NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / టెక్నాలజీ వార్తలు / Shubhanshu Shukla: భారత వ్యోమగామి శుభాంశు శుక్లా ఐఎస్‌ఎస్‌ యాత్ర మరోసారి వాయిదా
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Shubhanshu Shukla: భారత వ్యోమగామి శుభాంశు శుక్లా ఐఎస్‌ఎస్‌ యాత్ర మరోసారి వాయిదా
    భారత వ్యోమగామి శుభాంశు శుక్లా ఐఎస్‌ఎస్‌ యాత్ర మరోసారి వాయిదా

    Shubhanshu Shukla: భారత వ్యోమగామి శుభాంశు శుక్లా ఐఎస్‌ఎస్‌ యాత్ర మరోసారి వాయిదా

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jun 09, 2025
    10:02 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    భారత వ్యోమగామి శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్ర మరోసారి వాయిదా పడింది.

    ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాలకు చెందిన ముగ్గురు వ్యోమగాములతో కలిసి ఆయన ఈ నెల 10వ తేదీ సాయంత్రం 5:52 గంటలకు (భారత కాలమానం ప్రకారం) నింగిలోకి దూసుకెళ్లాల్సింది..

    ఈ ప్రయాణం కోసం ఫ్లోరిడాలోని కెనడీ స్పేస్ సెంటర్‌లో ఉన్న స్పేస్‌ఎక్స్ సంస్థ ఫాల్కన్-9 రాకెట్‌ను సిద్ధం చేసింది.

    కానీ వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో ప్రయోగాన్ని బుధవారానికి వాయిదా వేశారని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో వెల్లడించింది.

    వివరాలు 

    మిషన్ పైలట్‌గా శుభాంశు శుక్లా 

    నేడు (10వ తేదీ) చేపట్టాల్సిన ప్రయోగం వాయిదా పడినట్లయితే, అలాంటి పరిస్థితిలో రేపు (11వ తేదీ) సాయంత్రం 5:30కి (భారత కాలమానం ప్రకారం) మరో అవకాశం ఉందని ఇప్పటికే స్పేస్‌ఎక్స్ సంస్థ ప్రకటించింది.

    ఈ నేపథ్యంలో బుధవారం ప్రయోగం చేపట్టనున్నట్లు స్పష్టమైంది.

    'యాక్సియం-4'గా పిలవబడుతున్న ఈ అంతరిక్ష ప్రయాణంలో శుభాంశు శుక్లా మిషన్ పైలట్‌గా బాధ్యతలు నిర్వర్తించనున్నారు.

    ఆయనతో పాటు మిషన్ కమాండర్ పెగ్గీ విట్సన్, స్పెషలిస్టులు టిబర్ కపు (హంగరీకి చెందిన వారు), స్లావోస్జ్ ఉజ్నాన్స్‌కీ-విస్నియెస్కీ (పోలాండ్‌కు చెందిన వారు) అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్) వైపు ప్రయాణించనున్నారు.

    వివరాలు 

     సోయుజ్ రాకెట్ ద్వారా రాకేశ్ శర్మ 

    1984లో రష్యా దేశానికి చెందిన సోయుజ్ రాకెట్ ద్వారా రాకేశ్ శర్మ అంతరిక్ష యాత్ర చేసిన తరువాత, మరోసారి భారత పౌరుడు అంతరిక్షంలోకి వెళ్లడం ఇదే తొలిసారి.

    నిజానికి యాక్సియం-4 మిషన్ ప్రయోగం ఇప్పటికే గత నెల 29న జరగాల్సింది.

    అయితే, అప్పుడు వాయిదా పడగా, తరువాత దాన్ని ఈ నెల 8వ తేదీకి మార్చారు.

    ఆపై మళ్లీ 10వ తేదీకి మారింది. తాజాగా, ఇప్పుడు మరోసారి వాయిదా పడినట్లు తెలుస్తోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం

    తాజా

    Shubhanshu Shukla: భారత వ్యోమగామి శుభాంశు శుక్లా ఐఎస్‌ఎస్‌ యాత్ర మరోసారి వాయిదా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం
    Starlink price in India: బంగ్లాదేశ్‌లో ఉన్న ధరలకే ఇండియా డేటా ప్లాన్‌లను అందించనున్న స్టార్‌లింక్ స్టార్‌లింక్‌
    Kerala: కేరళ తీరంలో సింగపూర్ జెండాతో కూడిన ఓడలో పేలుడు.. స్పందించిన నేవీ  కేరళ
    AP Government: ఉపాధి హామీ పథకం పనుల కోసం రూ.176.35 కోట్ల విడుదల.. ఆంధ్రప్రదేశ్

    అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం

    ISS astronauts: అంతరిక్షంలో పేలిన రష్యా ఉపగ్రహం.. ఆశ్రయం పొందిన ISS వ్యోమగాములు  టెక్నాలజీ
    Starliner: ఆగష్టు నాటికి భూమికి తిరిగి రానున్న సునీతా విలియమ్స్ .. అంతరిక్ష నౌకకు మరమ్మతులు చేస్తున్న నాసా  టెక్నాలజీ
    ISS: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో అత్యధిక కాలం గడిపిన వ్యోమగామి ఎవరు? టెక్నాలజీ
    NASA: ఐఎస్ఎస్‌లో నిలిచిపోయిన NASA-SpaceX Crew-8 మిషన్‌.. కారణమిదే!  నాసా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025