
Dasara 2024: దసరా ఉత్సవాల్లో విజయవాడ దుర్గమ్మకు ఏయే ఆభరణాలు అలంకరిస్తారంటే..
ఈ వార్తాకథనం ఏంటి
దసరా ఉత్సవాల సమయంలో ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాతను దర్శించుకునేందుకు దేశం నలువైపుల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలి వస్తారు.
శరన్నవరాత్రులలో దుర్గమ్మ తల్లిని దర్శించడం వల్ల జీవితం సమృద్ధిగా సాగుతుందనే నమ్మకం ఉంది.
ఈ ఉత్సవాల్లో అమ్మవారి అలంకారాలు కూడా భక్తులకు ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి.
భక్తులు సమర్పించిన ఆభరణాలతో పాటు సంప్రదాయంగా వస్తున్న వాటితో అమ్మవారిని అలంకరిస్తారు. ఏ అలంకారాలు ఉపయోగిస్తారో తెలుసుకోవాలన్న ఆసక్తి భక్తుల్లో నెలకొంటుంది.
వివరాలు
ఏ ఆభరణాలు వినియోగిస్తారంటే..
బాలాత్రిపుర సుందరీదేవి: అభయహస్తాలు, బంగారు పూలజడ, కంఠాభరణాలు, బంగారు వడ్డాణం.
గాయత్రీదేవి: స్వర్ణ పంచముఖాలు, బంగారు అభయహస్తాలు, పచ్చల హారం, కంఠాభరణాలు.
అన్నపూర్ణాదేవి: స్వర్ణపాత్ర, బంగారు త్రిశూలం, హస్తాలు.
లలితా త్రిపుర సుందరీదేవి: స్వర్ణ కిరీటం, కంఠాభరణాలు, స్వర్ణాభరణాలు, అభయహస్తాలు.
మహాచండీదేవి: సింహ వాహనం, కంఠాభరణాలు, ఖడ్గం, కర్ణాభరణాలు, హస్తాలు.
మహాలక్ష్మీదేవి: గజరాజు, అభయహస్తాలు, ధనరాశులు, వడ్డాణం, కంఠాభరణాలు, కర్ణాభరణాలు.
సరస్వతీదేవి: బంగారు వీణ, స్వర్ణహస్తాలు, పగడాల హారం, వడ్డాణం.
దుర్గాదేవి: శార్దూల వాహనం, బంగారు త్రిశూలం, సూర్యచంద్రులు, శంకుచక్రాలు.
మహిషాసుర మర్ధినిదేవి: సింహవాహనం, బంగారు త్రిశూలం, స్వర్ణ ఖడ్గం, కంఠాభరణాలు, కర్ణాభరణాలు.
రాజరాజేశ్వరిదేవి: స్వర్ణాభరణాలు, అభయహస్తాలు, చెరకుగడతో అలంకరిస్తారు. కాసులపేరు, బంగారు పూలజడ, దేవిపాదాలు అమ్మవారి రూపాన్ని అనుసరించి వాడతారు.