NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / టెక్నాలజీ వార్తలు / Apple: భారత్‌లో మూడో స్టోర్‌ ఏర్పాటు చేయనున్న టెక్‌ సంస్థ ఆపిల్‌.. ఎక్కడంటే..?
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Apple: భారత్‌లో మూడో స్టోర్‌ ఏర్పాటు చేయనున్న టెక్‌ సంస్థ ఆపిల్‌.. ఎక్కడంటే..?
    భారత్‌లో మూడో స్టోర్‌ ఏర్పాటు చేయనున్న టెక్‌ సంస్థ ఆపిల్‌.. ఎక్కడంటే..?

    Apple: భారత్‌లో మూడో స్టోర్‌ ఏర్పాటు చేయనున్న టెక్‌ సంస్థ ఆపిల్‌.. ఎక్కడంటే..?

    వ్రాసిన వారు Sirish Praharaju
    May 30, 2025
    12:21 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ప్రముఖ టెక్నాలజీ దిగ్గజం ఆపిల్‌ భారత్‌లో తన ఉత్పత్తి, అమ్మకాలకు సంబంధించిన కార్యకలాపాలను వేగంగా విస్తరిస్తోంది.

    ఇప్పటికే ముంబయి,న్యూఢిల్లీ నగరాల్లోని ఆపిల్ స్టోర్లకు వినియోగదారుల నుంచి మంచి స్పందన లభించిన నేపథ్యంలో, సంస్థ మరింత విస్తరణ దిశగా అడుగులు వేస్తోంది.

    ఈ క్రమంలో, త్వరలోనే భారత్‌లో మూడవ ఆపిల్ స్టోర్‌ ఏర్పాటు చేయాలని యాపిల్ యోచిస్తోంది.

    ఈ కొత్త స్టోర్‌ కోసం బెంగళూరు నగరాన్ని ఎంపిక చేసింది. నగరంలోని హెబ్బాల్ ప్రాంతంలో ఉన్న ఫీనిక్స్‌ మాల్‌లో ఈ స్టోర్‌ను ఏర్పాటు చేయనుంది.

    వివరాలు 

    దేశవ్యాప్తంగా నాలుగు రిటైల్ స్టోర్లు

    బెంగళూరు ఫీనిక్స్ మాల్‌లోని మొదటి అంతస్తులో సుమారు 8,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ మూడవ ఆపిల్ స్టోర్‌ను నిర్మించనున్నారు.

    ఇది ఢిల్లీ నగరంలో ఇప్పటికే ఉన్న ఔట్‌లెట్ తరహాలోనే ఉండనుంది. ఈ ప్రదేశాన్ని ఆపిల్ సంస్థ దశాబ్దకాలం పాటు (10 సంవత్సరాల పాటు) లీజుకు తీసుకున్నట్లు సమాచారం.

    అంటే, వచ్చే కొన్ని నెలల్లోనే ఈ స్టోర్‌ను ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

    భారత్‌లో వ్యాపార విస్తరణకు ఇంకా భారీ అవకాశాలు ఉన్నాయని, ఇటీవలి కాలంలో ఆపిల్‌ సీఈఓ టిమ్ కుక్‌ స్పష్టంగా వెల్లడించారు.

    దేశవ్యాప్తంగా నాలుగు రిటైల్ స్టోర్లను ఏర్పాటు చేయాలనే యాప్‌ల లక్ష్యాన్ని ఆయన ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.

    వివరాలు 

     ఆపిల్‌ సంస్థ తీసుకుంటున్న వ్యూహాల్లో భారత్‌ కీలక స్థానం 

    ప్రపంచవ్యాప్తంగా ఆపిల్‌ సంస్థ తీసుకుంటున్న వ్యూహాల్లో భారత్‌ ఇప్పుడు కీలకమైన స్థానాన్ని సంపాదించుకుంది.

    సంస్థ అమ్మకాలకు మాత్రమే కాకుండా ఉత్పత్తి కేంద్రంగా కూడా భారత్‌కు ప్రాధాన్యత పెరిగింది.

    గతంలో అమెరికాలో ఐఫోన్లను తయారు చేయకపోతే, ఆపిల్ ఉత్పత్తులపై 25 శాతం సుంకాన్ని విధిస్తానని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించిన విషయం తెలిసిందే.

    ఈ విధమైన సుంకాల ప్రభావం వల్ల ఆపిల్ సంస్థ భారత్, వియత్నాం వంటి దేశాల్లో పెట్టుబడులను ఏ విధంగా మళ్లించబోతుందో ఆసక్తికరంగా మారింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆపిల్

    తాజా

    Chiranjeevi : చిరంజీవి-అనీల్ రావిపూడి ప్రాజెక్ట్.. షూటింగ్ పై కీలక అప్డేట్ చిరంజీవి
    Amaravati: అమరావతిలో క్వాంటం వ్యాలీ టెక్ పార్క్‌కు గ్రీన్ సిగ్నల్ - ఎంవోయూ ర్యాటిఫికేషన్‌తో అధికారిక ఉత్తర్వులు అమరావతి
    Ola Roadster X: ఓలా రోడ్‌స్టర్ ఎక్స్.. సింగిల్ ఛార్జ్‌తో 250 కి.మీ రేంజ్ ఓలా
    WhatsApp: వాట్సాప్ స్టేటస్‌లో నాలుగు సరికొత్త ఫీచర్లు.. యూజర్లకు మరింత సౌకర్యం! వాట్సాప్

    ఆపిల్

    Warren Buffett: వారెన్ బఫెట్ వద్ద భారీ నగదు నిల్వలు: ఆపిల్, బ్యాంక్ ఆఫ్ అమెరికా షేర్ల విక్రయం  బిజినెస్
    Nvidia: ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా 'నివిడియా' నివిడియా
    Apple devices: ఆపిల్ యూజర్లకు కేంద్రం 'హై రిస్క్‌' అలర్ట్‌ టెక్నాలజీ
    Apple music : ఆపిల్ మ్యూజిక్ బుక్.. 100 బెస్ట్ ఆల్బమ్స్‌తో లాంచ్ వ్యాపారం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025