NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / టెక్నాలజీ వార్తలు / ప్రపంచ అంతరిక్షంలో కీలక పరిణామం.. గంటల తేడాతో చంద్రుడి మీదకు రష్యా, భారత్ మిషన్లు
    తదుపరి వార్తా కథనం
    ప్రపంచ అంతరిక్షంలో కీలక పరిణామం.. గంటల తేడాతో చంద్రుడి మీదకు రష్యా, భారత్ మిషన్లు
    గంటల తేడాతో చంద్రుడి మీదకు రష్యా, భారత్ మిషన్లు

    ప్రపంచ అంతరిక్షంలో కీలక పరిణామం.. గంటల తేడాతో చంద్రుడి మీదకు రష్యా, భారత్ మిషన్లు

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Aug 11, 2023
    11:34 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ప్రపంచ అంతరిక్ష రంగంలో ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రష్యాకు చెందిన లూనా-25, ఇండియాకు చెందిన చంద్రయాన్-3 కొన్ని గంటల తేడాతో దాదాపు ఒకే సమయంలో ల్యాండింగ్ కానున్నాయి.

    చందమామ వద్దకు భారత్ ప్రయోగించిన చంద్రయాన్- 3 తర్వాత, రష్యా తన లూనా మిషన్ అయిన లూనా -25ను అదే జాబిల్లి వద్దకు ప్రయోగించింది.

    47 ఏళ్ల తర్వాత చంద్రుడి మీదకు రష్యా ప్రయోగం చేసింది. మాస్కోకు తూర్పున సుమారు 5,500 కి.మీ దూరంలోని అముర్ ఒబ్లాస్ట్‌లోని వోస్టోనీ కాస్మోడ్రోమ్ నుంచి లూనా-25ను నింగిలోకి పంపించింది.

    జులై 14న ప్రయోగించిన చంద్రయాన్-3 కంటే లూనా 25ని రష్యా లేట్ గానే ప్రయోగించింది. అయినప్పటికీ చంద్రయాన్ కంటే ముందే జాబిల్లిపై అడుగుపెట్టనుంది.

    details

    ఆగస్ట్ 21 లేదా 22 కి చంద్రుడి వద్దకు లూనా 25

    ఆగస్ట్ 11 శుక్రవారం తెల్లవారు జామున 4.40 గంటలకు రష్యాలోని వోస్టోని కాస్మోడ్రోమ్ నుంచి లూనా-25 ల్యాండర్ ను ప్రయోగించారు.ఈ క్రమంలోనే లూనా-25 ఆగస్ట్ 21 లేదా 22న చంద్రుడి ఉపరితలానికి చేరుకుంటుందని అంచనా.

    మరోవైపు చంద్రుడి చుట్టే దాదాపు 7 నుంచి 10 రోజుల పాటు రష్యా ల్యాండర్ పయనిస్తుందని భావిస్తున్నారు.అయితే జులై 14న ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-3 దాదాపు నెల రోజుల తర్వాత ఆగస్ట్ 23న చంద్రుడిపై అడుగుపెట్టనుంది.

    చంద్రుడి దక్షిణ ధ్రువంపై ల్యాండర్‌ను దించాలనే లక్ష్యంతో సోయుజ్ 2.1 బి రాకెట్‌లో లూనా-25(లూనా గ్లోబ్ మిషన్)ను చంద్రుడిపైకి ప్రయోగించినట్లు రష్యా అంతరిక్ష సంస్థ రోస్కోస్మోస్ ప్రకటించింది. 5 రోజుల పాటు అది జాబిల్లి వైపు కదులుతుందని వెల్లడించింది.

    details

    అదే జరిగితే మొదటి దేశంగా రష్యా ఆవిర్భావం

    చంద్రుడి వద్ద ఈ ధ్రువంపై నీరు చేరే అవకాశం ఉందని రష్యా అంటోంది. మరోవైపు దక్షిణ ధ్రువంలో నీరు ఉందని 2018లోనే నాసా చెప్పేసింది. రోవర్, ల్యాండర్లను కలిగి ఉన్న లూనా-25 ల్యాండర్ బరువు 800 కిలోలు.

    ల్యాండర్‌లోని ప్రత్యేక పరికరంతో ఆరు అంగుళాల మేర ఉపరితలాన్ని తవ్వి మట్టి నమూనాలను సేకరిస్తుంది. దీంతో ఘనీభవించిన నీటి ఆవిష్కరణ జరిగేందుకు అవకాశం ఉంది.

    భవిష్యత్ లో మానవులు చందమామపై స్థావరం ఏర్పరుచుకుంటే నీటి సమస్య ఉండకూడదని రష్యా ధ్యేయంగా పెట్టుకుంది.

    ఇప్పటి దాకా జరిగిన చందమామ మిషన్‌లన్నీ జాబిల్లి భూ మధ్యరేఖకే చేరుకున్నాయి. లూనా-25 సక్సెస్ అయితే చంద్రుడి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన ఏకైక దేశంగా రష్యా నిలవనుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    రష్యా

    తాజా

    Gayatri : ప్రముఖ గాయని కన్నుమూత అస్సాం/అసోం
    Dadasaheb Phalke: ఫాల్కే బయోపిక్‌పై క్లారిటీ.. రాజమౌళి కాదు, ఆమిర్‌ టీమ్‌ మాత్రమే సంప్రదించింది టాలీవుడ్
    Hyderabad Metro: నేటి నుంచి మెట్రో ఛార్జీల్లో పెంపు.. ప్రయాణికులకు అదనపు భారం మెట్రో స్టేషన్
    Operation Sindoor: 'ఆపరేషన్‌ సిందూర్‌' ప్రభావంతో మాకు నష్టం వాటిల్లింది.. అంగీకరించిన పాక్ ప్రధాని పాకిస్థాన్

    రష్యా

    బాంబు బెదిరింపు: రష్యా నుంచి గోవా వస్తున్న విమానం ఉజ్బెకిస్థాన్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఉజ్బెకిస్తాన్
    ఉక్రెయిన్-రష్యా యుద్ధం: ఉక్రెయిన్‌కు అమెరికా, జర్మనీ భారీగా యుద్ధ ట్యాంకుల సాయం! ఉక్రెయిన్
    నన్ను చంపుతానని పుతిన్ బెదిరించారు: బోరిస్ జాన్సన్ బ్రిటన్
    రష్యా చమురును భారత్ కొనుగోలు చేయడంపై మాకు ఎలాంటి అభ్యంతరం లేదు: అమెరికా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా/ యూఎస్ఏ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025