చంద్రయాన్-3పై ప్రకాశ్ రాజ్ వివాదాస్పద ట్వీట్.. కేసు నమోదు
చంద్రయాన్-3పై ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ ఓ ట్వీట్ చేశాడు. అది కాస్త సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ మేరకు కర్ణాటకలోని బాగల్కోట్ జిల్లాలోని బనహట్టి పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. భారత్ ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన ఈ ప్రయోగాన్ని అవహేళన చేశారని కొందరు ఆరోపిస్తూ పోలీసులను ఆశ్రయించారు. అభ్యంతకర ట్వీట్ పై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. చంద్రయాన్-3 కీలక దశకు చేరుకున్న సందర్భంగా విక్రమ్ ల్యాండర్ చంద్రుడి నుంచి పంపుతున్న తొలి ఫొటో ఇదే అన్న రీతిలో ఓ వ్యక్తి ఛాయ్ తయారు చేస్తున్న ఫొటోను జోడించారు. ఇది మోదీని ఉద్దేశించే పోస్ట్ చేసినట్లు విమర్శలు చెలరేగుతున్నాయి. భారత ప్రగతిని సహించలేకే ఇలా వ్యంగస్త్రాలు సంధిస్తున్నారని నెటిజన్లు మండిపడుతున్నారు.