ఉమెన్స్ ఐపీఎల్ లీగ్: వార్తలు

WPL 2024: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2వ ఎడిషన్ ప్రారంభ వేడుకలకు బాలీవుడ్ హీరోలు ! 

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) 2వ ఎడిషన్ శుక్రవారం(ఫిబ్రవరి 23)నుండి ప్రారంభం కానుంది.

WPL-2024: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ పూర్తి షెడ్యూల్ విడుదల.. ఫిబ్రవరి 23న తొలి మ్యాచ్ 

Women's Premier League 2024 schedule: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్-2024 షెడ్యూల్ విడుదలైంది. తొలి మ్యాచ్‌లో బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో గతేడాది ఛాంపియన్ అయిన ముంబై ఇండియన్స్‌తో దిల్లీ క్యాపిటల్స్‌ లపడనుంది.

WPL 2024 auction: డబ్ల్యూపీఎల్‌లో టాప్-5 ఖరీదైన ఆటగాళ్లు వీరే 

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)-2024 కోసం శనివారం మినీవేలం నిర్వహించిన విషయం తెలిసిందే.

WPL చరిత్రలో అత్యంత ఖరీదైన అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా కశ్వీ గౌతమ్ రికార్డు 

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) చరిత్రలో అత్యంత ఖరీదైన అన్‌క్యాప్డ్ ఇండియన్ ప్లేయర్‌గా కశ్వీ గౌతమ్ అవతరించింది.

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్-2 కి బీసీసీఐ సరికొత్త ప్లాన్

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ మొదటి సీజన్ సూపర్ హిట్ అయింది. దీంతో టోర్నమెంట్ పరిధిని విస్తరించేందుకు బీసీసీఐ నూతన ప్రణాళికలను రచిస్తోంది.

WPL: ఫైనల్‌లో ఢిల్లీ, ముంబై ఇండియన్స్.. గెలుపు ఎవరిదో..!

ఉమెన్స్ ప్రీమిమర్ లీగ్‌లో చివరి దశకు చేరుకుంది. తొలి కప్పును ఎలాగైనా కైవసం చేసుకొని చరిత్ర సృష్టించాలని ఢిల్లీ, ముంబై జట్లు భావిస్తున్నాయి.

WPL: 9ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించిన ఢిల్లీ.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానం

మహిళల ప్రీమియర్ లీగ్ 18వ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ ను చిత్తు చేసింది. తొమ్మిది వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్ పై ఢిల్లీ క్యాపిటల్స్ ఘన విజయం సాధించింది. ఈ విజయంతో ఢిల్లీ జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది.

WPL : టాస్ నెగ్గిన గుజరాత్.. గెలిస్తే ఫ్లేఆఫ్స్ బెర్త్ ఖరారు

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 17వ మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్, యూపీ వారియర్స్ మధ్య కీలక మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి పాయింట్ల పట్టికలో మూడో స్థానాన్ని కైవసం చేసుకోవాలని యూపీ వారియర్స్ భావిస్తోంది.

WPL: ముంబై ఇండియన్స్‌ జోరుకు యూపీ వారియర్స్ కు బ్రేకులు వేసేనా..?

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2023లో ముంబై ఇండియన్స్ వరుస విజయాలతో జోరు మీద ఉంది. ఇప్పటికే ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్‌కు అర్హత సాధించింది.

WPL: ఢిల్లీ క్యాపిటల్స్‌పై గుజరాత్ జెయింట్స్ విజయం.. ఫ్లేఆఫ్ ఆశలు సజీవం

మహిళల ప్రీమియర్ లీగ్ 14వ మ్యాచ్ లో గుజరాత్ జెయింట్స్ ఆల్ రౌండర్ ప్రదర్శనతో సత్తా చాటింది. ఉత్కంఠ పోరులో ఢిల్లీ క్యాపిటల్స్‌పై 11 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో టోర్నమెంట్ లో రెండో విక్టరీని నమోదు చేసింది.

ఐపీఎల్‌కు శ్రేయాస్ అయ్యర్ దూరం.. కెప్టెన్సీ రేసులో ముగ్గురు ఆటగాళ్లు..!

