NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / టెక్నాలజీ వార్తలు / IndiaAI మిషన్‌లో భారత్ కీలక అడుగు.. 34,000 GPUలతో రికార్డ్ కంప్యూట్ సామర్థ్యం
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    IndiaAI మిషన్‌లో భారత్ కీలక అడుగు.. 34,000 GPUలతో రికార్డ్ కంప్యూట్ సామర్థ్యం
    IndiaAI మిషన్‌లో భారత్ కీలక అడుగు.. 34,000 GPUలతో రికార్డ్ కంప్యూట్ సామర్థ్యం

    IndiaAI మిషన్‌లో భారత్ కీలక అడుగు.. 34,000 GPUలతో రికార్డ్ కంప్యూట్ సామర్థ్యం

    వ్రాసిన వారు Jayachandra Akuri
    May 31, 2025
    10:31 am

    ఈ వార్తాకథనం ఏంటి

    భారత్‌లో కంప్యూటింగ్ సామర్థ్యం వేగంగా అభివృద్ధి చెందుతోంది. ప్రస్తుతం దేశీయంగా 34,000 GPUల సామర్థ్యాన్ని అందుబాటులోకి తీసుకురావడంతో, ఫౌండేషన్ మోడళ్ల రూపకల్పన దిశగా కీలకమైన ముందడుగు పడింది.

    ఈ నేపథ్యంలో స్వదేశీ AI మిషన్‌ భాగంగా, దేశీయంగా అభివృద్ధి చేయబోయే ఫౌండేషన్ మోడల్స్ నిర్మాణానికి ముగ్గురు స్టార్టప్‌లను ఎంపిక చేసినట్టు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు.

    'IndiaAI - Make AI in India, Make AI work for India' అనే న్యూఢిల్లీ సమావేశంలో ఆయన కీలక ప్రకటనలు చేశారు.

    ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, IndiaAI మిషన్‌కు ఎంపికైన జట్లు తమతమ రంగాల్లో గ్లోబల్ టాప్ 5లో నిలవాలన్నది లక్ష్యంగా పెట్టుకోవాలని సూచించారు.

    Details

    టెక్నాలజీ ప్రతి ఒక్కరికీ చేరాలి

    ప్రధాని నరేంద్ర మోదీ టెక్నాలజీ ప్రజాస్వామికరణపై చూపిన దార్శనికతకు అనుగుణంగా, టెక్నాలజీ ప్రయోజనాలను కొద్దిమందికి పరిమితం చేయకుండా ప్రతి ఒక్కరికి చేరవేయాలన్నదే మిషన్ ఉద్దేశమని తెలిపారు.

    సమాజంలో ప్రతిభను పెంపొందించేందుకు, కొత్త పరిష్కారాలను అందించేందుకు, అవకాశాలను మెరుగుపర్చేందుకు టెక్నాలజీని ప్రజలకు అందించాలన్నారు.

    IndiaAI మిషన్‌ అమలులో ప్రతీ అంశంలో గణనీయ పురోగతిని సాధిస్తున్నామని మంత్రి తెలిపారు. ఈ మిషన్‌ దేశంలో సమగ్రమైన AI పర్యావరణ వ్యవస్థను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తోంది.

    ఇందులో భాగంగా ఇప్పటికే 367 డేటాసెట్‌లను AI ఫండ్‌లో అప్‌లోడ్ చేసినట్లు వెల్లడించారు. కామన్ కంప్యూట్ వనరులు టెక్నాలజీ ప్రజాస్వామికరణకు మూలస్తంభమని పేర్కొన్నారు.

    Details

    అంతర్జాతీయ సంస్థలతో కలిసి ప్రణాళిక

    IndiaAI మిషన్‌ రివర్స్ బ్రెయిన్ డ్రెయిన్‌ను ప్రోత్సహించడానికి, మౌలిక సదుపాయాల నమూనాలు, కంప్యూటింగ్ వనరులు, భద్రత ప్రమాణాలు, ప్రతిభ అభివృద్ధి వంటి అంశాలతో కూడిన సమగ్ర AI పర్యావరణ వ్యవస్థను సృష్టించడానికి కృషి చేస్తోంది.

    స్వదేశీ డేటాపై శిక్షణ పొందిన AI మోడల్స్ అభివృద్ధి చేయడం, ప్రపంచ స్థాయిలో ప్రాసెస్ చేయగల పరిష్కారాలను అందించడమే మిషన్ ఉద్దేశమని తెలిపారు.

