NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / లైఫ్-స్టైల్ వార్తలు / Republic Day: జనవరి 26న రిపబ్లిక్ డేను ఎందుకు జరుపుకోవాలి? దాని ప్రాముఖ్యత ఏమిటో తెలుసుకుందాం!
    తదుపరి వార్తా కథనం
    Republic Day: జనవరి 26న రిపబ్లిక్ డేను ఎందుకు జరుపుకోవాలి? దాని ప్రాముఖ్యత ఏమిటో తెలుసుకుందాం!
    జనవరి 26న రిపబ్లిక్ డేను ఎందుకు జరుపుకోవాలి? దాని ప్రాముఖ్యత ఏమిటో తెలుసుకుందాం!

    Republic Day: జనవరి 26న రిపబ్లిక్ డేను ఎందుకు జరుపుకోవాలి? దాని ప్రాముఖ్యత ఏమిటో తెలుసుకుందాం!

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Jan 12, 2025
    02:41 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    1950 జనవరి 26న భారతావనికి గణతంత్ర దేశంగా మారడం సంతోషకరమైన చారిత్రక ఘట్టం. మొట్టమొదటిగా డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ రాష్ట్రపతిగా ప్రమాణస్వీకారం చేసి, 21 ఫిరంగుల సెల్యూట్ స్వీకరించారు.

    దేశానికి స్వతంత్రం లభించిన మూడు సంవత్సరాల తర్వాత సంపూర్ణ గణతంత్రత స్థాపన జరిగింది.

    దాదాపు 200 ఏళ్ల పాటు బ్రిటిష్ పాలన అనుభవించిన భారతావనిలో 1947 ఆగస్టు 15న స్వాతంత్రం లభించినా, సంపూర్ణ స్వరాజ్యం మాత్రం 1950లో ప్రారంభమైంది.

    బ్రిటిష్ వారు తమ వ్యాపార అవసరాలకు అనుకూలంగా భారతీయ సమాజాన్ని విభజించుకున్నారు. 'విభజించు-పాలించు' విధానంతో అహంకారంతో అధికారం సాధించారు.

    కానీ స్వాతంత్ర పోరాటంలో వేలాది మంది త్యాగాలు చేసి, గాంధీ నాయకత్వంలో అహింసాయుధంతో దేశాన్ని ఆజాదీకి తీసుకువచ్చారు.

    Details

     రిపబ్లిక్ డే వెనుక చరిత్ర ఇదే

    1947లో స్వాతంత్రం వచ్చినా, దేశానికి సర్వసత్తాక రాజ్యాంగం 1950లోనే అమలులోకి వచ్చింది. 1949 నవంబర్ 26న భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్ ఆమోదించింది.

    అయితే 1930 జనవరి 26న లాహోర్‌లో జవహర్‌లాల్ నెహ్రూ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ పూర్ణ స్వరాజ్య తీర్మానం చేసింది.

    ఈ చారిత్రక తేదీకి ప్రాముఖ్యత కల్పించాలన్న ఉద్దేశంతోనే జనవరి 26ను గణతంత్ర దినోత్సవంగా నిర్ణయించారు.

    రాజ్యాంగ రచన ప్రక్రియ

    రాజ్యాంగాన్ని రచించేందుకు 2 సంవత్సరాలు, 11 నెలలు, 18 రోజులు పట్టింది. దీనికి 64 లక్షల రూపాయల వ్యయం అయ్యింది.

    బ్రిటిష్ పాలనలో ఉన్న 1935 చట్టం పునాది కాగా, అనేక సవరణల తర్వాత 1950 జనవరి 26న ఇది అమలులోకి వచ్చింది.

    Details

     రిపబ్లిక్ డే విశిష్టత 

    జనవరి 26, 1950న డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ రాష్ట్రపతిగా ప్రమాణం చేసి, జాతీయ జెండాను ఎగురవేశారు.

    ఆ రోజున బ్రిటిష్ చట్టం రద్దై, భారతావనిలో ప్రజాస్వామ్య రాజ్యం అమల్లోకొచ్చింది. సమానత్వం,స్వేచ్ఛ, లౌకికతను హక్కులుగా పొందారు.

    74 సంవత్సరాల గణతంత్ర దినోత్సవం

    ఈ గణతంత్ర దినోత్సవం వేళ రైతుల పరేడ్ నిర్వహించడం ప్రజాస్వామ్య విలువలను ప్రామాణికంగా చూపింది. రైతులు, కార్మికులే స్వతంత్ర భారతానికి వాస్తవ పునాది అని చెప్పడం ఖాయం.

    మొదటి గణతంత్ర దినోత్సవం ఘనత

    డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ దర్బార్ హాల్‌లో ప్రమాణం చేసిన తర్వాత, ఐదు మైళ్ల పరేడ్ కర్తవ్య పథ్ వరకు జరిగింది.

    ఇర్విన్ స్టేడియంలో జాతీయ జెండాను ఎగురవేసి, దేశాన్ని సంపూర్ణ స్వరాజ్య దేశంగా ప్రకటించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    గణతంత్ర దినోత్సవం

    తాజా

    World Environment Day 2025: నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం.. ప్లాస్టిక్ కాలుష్యాన్ని జయిద్దాం అనే థీమ్‌తో వేడుకలు ముఖ్యమైన తేదీలు
    11 years of NDA: ఎన్డీయే ప్రభుత్వానికి నిన్నటితో 11 ఏళ్లు.. ఆసక్తికర పోస్ట్ చేసిన మోదీ  నరేంద్ర మోదీ
    Stampede in India: గత ఏడాది కాలంలో దేశంలో జరిగిన తొక్కిసలాట ఘటనలు ఇవే.. భారతదేశం
    Bengaluru Stampede: బెంగళూరు తొక్కిసలాట ఘటనను సుమోటోగా విచారణకు స్వీకరించిన కర్ణాటక హైకోర్టు  బెంగళూరు

    గణతంత్ర దినోత్సవం

    రిపబ్లిక్ డే వేళ.. దిల్లీలో ఖలిస్తానీ అనుకూల పోస్టర్ల కలకలం దిల్లీ
    ఛత్తీస్‌గఢ్‌: చరిత్రలో తొలిసారిగా రిపబ్లిక్ డే పరేడ్‌లో 'థర్డ్ జెండర్' సిబ్బంది ఛత్తీస్‌గఢ్
    రిపబ్లిక్ డే: మీ ఇంటి అలంకరణలో మూడు రంగులను ఇలా ఉపయోగించండి లైఫ్-స్టైల్
    రాజ్‌భవన్‌లోనే గవర్నర్ రిపబ్లిక్ డే వేడుకలు, రాష్ట్ర ప్రభుత్వం లేఖపై తమిళసై అసహనం తెలంగాణ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025