Page Loader
Republic Day: జనవరి 26న రిపబ్లిక్ డేను ఎందుకు జరుపుకోవాలి? దాని ప్రాముఖ్యత ఏమిటో తెలుసుకుందాం!
జనవరి 26న రిపబ్లిక్ డేను ఎందుకు జరుపుకోవాలి? దాని ప్రాముఖ్యత ఏమిటో తెలుసుకుందాం!

Republic Day: జనవరి 26న రిపబ్లిక్ డేను ఎందుకు జరుపుకోవాలి? దాని ప్రాముఖ్యత ఏమిటో తెలుసుకుందాం!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 12, 2025
02:41 pm

ఈ వార్తాకథనం ఏంటి

1950 జనవరి 26న భారతావనికి గణతంత్ర దేశంగా మారడం సంతోషకరమైన చారిత్రక ఘట్టం. మొట్టమొదటిగా డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ రాష్ట్రపతిగా ప్రమాణస్వీకారం చేసి, 21 ఫిరంగుల సెల్యూట్ స్వీకరించారు. దేశానికి స్వతంత్రం లభించిన మూడు సంవత్సరాల తర్వాత సంపూర్ణ గణతంత్రత స్థాపన జరిగింది. దాదాపు 200 ఏళ్ల పాటు బ్రిటిష్ పాలన అనుభవించిన భారతావనిలో 1947 ఆగస్టు 15న స్వాతంత్రం లభించినా, సంపూర్ణ స్వరాజ్యం మాత్రం 1950లో ప్రారంభమైంది. బ్రిటిష్ వారు తమ వ్యాపార అవసరాలకు అనుకూలంగా భారతీయ సమాజాన్ని విభజించుకున్నారు. 'విభజించు-పాలించు' విధానంతో అహంకారంతో అధికారం సాధించారు. కానీ స్వాతంత్ర పోరాటంలో వేలాది మంది త్యాగాలు చేసి, గాంధీ నాయకత్వంలో అహింసాయుధంతో దేశాన్ని ఆజాదీకి తీసుకువచ్చారు.

Details

 రిపబ్లిక్ డే వెనుక చరిత్ర ఇదే

1947లో స్వాతంత్రం వచ్చినా, దేశానికి సర్వసత్తాక రాజ్యాంగం 1950లోనే అమలులోకి వచ్చింది. 1949 నవంబర్ 26న భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్ ఆమోదించింది. అయితే 1930 జనవరి 26న లాహోర్‌లో జవహర్‌లాల్ నెహ్రూ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ పూర్ణ స్వరాజ్య తీర్మానం చేసింది. ఈ చారిత్రక తేదీకి ప్రాముఖ్యత కల్పించాలన్న ఉద్దేశంతోనే జనవరి 26ను గణతంత్ర దినోత్సవంగా నిర్ణయించారు. రాజ్యాంగ రచన ప్రక్రియ రాజ్యాంగాన్ని రచించేందుకు 2 సంవత్సరాలు, 11 నెలలు, 18 రోజులు పట్టింది. దీనికి 64 లక్షల రూపాయల వ్యయం అయ్యింది. బ్రిటిష్ పాలనలో ఉన్న 1935 చట్టం పునాది కాగా, అనేక సవరణల తర్వాత 1950 జనవరి 26న ఇది అమలులోకి వచ్చింది.

Details

 రిపబ్లిక్ డే విశిష్టత 

జనవరి 26, 1950న డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ రాష్ట్రపతిగా ప్రమాణం చేసి, జాతీయ జెండాను ఎగురవేశారు. ఆ రోజున బ్రిటిష్ చట్టం రద్దై, భారతావనిలో ప్రజాస్వామ్య రాజ్యం అమల్లోకొచ్చింది. సమానత్వం,స్వేచ్ఛ, లౌకికతను హక్కులుగా పొందారు. 74 సంవత్సరాల గణతంత్ర దినోత్సవం ఈ గణతంత్ర దినోత్సవం వేళ రైతుల పరేడ్ నిర్వహించడం ప్రజాస్వామ్య విలువలను ప్రామాణికంగా చూపింది. రైతులు, కార్మికులే స్వతంత్ర భారతానికి వాస్తవ పునాది అని చెప్పడం ఖాయం. మొదటి గణతంత్ర దినోత్సవం ఘనత డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ దర్బార్ హాల్‌లో ప్రమాణం చేసిన తర్వాత, ఐదు మైళ్ల పరేడ్ కర్తవ్య పథ్ వరకు జరిగింది. ఇర్విన్ స్టేడియంలో జాతీయ జెండాను ఎగురవేసి, దేశాన్ని సంపూర్ణ స్వరాజ్య దేశంగా ప్రకటించారు.