మార్చి 31న ఐపీఎల్ లీగ్ ప్రారంభం కానుంది. ఐపీఎల్ 2023 సీజన్‌కు ముందు కోల్‌కతా నైట్ రైడర్స్‌కు భారీ షాక్ తగిలింది. గాయం కారణంగా కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ఐపీఎల్ సీజన్‌కు దూరమయ్యాడు. ఆహ్మదాబాద్‌లో జరిగిన చివరి టెస్టులో అయ్యర్ గాయపడటంతో బ్యాటింగ్ కూడా దిగలేదు.

WPL: యూపీ వారియర్స్‌పై కనికా ఆహుజా సునామీ ఇన్నింగ్స్

2023 ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ ఎట్టకేలకు బోణి కొట్టింది. యూపీ వారియర్స్ జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

WPL: హమ్మయ్య.. ఆర్సీబీ గెలిచిందోచ్

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో ఐదు వరుస పరాజయాలకు చెక్ పెడుతూ ఆర్సీబీ ఎట్టకేలకు ఒక విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. బుధవారం రాత్రి యూపీ వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఐదు వికెట్ల తేడాతో ఆర్సీబీ విజయం సాధించింది.

WPL 2023: ప్చ్.. ఆర్సీబీకి వరుసగా ఐదో ఓటమి

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పరాజయాల పరంపర కొనసాగుతోంది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ 6 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఆర్సీబీకి ఇది వరుసగా ఐదో పరాజయం. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది.

WPL: ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు

మహిళల ప్రీమియర్ లీగ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చెత్త ప్రదర్శన కొనసాగుతోంది. మొదటి నాలుగు మ్యాచ్‌లో ఆర్సీబీ చిత్తుగా ఓడింది. వరుస పరాజయాలతో ఆర్సీబీ పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది.

WPL : యూపీ వారియర్స్ కెప్టెన్ అలిస్సా హీలీ వీర బాదుడు

మహిళల ప్రీమియర్ లీగ్‌లో వరుసగా నాలుగోసారి ఆర్సీబీ ఓటమిపాలైంది. మొదట బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 19.3 ఓవర్లలో 138 పరుగులకు ఆలౌటైంది. అనంతరం యూపీ వారియర్స్ 13 ఓవర్లలోనే ఆడుతూ పాడుతూ ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా లక్ష్యాన్ని ఛేదించింది.

WPL: ఓటముల్లో ఆర్సీబీ షరామూములే

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వరుసగా నాలుగోసారి పరాజయం పాలైంది. శుక్రవారం యూపీ వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు ఘోరంగా విఫలమైంది. సీజన్ ప్రారంభం నుంచి ఒక్క విజయాన్ని కూడా నమోదు చేయని బెంగళూరు మరోసారి ఓటమిపాలైంది.

WPL: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ బోణి కొట్టేనా..?

ఎన్నో అంచనాలతో బరిలోకి దిగినా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో ఉసూరుమనిపిస్తూ అభిమానులకు తీవ్ర నిరుత్సాహానికి గురి చేస్తుంది. పేరులో రాయల్, జట్టు నిండా స్టార్ ప్లేయర్స్ ఉన్నా ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో ఇంతవరకు ఖాతా తెరవలేదు.

WPL: మహిళలందరికీ ఉచిత ప్రవేశం.. బీసీసీఐ బంపరాఫర్

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు బీసీసీఐ బంపరాఫర్ ప్రకటించింది. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2023లో భాగంగా మార్చి 8 నాటి మ్యాచ్‌ను ఉచితంగా వీక్షించే అరుదైన అవకాశాన్ని కల్పించింది. ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియంలో గుజరాత్ జెయింట్-రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఉమెన్స్ మధ్య బుధవారం మ్యాచ్ జరగనుంది.

WPL: ముంబై ఇండియన్స్‌కి విజయాన్ని అందించిన నాట్ స్కివర్ బ్రంట్

మహిళల ప్రీమియర్ లీగ్‌లో ముంబై ఇండియన్స్ రెండో విజయాన్ని నమోదు చేసింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్‌పై 9 వికెట్ల తేడాతో ముంబై గెలుపొందింది. ముంబై స్టార్ ఓపెనర్ హేలీ మాథ్యూస్ (77), నాట్ స్కివర్ బ్రంట్ (55) చెలరేగడంతో బెంగళూర్‌కు మళ్లీ నిరాశ తప్పలేదు. వీరిద్దరూ విధ్యంసకర బ్యాటింగ్‌తో ఆర్సీబీ బౌలర్లకు చుక్కలు చూపించారు. నటాలీ స్కివర్-బ్రంట్ బౌలింగ్‌లో రెండు వికెట్లతో సత్తా చాటింది.