    IndiaAI భాగస్వామ్యంతో స్టేషన్ F, HEC పారిస్ వంటి అంతర్జాతీయ సంస్థలతో కలిసే ఈ ప్రణాళిక భారత ఆవిష్కరణ దౌత్యానికి ఒక కొత్త దశగా నిలుస్తుందని మంత్రి తెలిపారు.

    భారత్‌కి చెందిన ఉత్తమ స్టార్టప్‌లను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లే విధంగా ఈ మిషన్ పనిచేస్తోందని చెప్పారు.

    Details

    స్మార్ట్ ఫోన్ వినియోగం పెరిగింది

    ఇక మరోవైపు, దేశవ్యాప్తంగా స్మార్ట్‌ఫోన్ వినియోగం గణనీయంగా పెరిగిందని గణాంక మంత్రిత్వ శాఖ తాజా సర్వే వెల్లడించింది.

    దేశంలో 85.5 శాతం కుటుంబాలకు కనీసం ఒక స్మార్ట్‌ఫోన్ ఉందని తెలిపింది.

    15-29 ఏళ్ల గ్రామీణ యువతలో 96.8 శాతం మంది మొబైల్ ఫోన్ ద్వారా కాల్స్ చేయడం, ఇంటర్నెట్ వాడకం వంటి కార్యకలాపాలు చేశారని పేర్కొంది.

    పట్టణాల్లో ఈ శాతం 97.6గా నమోదైంది. 34,950 కుటుంబాలపై ఈ సర్వే నిర్వహించగా, ఇందులో 19,071 గ్రామీణ, 15,879 పట్టణ కుటుంబాలు ఉన్నట్లు వెల్లడించారు.

    అండమాన్-నికోబార్ దీవుల్లోని కొద్దిపాటి ప్రాంతాలు తప్ప ఈ సర్వే దేశవ్యాప్తంగా నిర్వహించబడినట్టు అధికారులు తెలిపారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    టెక్నాలజీ
    అశ్విని వైష్ణవ్

    తాజా

    IndiaAI మిషన్‌లో భారత్ కీలక అడుగు.. 34,000 GPUలతో రికార్డ్ కంప్యూట్ సామర్థ్యం టెక్నాలజీ
    AP SCC Evaluation: పదో తరగతి వాల్యూయేషన్ లోపాలు.. ఏపీ బోర్డు కీలక నిర్ణయం ఆంధ్రప్రదేశ్
    pak spy:పాక్‌కు సైనిక రహస్యాలు లీక్‌ చేసిన ఇంజినీర్‌.. మహారాష్ట్రలో అరెస్టు మహారాష్ట్ర
    GT vs MI Records: ఎలిమినేటర్ మ్యాచ్‌లో నమోదైన అద్భుతమైన రికార్డులివే! ముంబయి ఇండియన్స్

    టెక్నాలజీ

    TRAI: అప్‌డేట్ చేసిన DND యాప్‌ను లాంచ్ చేయనున్న ట్రాయ్ .. స్పామ్ కాల్‌లు నియంత్రించబడతాయి టెక్నాలజీ
    Blue Sky: 'ట్రెండింగ్ టాపిక్స్' ఫీచర్‌ను పరిచయం చేసిన బ్లూ స్కై.. అన్ని దేశాలలో అందుబాటులో ఉంది  టెక్నాలజీ
    HP: AI ఆధారిత ల్యాప్‌టాప్‌లను విడుదల చేసిన హెచ్‌పి..వావ్ అనిపించే ఫీచర్లు  టెక్నాలజీ
    Neuralink: మానవ మెదడులో న్యూరాలింక్‌ చిప్‌ అమరిక.. మాస్క్ ప్రకటన  ఎలాన్ మస్క్

    అశ్విని వైష్ణవ్

    భారతీయ రైల్వే 'షవర్ సౌకర్యం'; ఏసీ కోచ్‌ పైకప్పు లీక్ కావడంపై నెటిజన్లు ఫైర్ సోషల్ మీడియా
    వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో కొత్త ఫీచర్లు; ప్రయాణం మరింత సౌకర్యవంతం వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలు
    Vishwakarma Yojana: 5శాతం వడ్డీతో రూ.1లక్ష రుణం అందించాలని కేంద్రం నిర్ణయం  కేంద్ర ప్రభుత్వం
    6నెలల్లోనే హై స్పీడ్ ట్రైన్ వచ్చేస్తుంది.. ప్రకటించిన రైల్వే మంత్రి  రైల్వే శాఖ మంత్రి
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025