NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / టెక్నాలజీ వార్తలు / Asteroid: భూమి వైపు దూసుకొస్తున్న 35 అంతస్తుల భవనం పరిమాణంలో ఉన్న భారీ గ్రహశకలం..హెచ్చరించిన నాసా 
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Asteroid: భూమి వైపు దూసుకొస్తున్న 35 అంతస్తుల భవనం పరిమాణంలో ఉన్న భారీ గ్రహశకలం..హెచ్చరించిన నాసా 
    భూమి వైపు దూసుకొస్తున్న 35 అంతస్తుల భవనం పరిమాణంలో ఉన్న భారీ గ్రహశకలం

    Asteroid: భూమి వైపు దూసుకొస్తున్న 35 అంతస్తుల భవనం పరిమాణంలో ఉన్న భారీ గ్రహశకలం..హెచ్చరించిన నాసా 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Apr 10, 2025
    04:06 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    నాసా తాజాగా ఇచ్చిన హెచ్చరిక ప్రకారం, 2023 KU అనే భారీ గ్రహశకలం గంటకు సుమారు 64,000 కిలోమీటర్ల వేగంతో భూమి దిశగా ప్రయాణిస్తోంది.

    ఇది దాదాపు 35 అంతస్తుల భవనం ఆకారంలో ఉండే పరిమాణంతో, 2025 ఏప్రిల్ 11న, అంటే శుక్రవారం రాత్రి 9:05 గంటలకు,భూమికి అత్యంత సమీపంగా వచ్చిన వెంటనే 64,827 కిలోమీటర్ల వేగంతో దాన్ని దాటి వెళ్లనుంది.

    ఈ గ్రహశకలం,భూమికి ప్రమాదకరంగా ఉండే గ్రహశకలాల సమూహమైన అపోలో గ్రూప్ కి చెందింది.

    వివరాలు 

    అపోలో గ్రహశకలాలు అంటే ఏమిటి? 

    భూమి నుంచి సుమారు ఒక మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఇది దాటుతుందని అంచనా వేసినప్పటికీ, భూమి గురుత్వాకర్షణ శక్తి లేదా గ్రహశకల మార్గాల్లో ఉండే ఊహించని మార్పులు పెద్ద పరిమాణంలో ఉండే వస్తువులు భూమికి మరింత దగ్గరగా చేరే అవకాశం కలిగిస్తాయి.

    దీని వలన వచ్చే ప్రమాదాన్ని గమనించాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు.

    అపోలో గ్రహశకలాలు అనేవి భూమికి సమీపంగా ఉండే ఖగోళ వస్తువుల సమాహారం.

    వీటి కక్ష్యలు సూర్యుని చుట్టూ ఉన్న భూమి కక్ష్యతో ఏదో స్థాయిలో కలిసిపోతుంటాయి.

    ఈ కారణంగా అవి భూమికి అత్యంత సమీపంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

    వివరాలు 

    2023 KU భూమిని ఢీకొంటే ఏమవుతుంది? 

    వీటిని నిరంతరం గమనించడం ఎంతో కీలకం, ఎందుకంటే ఇవి ముందుగా ఊహించిన దిశకు వ్యతిరేకంగా కూడా కదలే అవకాశం ఉండటంతో, చివరి నిమిషంలో కక్ష్య మార్పు జరగడం ద్వారా అవి భూమిని ఢీకొట్టి తీవ్రమైన నష్టాన్ని కలిగించగలవు.

    ఈ గ్రహశకలం భూమిని తాకితే, దాని ప్రభావం ఏకంగా అణు బాంబు విధ్వంసానికి సమానమవుతుంది.

    నగరాల స్థాయిలో నాశనం జరగవచ్చు. 2013లో రష్యాలోని చెల్యాబిన్స్క్‌లో జరిగిన ఉల్కాపాతం కేవలం 59 అడుగుల వెడల్పు కలిగిన ఒక చిన్న ఖగోళ వస్తువుతో జరిగినా, వేల భవనాలను ధ్వంసం చేసింది. కానీ 2023 KU మాత్రం దానికంటే ఆరు రెట్లు పెద్దది, కాబట్టి దాని ప్రభావం ఎన్నిసార్లు ఎక్కువగా ఉండొచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

    వివరాలు 

    వీటిని ఎవరు పర్యవేక్షిస్తారు? 

    భూమికి సమీపంగా వచ్చే ఇటువంటి ఖగోళ వస్తువులను గమనించడం కోసం నాసా నిర్వహించే సెంటర్ ఫర్ నియర్-ఎర్త్ ఆబ్జెక్ట్ స్టడీస్ ప్రత్యేకంగా పనిచేస్తోంది.

    ప్రపంచవ్యాప్తంగా ఉన్న నక్షత్ర పరిశీలనా కేంద్రాలు, టెలిస్కోపులు ఇవి గమనిస్తాయి.

    పాన్-స్టార్స్, కాటలినా స్కై సర్వే వంటి టెలిస్కోపులు, అలాగే JPL గోల్డ్‌స్టోన్ రాడార్ వంటి ప్లానెటరీ రాడార్ వ్యవస్థల సహాయంతో ఈ ఖగోళ వస్తువుల కదలికలపై నిత్యం డేటా సేకరించడం జరుగుతుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నాసా

    తాజా

    Gold Rate: తెలుగు రాష్ట్రాల్లో పసిడి పరుగులు.. రూ. 99 వేలకి చేరువ! బంగారం
    Pakistan: భారత కార్యక్రమాలకు పాకిస్థాన్ అభ్యంతరం.. సున్నితంగా తిరస్కరించిన మలేషియా మలేషియా
    Ukraine-Russia: ఏప్రిల్ 2026 నాటికి ఉక్రెయిన్‌కు 100,000 డ్రోన్‌లు: బ్రిటన్  బ్రిటన్
    Kannappa : భీమవరంలో కన్నప్ప ప్రీ రిలీజ్ ఈవెంట్‌.. జూన్ 22న గ్రాండ్‌గా! మంచు విష్ణు

    నాసా

     Lunar Eclipsc 2024: ఈ ఏడాది రెండోవ చంద్రగ్రహణం.. భారత్‌లో కనిపించదా? చంద్రగ్రహణం
    Sunita Williams: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్ర కమాండర్‌గా నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్  టెక్నాలజీ
    Nasa: నాసా క్రూ-9 మిషన్ తేదీ మార్పు.. సెప్టెంబర్ 28 న ప్రారంభం  స్పేస్-X
    Nasa: అంతరిక్ష కేంద్రంలోకి క్రూ-9 ఎంట్రీ.. స్వాగతం పలికిన సునీతా విలియమ్స్, విల్మోర్‌  అంతరిక్షం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025