WPL 2023: బెంగళూరును చిత్తుగా ఓడించిన ముంబాయి ఇండియన్స్

ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియంలో ముంబై ఇండియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును ఓడించింది. తొలి మ్యాచ్‌లో గుజరాత్‌ను చిత్తు చేసిన ముంబాయి ఈసారి బెంగళూరును చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో ముంబాయి, ఆర్సీబీపై 9 వికెట్ట తేడాతో ఘన విజయం సాధించింది.

WPL: గుజరాత్ జెయింట్స్ కు గట్టి ఎదురుదెబ్బ

మహిళల ఐపీఎల్ లీగ్ ప్రారంభానికి ముందే గుజరాత్ జెయింట్స్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. నేడు ముంబై ఇండియన్స్, గుజరాత్ జెయింట్స్ తలపడనుంది. ఈ మ్యాచ్ సాయంత్రం 7.30గంటలకు డివై పాటిల్ స్టేడియంలో ప్రారంభం కానుంది.

WPL: నేటి నుంచి మహిళల ఐపీఎల్ షురూ

క్రికెట్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తోన్న ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌కు సర్వం సిద్ధమైంది. మహిళల క్రికెటర్లు ఎన్నాళ్లు నుంచే ఈ క్షణం ఎదురుచూస్తున్నాడు. ఈ నిరీక్షణకు తెరదించుతూ నేటి నుంచే మహిళల ఐపీఎల్ ప్రారంభం కానుంది. నేడు రాత్రి 7.30గంటలకు మొదటి మ్యాచ్ గుజరాత్ జెయింట్స్ ముంబై ఇండియన్స్‌తో తలపడనుంది.

WPL: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్‌పై భారీ అంచనాలు

ప్రపంచ క్రికెట్‌లో తొలిసారిగా బీసీసీఐ అధ్వర్యంలో మహిళలకు సంబంధించి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌ను నిర్వహించనున్నారు. రేపటి నుంచే డబ్ల్యుపీఎల్ ప్రారంభం కానుంది. వేలంలో స్మృతి మంధాన రూ.3.40 కోట్లకు అమ్ముడుపోయి చరిత్ర సృష్టించింది.

మహిళల ఐపీఎల్ మస్కట్ చూస్తే గూస్‌బంప్స్

ఐపీఎల్ తరహాలో భారత్‌లో అమ్మాయిల క్రికెట్‌ను మరో స్థాయికి తీసుకెళ్లేందుకు మహిళల ప్రీమియర్ లీగ్ సిద్ధమవుతంది. మార్చి 4న ఈ టోర్నీ వైభవంగా ప్రారంభం కానుంది. ముంబై వేదికగా జరిగే ఈ లీగ్‌లో ఐదు జట్లు పోటీ పడుతున్నాయి.

దీప్తిశర్మకు షాక్.. యూపీ వారియర్స్ కెప్టెన్‌గా అలిస్సాహీలీ

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో యూపీ వారియర్స్ కెప్టెన్‌గా ఆస్ట్రేలియా వికెట్ కీపర్ అలిస్సా హీలీ ఎంపికైంది. ఈ మేరకు యూపీ వారియర్స్ ఓ ప్రకటనను విడుదల చేసింది. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ వేలంలో దీప్తిశర్మను రూ.2 కోట్ల 60లక్షలకు యూపీ వారియర్స్ దక్కించుకుంది.

WPL వేలంలో అమ్ముడుపోని ఆటగాళ్లు వీరే

ఉమెన్స్ ఐపీఎల్ వేలంలో ఐదు ఫ్రాంచేజీలు పోటాపోటిగా మహిళా ప్లేయర్స్ ను కొనుగోలు చేశారు. ఈ టోర్ని కూడా ఐపీఎల్ అంత హిట్ అవుతుందని బీసీసీఐ నమ్ముతోంది. డబ్ల్యూపీఎల్‌లో ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ జెయింట్స్, యూపీ వారియర్జ్ పోటీ పడనున్నాయి.

