గాయాలు..  టాలీవుడ్
    Venu : 'ఎల్లమ్మ' ప్రారంభానికి సర్వం సిద్ధం.. కన్‌ఫర్మ్‌ చేసిన దర్శకుడు వేణు టాలీవుడ్

    సంక్రాంతి

    సంక్రాంతి సంబరం: పాలతో తయారయ్యే నోరూరించే తీపి పదార్థాలు, మీకోసమే వంటగది
    సంక్రాంతి పండగ: మొదటి రోజు భోగి పండుగను జరుపుకునే విధానాలు పండగ
    సంక్రాంతి: పండగ విశిష్టత, ప్రాముఖ్యత, జరుపుకునే విధానాలు పండగ
    సంక్రాంతి: కొన్ని ప్రాంతాల్లో మాత్రమే జరుపుకునే ముక్కనుమ గురించి తెలుసుకోండి లైఫ్-స్టైల్

    తమిళనాడు

    Tamilnadu: తమిళనాడు పటాకుల గోదాములో పేలుడు.. ఇద్దరు దుర్మరణం ఇండియా
    Tamil Nadu : ఏఐ హబ్‌గా ఎదుగుతున్న తమిళనాడు.. గూగుల్, అమెజాన్ సహా ప్రముఖ టెక్ దిగ్గజాల పెట్టుబడులు అమెజాన్‌
    Rape: లిఫ్ట్ ఇచ్చి మహిళపై ఆత్యాచారానికి పాల్పడ్డ దుండగులు ఇండియా
    Tamilnadu: మధురై మహిళా హాస్టల్‌లో అగ్ని ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి  భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025