NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / లైఫ్-స్టైల్ వార్తలు / Crying disease in Congo: 50మందికిపైగా మృతి.. 400 మందికి పైగా అస్వస్థతకు గురైన మిస్టరీ డిసీజ్‌ లక్షణాలివే
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Crying disease in Congo: 50మందికిపైగా మృతి.. 400 మందికి పైగా అస్వస్థతకు గురైన మిస్టరీ డిసీజ్‌ లక్షణాలివే
    400 మందికి పైగా అస్వస్థతకు గురైన మిస్టరీ డిసీజ్‌ లక్షణాలివే

    Crying disease in Congo: 50మందికిపైగా మృతి.. 400 మందికి పైగా అస్వస్థతకు గురైన మిస్టరీ డిసీజ్‌ లక్షణాలివే

    వ్రాసిన వారు Sirish Praharaju
    Feb 28, 2025
    02:14 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో (DRC)లో ఓ మిస్టరీ వ్యాధి భయాందోళన కలిగిస్తోంది.వాయువ్య కాంగోలో ఈ వింత వ్యాధిని గుర్తించారు.

    ఇప్పటి వరకు ఈ వ్యాధి కారణంగా 50 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.రోజురోజుకూ ఈ మిస్టరీ వ్యాధి ప్రభావంతో మరణాల సంఖ్య పెరుగుతోంది.

    యూకే నిపుణుల హెచ్చరిక

    ఈ వ్యాధి విస్తృతి వేగంగా పెరుగుతుండటంతో యునైటెడ్ కింగ్‌డమ్ (యూకే) అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరించారు.

    ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం, గత ఐదు వారాల్లో వాయువ్య కాంగోలో 419 కేసులు నమోదు కాగా, 53 మంది మరణించారు.

    బాధితుల్లో లక్షణాలు కనిపించిన రెండు రోజుల్లోనే మరణాలు సంభవించాయి.

    వివరాలు 

    లక్షణాలు 

    ఈ వింత వ్యాధితో బాధపడుతున్నవారిలో జ్వరం,వాంతులు,అంతర్గత రక్తస్రావం మొదలైన లక్షణాలు కనిపిస్తున్నాయి.

    లక్షణాలు ప్రారంభమైన 48 గంటల్లోనే బాధితులు మరణిస్తున్నారు.నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ వ్యాధి గబ్బిలాలు తిన్న ముగ్గురు పిల్లలలో తొలిసారిగా కనిపించింది.

    ఆ తరువాత కేసులు వేగంగా పెరుగుతున్నాయి.

    వింత వ్యాధి ఏమిటి?

    ఈ వ్యాధి సోకిన వారిలో అంతర్గత రక్తస్రావానికి దారి తీస్తుంది.హెమరేజిక్ ఫీవర్,ఎబోలా,డెంగ్యూ, ఎల్లో ఫీవర్ వంటి వైరస్‌ల వల్ల ఇది సంభవించే అవకాశం ఉన్నప్పటికీ, ఇప్పటివరకు తీసుకున్న శాంపిల్స్‌ను పరిశీలించిన నిపుణులు ఈ మిస్టరీ వ్యాధికి వీటితో ఎలాంటి సంబంధం లేదని తేల్చారు.

    WHO ప్రస్తుతం మలేరియా, వైరల్ హెమరేజిక్ ఫీవర్, టైఫాయిడ్, మెనింజైటిస్, ఫుడ్ పాయిజనింగ్ వంటి ఇతర కారణాలను పరిశీలిస్తోంది.

    వివరాలు 

    50 మందికి పైగా మృతి 

    ఈ వింత వ్యాధి కారణంగా ఇప్పటివరకు 50 మందికి పైగా మరణించారు. జనవరి 21న కాంగోలో తొలిసారిగా వెలుగుచూసిన ఈ వ్యాధి, ఇప్పటివరకు 400కి పైగా కేసులను నమోదు చేసింది.

