NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / లైఫ్-స్టైల్ వార్తలు /  Char dham yatra:చార్ ధామ్ యాత్ర ప్రారంభం.. గంగోత్రి, యమునోత్రి పోర్టల్స్ ఓపెన్ 
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
     Char dham yatra:చార్ ధామ్ యాత్ర ప్రారంభం.. గంగోత్రి, యమునోత్రి పోర్టల్స్ ఓపెన్ 
    చార్ ధామ్ యాత్ర ప్రారంభం.. గంగోత్రి, యమునోత్రి పోర్టల్స్ ఓపెన్

     Char dham yatra:చార్ ధామ్ యాత్ర ప్రారంభం.. గంగోత్రి, యమునోత్రి పోర్టల్స్ ఓపెన్ 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Apr 30, 2025
    12:29 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఉత్తరాఖండ్‌లో బుధవారం అక్షయ తృతీయ పర్వదినాన్ని పురస్కరించుకుని పవిత్ర చార్‌ధామ్ యాత్ర ఘనంగా ప్రారంభమైంది.

    ఈ నేపథ్యంలో ఉత్తర్‌కాశీ జిల్లాలో గంగోత్రి, యమునోత్రి ఆలయాల ద్వారాలు వేద మంత్రోచ్ఛారణల మధ్య భక్తుల కోసం తెరిచారు.

    ఈ పవిత్ర ఘట్టాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి భక్తులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

    ఈ యాత్ర సనాతన ధర్మం, భక్తి, విశ్వాసం,ఆధ్యాత్మిక శక్తికి ప్రతీకగా నిలుస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.

    ఇక కేదార్‌నాథ్ ధామ్ ఆలయం శుక్రవారం, బద్రీనాథ్ ఆలయం ఆదివారం భక్తులకు తెరుచుకోనుంది.

    వివరాలు 

    భైరవఘాటిని విడిచి గంగోత్రి ధామ్‌కు..

    గంగోత్రి, యమునోత్రి ఆలయాలు తెరవడం ద్వారా ఉత్తరకాశి జిల్లాలో చార్‌ధామ్ యాత్రకు శ్రీకారం చుట్టారు.

    ముక్బా గ్రామం నుండి గంగాదేవి పల్లకీని ఆరు నెలల శీతాకాల విరామం అనంతరం మంగళవారం గంగోత్రి ధామ్‌కు తీసుకువచ్చారు.

    గత రాత్రి భైరవఘాటిలో ఉన్న భైరవ ఆలయంలో విశ్రాంతి కోసం పల్లకీని నిలిపారు.

    ఈరోజు ఉదయం పల్లకీ భైరవఘాటిని విడిచి గంగోత్రి ధామ్‌కు చేరుకుంటుంది.

    అక్కడ ఉదయం 10:30 గంటలకు సంప్రదాయ పద్ధతుల్లో వేద మంత్రాల మధ్య ఆలయ ద్వారాలు తెరుచుకోనున్నట్లు తీర్థ పురోహిత్ రాజేష్ సెమ్వాల్ తెలిపారు.

    వివరాలు 

    ఆదివారం నాడు బద్రీనాథ్ ఆలయ దర్శనం 

    ఇదిలా ఉంటే, యమునాదేవి పల్లకీ ఈ ఉదయం ఖర్సాలిలోని తన శీతాకాల నివాసం నుండి యమునోత్రి ధామ్ వైపు ప్రయాణం ప్రారంభించింది.

    అక్కడ ఆలయ ద్వారాలు భక్తుల సందర్శనార్థం ఉదయం 11:55 గంటలకు తెరవబడనున్నాయి.

    ఇక శుక్రవారం నాడు కేదార్‌నాథ్ ఆలయ ద్వారాలు భక్తులకు అందుబాటులోకి రానుండగా, ఆదివారం నాడు బద్రీనాథ్ ఆలయం భక్తులకు దర్శనానిస్తుందనే విషయం తెలిసిందే.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఉత్తరాఖండ్

    తాజా

    SRH vs RCB: ఆర్సిబి కి షాక్ .. 42 పరుగుల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్ గెలుపు  ఐపీఎల్
    MLC Kavitha: కేసీఆర్‌ చుట్టూ ఉన్న దెయ్యాల ఉన్నాయి.. వాటి వల్లే పార్టీకి నష్టం: ఎమ్మెల్సీ కవిత కల్వకుంట్ల కవిత
    Chandrababu: అమరావతిని రాజధానిగా నోటిఫై చేయాలని కేంద్రాన్ని కోరాం: సీఎం చంద్రబాబు చంద్రబాబు నాయుడు
    IPL 2025: టీ20లో నాలుగు వేల క్ల‌బ్‌లో అభిషేక్..  అభిషేక్ శర్మ

    ఉత్తరాఖండ్

    Uttarkashi Tunnel: సొరంగంలో కార్మికుల వద్దకు రెస్క్యూ టీమ్.. 41మంది ఏ క్షణమైనా బయటకు రావచ్చు  తాజా వార్తలు
    Uttarakhand Tunnel: 17 రోజుల తర్వాత సొరంగం నుండి సురక్షితంగా బయటకువచ్చిన 41 మంది కార్మికులు   భారతదేశం
    Uttarakhand tunnel: ఉత్తరకాశీ సొరంగం కార్మికులతో మాట్లాడిన ప్రధాని మోదీ  నరేంద్ర మోదీ
    Ram Temple consecration: ఆలయ నిర్మాణం అసంపూర్తి: అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి నలుగురు శంకరాచార్యులు దూరం భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025