NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / లైఫ్-స్టైల్ వార్తలు / Telangana Tourism:పర్యాటకులకు తెలంగాణ టూరిజం శుభవార్త.. సోమశిల-శ్రీశైలం వరకు లాంచీ ప్రయాణ సేవలు..
    తదుపరి వార్తా కథనం
    Telangana Tourism:పర్యాటకులకు తెలంగాణ టూరిజం శుభవార్త.. సోమశిల-శ్రీశైలం వరకు లాంచీ ప్రయాణ సేవలు..
    పర్యాటకులకు తెలంగాణ టూరిజం శుభవార్త

    Telangana Tourism:పర్యాటకులకు తెలంగాణ టూరిజం శుభవార్త.. సోమశిల-శ్రీశైలం వరకు లాంచీ ప్రయాణ సేవలు..

    వ్రాసిన వారు Sirish Praharaju
    Oct 25, 2024
    12:31 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    నల్లమల అటవీ ప్రాంతంలో, కొండకోనల మధ్య కృష్ణా నది ఒడ్డున విహారయాత్రకు తెలంగాణ రాష్ట్ర పర్యాటకశాఖ సన్నాహాలు చేస్తోంది.

    మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశాల ప్రకారం, ఈ నెల 26 నుండి నాగర్‌కర్నూల్ జిల్లా సోమశిల నుంచి శ్రీశైలం వరకు లాంచీ ప్రయాణాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు.

    కొల్లాపూర్ మండలంలో సోమశిల వద్ద ఒకేసారి 120 మంది ప్రయాణం చేయగలుగుతున్న డబుల్ డెక్కర్ తరహా ఏసీ లాంచీని ఏర్పాటు చేశారు.

    కృష్ణా నదిలో సోమశిల నుంచి శ్రీశైలం వరకు 120 కి.మీ దూరంలో 7 గంటల పాటు లాంచీ ప్రయాణం కొనసాగుతుంది.

    ఈ లాంచీ ప్రయాణానికి పెద్దలకు రూ.2,000 మరియు పిల్లలకు రూ.1,600 టికెట్ ధరగా నిర్ణయించబడిందని సోమశిల లాంచీ ఇన్‌ఛార్జి శివకృష్ణ తెలిపారు.

    వివరాలు 

    ప్రయాణ వివరాలు 

    నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్‌లోని సోమశిల నుండి శ్రీశైలం వరకు సింగిల్ రైడ్ , రౌండప్ క్రూయిజ్ జర్నీ ధరలు కూడా ప్రకటించారు.

    పెద్దలకు రూ.2,000, పిల్లలకు వన్-వే జర్నీకి రూ.1,600, పెద్దలకు రూ.3,000, పిల్లలకు రౌండ్ ట్రిప్ (పెద్దలు-పైకి క్రిందికి) రూ.2,400గా టికెట్ ధరలు నిర్ణయించారు.

    తొలిరోజు ఉదయం 9 గంటలకు బషీర్‌బాగ్‌లోని సీఆర్‌వో కార్యాలయం నుంచి శ్రీశైలానికి బస్సు ప్రయాణం ప్రారంభమవుతుంది. శ్రీశైలంలో చేరుకున్న తరువాత హోటల్‌లో చెక్ ఇన్ చేయాల్సి ఉంటుంది.

    అనంతరం శ్రీభామరాంబ మల్లిఖార్జున స్వామి దర్శనం ఉండనుంది. వీలైతే ఆ సాయంత్రం ఆనకట్ట సందర్శనను నిర్వహించడానికి ప్రయత్నిస్తారు. ఆ రాత్రి శ్రీశైలంలో బస చేయాలి.

    వివరాలు 

    ప్రయాణ వివరాలు 

    రెండో రోజు ఉదయం తొమ్మిది గంటలకు శ్రీశైలంతో సోమశిలకు ప్రయాణం జరుగుతుంది. ఈ సమయంలో ప్రయాణం శ్రీశైలంనుండి సోమశిల వరకు పడవ విహారం అవుతుంది. సాయంత్రం వరకు అక్కడే సరదాగా గడిపే అవకాశం ఉంటుంది.

    సాయంత్రం 5 గంటలకు సోమశిల నుంచి హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం మొదలుకానుంది. రాత్రి 9 గంటలకు భాగ్యనగరం చేరుకుని పర్యటన ముగుస్తుంది.

    ప్రయాణ వివరాలు మరియు టిక్కెట్ బుకింగ్ సమాచారం కోసం https://tourism.telangana.gov.in/blogpage?id=14 లేదా మొబైల్ నంబర్ 7731854994ను సంప్రదించవచ్చు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలంగాణ

    తాజా

    Russia:ప్రత్యక్ష చర్చలు జరపాలి.. భారత్‌-పాక్‌లకు రష్యా కీలక సందేశం భారతదేశం
    Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి ఇజ్రాయెల్
    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ
    Andhra Pradesh: మహిళలకు గుడ్ న్యూస్.. ఆ రోజు నుంచే ఉచిత బస్సు ప్రయాణం చంద్రబాబు నాయుడు

    తెలంగాణ

    Telangana: తెలంగాణ ప్రభుత్వ చారిత్రాత్మక నిర్ణయం.. గల్ఫ్ మృతులకు రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా రేవంత్ రెడ్డి
    Telangana: మహిళా సంక్షేమం కోసం మరో కొత్త కార్యక్రమం.. తెలంగాణలో కొత్త పథకం ప్రారంభం రేవంత్ రెడ్డి
    Hyderabad: హైదరాబాద్‌కు ప్రపంచ ప్రఖ్యాత స్టాన్‌ఫర్డ్, ఆక్స్‌ఫర్డ్‌లను రప్పించడంపై దృష్టి .. నగర బ్రాండ్‌ పెంపే ప్రభుత్వ లక్ష్యం  తెలంగాణ లేటెస్ట్ న్యూస్
    Revanth Reddy: ఎస్సీ వర్గీకరణ కోసం 60 రోజుల్లో నివేదిక.. జాబ్‌ నోటిఫికేషన్లపై సీఎం రేవంత్‌ కీలక నిర్ణయం రేవంత్ రెడ్డి
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025