మల్లికా సాగర్‌పై పొగడ్తల వర్షం కురిపించిన దినేష్ కార్తీక్

బీసీసీఐ నిర్వహించిన ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ వేలం ముగిసింది. ముంబై వేదికగా జరిగిన ఈ వేలంలో ఐదు ఫ్రాంచేజీలు పాల్గొన్నాయి. 87 మంది ఆటగాళ్లపై రూ.59.5 కోట్లకు ఐదు ఫ్రాంచైజీలు కొనుగోలు చేశాయి.

వేలంలో రికార్డు సృష్టించిన విదేశీ ప్లేయర్లు

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ వేలంలో మహిళా ప్లేయర్స్ పై ప్రాంఛైజీలు డబ్బులు వర్షం కురిపించాయి. ముఖ్యంగా భారత్ స్టార్ స్మృతి మంధాన రికార్డు స్థాయిలో రూ.3.40 కోట్లకు బెంగళూర్ కొనుగోలు చేసింది. అలాగే విదేశీ ప్లేయర్లు నటాలీ స్కివర్-బ్రంట్‌, ఆష్లీ గార్డనర్ అత్యంత ఖరీధైన ఆటగాళ్లగా నిలిచారు. బెత్‌మూనీ, ఎల్లీస్‌పెర్ర వేలంలో మంచి ధర పలికారు.

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ వేలంలో స్మృతి మంధానకు కళ్లు చెదిరే జాక్‌పాట్

మహిళల ప్రీమియర్ లీగ్ కోసం తొలిసారి జరిగిన వేలంలో అమ్మాయిలపై కనకవర్షం కురిసింది. ఇందులో భారత్ స్టార్ ఓపెనర్ స్మృతి మందాన అంచనాలకు తగ్గట్టే రూ.3.40 కోట్లకు బెంగళూర్ తీసుకుంది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ ను మాత్రం రూ.2కోట్లలోపే ముంబై దక్కించుకుంది. ఇంకా విదేశీ ఆల్ రౌండర్లు ఆష్లే, స్కివర్‌లకు రూ.3.20 కోట్లు పలికారు.

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ వేలంలో దీప్తిశర్మకు బంపర్ ప్రైజ్

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ వేలంలో టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ దీప్తిశర్మకు బంపర్ ప్రైజ్ దక్కింది. ఆమెను కొనుగోలు చేయడానికి ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్, గుజరాత్ జెయింట్స్ జట్లు పోటిపడ్డాయి. రూ.2.6కోట్లకు దీప్తిశర్మను యూపీ వారియర్స్ జట్టు కొనుగోలు చేసింది.

ఆర్‌సీబీలోకి ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ ఎల్లీస్ పెర్రీ

బీసీసీఐ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మహిళల ప్రీమియర్ లీగ్ చివరి అంకానికి చేరుకుంది. ముంబైలోని జియో కన్వెన్షన్ సెంటర్ వేదికగా డబ్ల్యూపీఎల్ అరంగేట్ర సీజన్‌కు సంబంధించిన వేలం ప్రారంభమైంది. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్‌లు మార్చి 4 నుంచి 26 వరకు జరగనున్నాయి. ముంబైలోని డివై పాటిల్ స్టేడియం, క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా స్టేడియాలు వేదిక కానున్నాయి.

స్మృతి మంధానకు అదరిపోయే ధర

మొట్టమొదటి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ఆటగాళ్ల వేలం నేడు ముంబాయిలో నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం 2.30 గంటల నిమిషాలకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. మహిళా లీగ్ వేలం మల్లికా సాగర్ నేతృత్వంలో నిర్వహించారు. మల్లిక 2021లో ప్రొ కబడ్డీ లీగ్ వేలం కార్యక్రమాన్ని నిర్వహించిన విషయం తెలిసిందే. మొత్త 90 బెర్తుల కోసం 409 క్రికెటర్లు వేలం బరిలో ఉన్నారు.