    WHO (ప్రపంచ ఆరోగ్య సంస్థ) ప్రకటన

    WHO ఆఫ్రికా కార్యాలయం ప్రకారం, ఈ వ్యాధి బోలోకో గ్రామంలో మొదలైంది.

    ముగ్గురు పిల్లలు గబ్బిలాలు తిన్న తర్వాత ఈ వ్యాధి లక్షణాలు కనిపించాయి.

    వైద్య నిపుణులు అనారోగ్యంతో మరణించిన పిల్లలు గబ్బిలాలు తిన్నారనే నివేదికలను పరిశీలిస్తున్నారు.

    ఈ వ్యాధి జూనోటిక్ వ్యాధిగా భావిస్తున్నారు, అంటే జంతువుల నుంచి మానవులకు వ్యాపించే వ్యాధిగా ఇది గుర్తింపు పొందింది.

    వివరాలు 

    వ్యాధి ప్రభావం

    ఈ వ్యాధి ప్రధానంగా పోషకాహార లోపం, మలేరియాతో సంబంధం ఉన్నట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు.

    ఇప్పటివరకు 400 మందికి పైగా ఈ వ్యాధితో బాధపడుతుండగా, 79 మంది మరణించారు.

    14 ఏళ్లలోపు చిన్నారులే ఎక్కువగా ప్రభావితమయ్యారు.

    మరింత ప్రమాదం ఉందా?

    గత ఏడాది చివరిలో కాంగోలో తీవ్రమైన మలేరియా వల్ల ఏర్పడిన ఇన్ఫెక్షన్ కన్నా ఈ కొత్త వ్యాధి లక్షణాలు భిన్నంగా ఉన్నాయని డాక్టర్ స్టామటాకి తెలిపారు.

    అయితే, ఇప్పటివరకు ఇది ఏ వైరస్ వల్ల వస్తుందో స్పష్టత రాలేదు.

    వివరాలు 

    వ్యాధి నియంత్రణ 

    ఈ వ్యాధి ఎలా వ్యాపిస్తుందో తెలియకపోవడంతో, అదుపులోకి తేవడం కష్టంగా మారింది.

    వ్యాప్తిని అరికట్టేందుకు బాధితులను క్వారంటైన్ చేయడం మాత్రమే ప్రస్తుతం లభ్యమైన మార్గంగా నిపుణులు చెబుతున్నారు.

    గబ్బిలాల ద్వారా ఈ వైరస్ వ్యాపిస్తుందా లేదా అనేది ఇంకా నిర్ధారణ కాలేదు.

    కానీ, గబ్బిలాల వల్ల మానవులకు వైరస్ సోకే అవకాశముందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కాంగో

    తాజా

    Motivational: భయాన్ని దాటితే విజయమే! జానకి కథ మీలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది ప్రేరణ
    Kamal Haasan: కన్నడ ప్రజల మనోభావాలు గాయపర్చే ఉద్దేశం లేదు : కమల్ హాసన్ లేఖ కమల్ హాసన్
     Pardeep Narwal: కబడ్డీకి పర్దీప్ నర్వాల్ రిటైర్మెంట్ స్పోర్ట్స్
    CDS Anil Chauhan: యుద్ధంలో నష్టం అనేది ముఖ్యం కాదు.. దాని ఫలితమే ప్రధానం: సీడీఎస్ అనిల్ చౌహాన్.. ఆపరేషన్‌ సిందూర్‌

    కాంగో

    DR Congo: డీఆర్‌ కాంగో జైలులో129 మంది మృతి.. 59 మందికి గాయాలు  అంతర్జాతీయం
    Congo: కాంగో దేశంలో మరో కొత్త మహమ్మారి.. వైరస్ సోకిన కేవలం 48 గంటల్లోనే 50 మందికిపైగా మృతి   అంతర్జాతీయం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025