Page Loader
Rathasaptami: రథసప్తమి పూజా విధానం, విశిష్టత గురించి తెలుసుకోండి
రథసప్తమి పూజా విధానం, విశిష్టత గురించి తెలుసుకోండి

Rathasaptami: రథసప్తమి పూజా విధానం, విశిష్టత గురించి తెలుసుకోండి

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 04, 2025
09:17 am

ఈ వార్తాకథనం ఏంటి

రథసప్తమి విశిష్టతను వివరించే ఈ కథనం సూర్యుడి మహిమను, ఆయన భక్తులకు ప్రసాదించే అనుగ్రహాన్ని తెలియజేస్తుంది. అయనం అంటే గమనం, మార్గం. సూర్యుడు సాగే మార్గాన్ని అయనం అంటారు. సంవత్సరం పన్నెండు నెలలను రెండు అయనాలుగా విభజించారు. దక్షిణాయనం, ఉత్తరాయనం. మనుషులకు సూర్యుడు పగలంతా కనిపిస్తాడు, రాత్రి అంతా కనిపించదు. దేవతల విషయంలో అయితే ఆరు నెలలు దక్షిణాయనం, మరిన్ని ఆరు నెలలు ఉత్తరాయనం. దక్షిణాయనం చీకటి పాలైన కాలం. ఉత్తరాయనం మాఘ శుద్ధ సప్తమి నాడు ఉదయంతో ప్రారంభమవుతుంది. ఈ రోజును సూర్య జయంతి, రథసప్తమి అని పిలుస్తారు.

Details

సూర్యడి రథానికి ఏడు గుర్రాలు

సూర్యుడిని కాశ్యపేయుడు, ఆదిత్యుడు అనే పేర్లతో కూడా పిలుస్తారు. కశ్యప మహర్షికి దితి, అదితి అనే భార్యలు. అదితి కుమారుడు కాబట్టి ఆదిత్యుడు అనే పేరు వచ్చింది. అంతేకాక భాస్కరుడు, భానుడు, రవి వంటి మరెన్నో పేర్లున్నాయి. సూర్యుడి రథానికి ఏడు గుర్రాలుంటాయి. అందుకే ఆయన 'సప్తాశ్వ రథమారూఢుడు' అని కొనియాడబడతాడు. సూర్యుడు జగత్తును తిలకించే నారాయణ స్వామి నేత్రం, అంటే భగవంతుడే. సూర్యగమనానికి ఉపయుక్తమైన అశ్వాలు ఏడు—గాయత్రి, బృహతి, ఉష్ణిక్, జగతి, త్రిష్టుప్, అనుష్టుప్, పంక్తి. ఏడు లోకాలలోని జీవులకు కలిగే ఏడు రకాల రోగాలను నయం చేయగల శక్తి భానుడికి ఉంది.

Details

ఆదిత్య హృదయం పవిత్రమైనది

ఇవి అరిషడ్వర్గాల వల్ల మాత్రమే కాకుండా, జన్మ-జన్మాంతర ఫలితాలు, వాచిక, మానసిక, కాయక, జ్ఞాన, అజ్ఞాన కారణాల వల్ల కలిగే కష్టాలను కూడా పోగొడతాయి. రావణాసురుని వెంటిల్లు చేసే యుద్ధంలో రాముడు శ్రమతో క్షీణించిపోతే, దేవతలు ఆందోళన చెందారు. అప్పుడు అగస్త్య మహర్షి ప్రత్యక్షమై శ్రీరామచంద్రునికి 'ఆదిత్య హృదయం' పారాయణం సూచించగా, యుద్ధకాండలో వాల్మీకి మహర్షి దీనిని వర్ణించాడు. 'ఆదిత్య హృదయం పవిత్రమైనది, సర్వశత్రునాశకమైనది, అక్షయమైనది, పరమౌషధ సమానమైనది...' అని పేర్కొన్నారు.

Details

ధర్మరాజుకు లభించిన అక్షయపాత్ర సూర్యుడి ప్రసాదమే

ఆ స్తోత్రం పారాయణం చేసి శ్రీరాముడు విజయం సాధించాడు. రథసప్తమి విశేషాలు భవిష్యోత్తర, మత్స్య పురాణాల్లో ప్రస్తావించారు. శ్రీకృష్ణుడు ధర్మరాజుకు ఈ పర్వదినం విశిష్టతను వివరించాడు. ధర్మరాజుకు లభించిన అక్షయపాత్ర సూర్యుడి ప్రసాదమే. రథసప్తమి పర్వదినాన్ని ఎంతో వైభవంగా జరుపుకుంటారు. తెల్లవారుజామునే లేచి ఇంటి ముందర రథము ముగ్గు వేస్తారు. తలస్నానం చేసి శుద్ధిగా పూజా సామగ్రిని సిద్ధం చేసుకుని, పాలు పొంగించి, క్షీరాన్నం నైవేధ్యంగా సమర్పిస్తారు. స్నాన సమయంలో ఏడు అర్కపత్రాలను (జిల్లేడు ఆకులు) తలపై ఉంచుకుని స్నానం చేస్తారు.

Details

శ్రీకాకుళం అరసవల్లి, తిరుమల ప్రాంతాల్లో వైభవంగా రథసప్తమి ఉత్సవాలు

చిక్కుడు కాయలకు చీపురుపుల్లలు గుచ్చి రథాన్ని రూపొందిస్తారు. ఆ రథాన్ని జిల్లేడు ఆకులపై ఉంచి, అక్షింతలు జల్లి, దీప ధూప నైవేద్యాలతో భక్తితో పూజిస్తే, కోట్ల పుణ్యఫలాలను పొందుతారని చెబుతారు. యోగాసనాల్లో సూర్య నమస్కారాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఉదయించే సూర్యుణ్ని దర్శించడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. సూర్యుడు కర్మ సాక్షి. కోణార్క్ సూర్యదేవాలయం, శ్రీకాకుళం అరసవల్లి, తిరుమల ప్రాంతాల్లో రథసప్తమి ఉత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహిస్తారు!