NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / టెక్నాలజీ వార్తలు / Myopia: ప్రపంచవ్యాప్తంగా క్షీణిస్తున్న పిల్లల కంటి చూపు.. ముగ్గురు చిన్నారుల్లో ఒక్క‌రికి మ‌యోపియా ల‌క్ష‌ణాలు న‌మోదు 
    తదుపరి వార్తా కథనం
    Myopia: ప్రపంచవ్యాప్తంగా క్షీణిస్తున్న పిల్లల కంటి చూపు.. ముగ్గురు చిన్నారుల్లో ఒక్క‌రికి మ‌యోపియా ల‌క్ష‌ణాలు న‌మోదు 
    ప్రపంచవ్యాప్తంగా క్షీణిస్తున్న పిల్లల కంటి చూపు.. ముగ్గురు చిన్నారుల్లో ఒక్క‌రికి మ‌యోపియా ల‌క్ష‌ణాలు

    Myopia: ప్రపంచవ్యాప్తంగా క్షీణిస్తున్న పిల్లల కంటి చూపు.. ముగ్గురు చిన్నారుల్లో ఒక్క‌రికి మ‌యోపియా ల‌క్ష‌ణాలు న‌మోదు 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Sep 26, 2024
    01:15 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    కోవిడ్ లాక్‌డౌన్ తర్వాత ప్రపంచ వ్యాప్తంగా చిన్న పిల్లల్లో దృష్టిలోపం సమస్యలు పెరుగుతున్నాయని గుర్తించారు.

    చిన్నారుల్లో హ్రస్వి దృష్టి, దగ్గర చూపు వంటి సమస్యలు ఎక్కువగా ఉన్నాయని ఒక అధ్యయనంలో తేలింది.

    ఈ అధ్యయనానికి సంబంధించిన రిపోర్టును బ్రిటీష్ జర్నల్ ఆఫ్ ఆప్థమాలజీ పబ్లిష్ చేసింది.

    ఈ రిపోర్టులో, ఆరు ఖండాలకు చెందిన 50 దేశాల్లోని 50 లక్షల మంది పిల్లలను అధ్యయనం చేసిన తర్వాత, 2050 నాటికి మయోపియా వంటి కంటి సమస్యలు లక్షలాది చిన్నారుల్లో నమోదవుతాయని పేర్కొన్నారు.

    కరోనా వల్ల లాక్‌డౌన్ సమయంలో పిల్లలు ఎక్కువగా స్క్రీన్ టైమ్‌ని పెంచారు, అలాగే ఆరుబయట గడిపే సమయం తగ్గడంతో కంటి సమస్యలు మరింత పెరిగినట్లు రిపోర్టు వెల్లడించింది.

    వివరాలు 

    1990 నుంచి 2023 వరకు మూడు రెట్లు పెరిగినట్లు అధ్యయనం

    ఆసియాలో దగ్గర చూపు సమస్యలు అధికంగా ఉన్నాయని, జపాన్‌లో చిన్నారుల్లో 85 శాతం, దక్షిణ కొరియాలో 73 శాతం పిల్లలు ఈ సమస్యతో బాధపడుతున్నారని తేల్చారు.

    చైనా, రష్యా దేశాల్లో ఈ సమస్య సుమారు 40 శాతం చిన్నారుల్లో ఉంది. ప‌రాగ్వే, ఉగాండా దేశాల్లో మాత్రం ఈ సమస్య చాలా తక్కువగా, కేవలం 1 శాతం మాత్రమే ఉందని గుర్తించారు.

    బ్రిటన్, ఐర్లాండ్, అమెరికా వంటి దేశాల్లో ఈ సమస్య 15 శాతంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా మయోపియా సమస్యలు 1990 నుంచి 2023 వరకు మూడు రెట్లు పెరిగినట్లు అధ్యయనంలో పేర్కొన్నారు.

    వివరాలు 

    2050 నాటికి ప్రపంచంలోని టీనేజర్లలో సగం మంది మయోపియా బాధితులు

    36 శాతం పిల్లలు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారని, కరోనా మహమ్మారి తర్వాత ఈ గణాంకం మరింత పెరిగిందని అంచనా వేశారు.

    ప్రైమరీ స్కూల్ దశలోనే మయోపియా సమస్యలు మొదలవుతాయని, ఈ సమస్య 20 ఏళ్ల వయస్సు వరకు కొనసాగుతుందని తెలిపారు.

    2050 నాటికి ప్రపంచంలోని టీనేజర్లలో సగం మంది మయోపియా బాధితులు అవుతారని రిపోర్టులో పేర్కొన్నారు.

    మయోపియా సమస్య నుంచి బయట పడేందుకు, ప్రతి రోజు పిల్లలు కనీసం రెండు గంటలపాటు ఆరుబయట గడపడం, ఏడు నుంచి తొమ్మిది ఏళ్ల వయస్సు మధ్య ఉన్న పిల్లలకు ఇది మరింత అవసరమని నిపుణులు సూచించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    సైన్స్ అండ్ టెక్నాలజీ

    తాజా

    PBKS vs DC : పంజాబ్ కింగ్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ విజయం ఢిల్లీ క్యాపిటల్స్
    Pawan Kalyan: గతంలోని చేదు అనుభవాలు మరచిపోతే ఎలా..? సినీ పరిశ్రమపై పవన్ కళ్యాణ్ అసహనం! పవన్ కళ్యాణ్
    #NewsBytesExplainer: కరోనా రీ ఎంట్రీ.. కొత్త వేరియంట్‌తో మళ్లీ ఊహించని పరిస్థితులు వస్తాయా?  కోవిడ్
    Lion Attack: సింహాన్ని తాకాడు.. వెంటనే ఆస్పత్రికి పరుగులు తీశాడు (వీడియో) సోషల్ మీడియా

    సైన్స్ అండ్ టెక్నాలజీ

    Microscope: ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన మైక్రోస్కోప్.. సెకనులో 1 క్వింటిలియన్ వంతు వద్ద సమయాన్ని స్తంభింపజేస్తుంది టెక్నాలజీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025