ముంబాయి ఇండియన్స్‌కు సేవలందించనున్న టీమిండియా కెప్టెన్

మొట్టమొదటి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ వేలం వైభవంగా ప్రారంభమైంది. ఇప్పటికే ఈ వేలానికి 409 మంది మహిళా క్రికెటర్లు షార్ట్ లిస్ట్ కాగా.. ఇందులో నుంచి ఐదు ఫ్రాంఛైజీలు కలిసి అత్యధికంగా 90మంది కొనుగోలు చేయనున్నారు. ప్రతి ప్రాంఛైజీ పర్సులో రూ.12 కోట్లు ఉండనున్నాయి.

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో జాక్ పాట్ కొట్టేదెవరో..?

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ వేలం ఫిబ్రవరి 13న ముంబైలో జరగనుంది. ఒక జట్టులో కనీసం 15 మంది, గరిష్టంగా 18 మంది ప్లేయర్స్ ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఈ వేలంలో మొత్తం 409 మంది మహిళా క్రికెటర్లు అందుబాటులో ఉన్నారు. వీరి నుంచి ఫ్రాంచైజీలు తమ జట్లను ఎంపిక చేసుకుంటాయి. అయితే ఈ వేలంలో అత్యధిక ధరను పొందే అవకాశం క్రికెటర్లు ఎవరో ఇప్పడు మనం తెలుసుకుందాం.

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ వేలం పాటను పాడనున్న మలికా అద్వానీ

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ వేలం ఫిబ్రవరి 13వ తేదీన ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో జరగనుంది. మార్చి 4వ తేదీ నుంచి ముంబయిలో ఐదు జట్లతో తొలి సీజన్ ప్రారంభం కానుంది. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ వేలాన్ని ఇండియా కన్సల్టెంట్స్ సంస్థలో భాగస్వామి అయినా మలికా అద్వానీ వేలాన్ని పర్యవేక్షించనున్నట్లు బీసీసీఐ ప్రకటించింది.

లక్నో ఫ్రాంచైజీకి యుపీ వారియర్జ్‌గా నామకరణం

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో లక్నో ఫ్రాంచైజీకి యూపి వారియర్జ్‌గా నామకరణం చేశారు. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో లక్నో ఫ్రాంచైజీ యజమానులైన కాప్రి గ్లోబల్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ రూ. 757 కోట్లను పెట్టుబడులు పెట్టింది. ప్రస్తుతం ఇంగ్లండ్ మహిళల జట్టు ప్రధాన కోచ్‌గా ఉన్న జోన్ లూయిస్‌ ఈ జట్టుకు ప్రధాన కోచ్‌గా నియమించారు.

మార్చి 4న మహిళల ఐపీఎల్ ప్రీమియర్ లీగ్

ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మహిళల ప్రీమియర్ లీగ్ వచ్చే నెల ప్రారంభం కానుంది. మార్చి 4 నుంచి 26వ తేదీ వరకూ మ్యాచ్ లను నిర్వహించనున్నారు. ముంబైలోని బ్రబౌర్న్ స్టేడీయం, డివై పాటిల్ స్టేడియాలు ఈ లీగ్ కు అతిథ్యమివ్వనున్నాయి. చివరి మ్యాచ్ మార్చి 26న చివరి మ్యాచ్ జరగనుంది. ఆటగాళ్ల వేలం ఫిబ్రవరి 13న ముంబైలో జరగనుంది.

మార్చి 4నుంచి 26 వరకు ముంబాయిలో ఉమెన్స్ ప్రీమియర్ లీగ్

మార్చి 4 నుంచి 26 వరకు ముంబైలోని రెండు వేదికలపై ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ప్రారంభ ఎడిషన్ మొత్తాన్ని ఆడేందుకు భారత క్రికెట్ బోర్డు యోచిస్తోందని క్రిక్‌బజ్ తెలిపింది. డివై పాటిల్, సీసీఐ స్టేడీయాలు వేదిక కానున్నాయి.

ఐపీఎల్ ఉమెన్స్ ప్లేయర్ల వేలం తేదీలు ఖరారు..?

ఇటీవలే ఫ్రాంచేజీల వేలం ముగిసింది. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో ప్రస్తుతం మరో ప్రక్రియకు బీసీసీఐ శ్రీకారం చుట్టింది. ఆటగాళ్ల వేలం ఫిబ్రవరి 11న న్యూఢిల్లి లేదా ఫిబ్రవరి 13న ముంబైలో జరిగే అవకాశం ఉందని ESPN cricinfo నివేదించింది.