NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / Team India: 579 మ్యాచ్‌లు, 36 మంది కెప్టెన్లు.. అరుదైన ఘనతకు చేరువలో టీమిండియా
    తదుపరి వార్తా కథనం
    Team India: 579 మ్యాచ్‌లు, 36 మంది కెప్టెన్లు.. అరుదైన ఘనతకు చేరువలో టీమిండియా
    579 మ్యాచ్‌లు, 36 మంది కెప్టెన్లు.. అరుదైన ఘనతకు చేరువలో టీమిండియా

    Team India: 579 మ్యాచ్‌లు, 36 మంది కెప్టెన్లు.. అరుదైన ఘనతకు చేరువలో టీమిండియా

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Sep 18, 2024
    04:08 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    1932, జూన్‌ 25న భారత క్రికెట్‌ చరిత్రలో మరుపురాని రోజు. భారత క్రికెట్‌ జట్టు తొలిసారిగా అంతర్జాతీయ క్రికెట్‌‌లో మైదానంలో అడుగుపెట్టింది.

    ఇప్పటికి 92 ఏళ్ల కాలం గడిచినా, టీమిండియా క్రికెట్‌ అభిమానుల గుండెల్లో ప్రత్యేక స్థానాన్ని నిలబెట్టుకుంది.

    ఇప్పుడు, 2023 సెప్టెంబర్ 23న, ఈ చరిత్రలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది.

    చెన్నైలోని చిదంబరం స్టేడియంలో బంగ్లాదేశ్‌తో ఐదు రోజుల టెస్ట్‌ మ్యాచ్‌ జరగనుండగా, భారత్‌ క్రికెట్‌ చరిత్రలో ఓటముల కంటే విజయాలు ఎక్కువగా ఉన్న జట్టుగా అవతరించనుంది.

    Details

     15 ఏళ్లలో  78 విజయాలను సాధించిన టీమిండియా 

    భారత క్రికెట్‌ జట్టు 1932లో అంతర్జాతీయ క్రికెట్‌లో ప్రవేశించింది. మొదటి 20 ఏళ్ల కాలంలో ఏకైక విజయాన్ని 1952లో ఇంగ్లండ్‌పై సాధించింది, అది కూడా చెన్నైలోని చిదంబరం స్టేడియంలోనే కావడం గమనార్హం.

    ఇప్పుడు, అదే స్టేడియం వేదికగా, భారత్‌ బంగ్లాదేశ్‌పై విజయం సాధిస్తే, క్రికెట్‌ చరిత్రలో అత్యధిక టెస్ట్‌ విజయాలు సాధించిన నాలుగో జట్టుగా నిలవనుంది.

    1988 వరకు భారత జట్టు ఎన్నడూ ఎక్కువ విజయాలతో ఏదైనా సంవత్సరం ముగించలేదు. 2009లో 100వ టెస్ట్‌ విజయం సాధించడానికి టీమ్‌ 432 మ్యాచ్‌లు ఆడింది.

    అప్పటివరకు విజయశాతం 23.14 మాత్రమే ఉండగా, గత 15 ఏళ్లలో టీమ్‌ఇండియా 78 విజయాలను నమోదు చేసి విజయశాతాన్ని 53.06కి పెంచుకుంది.

    Details

    92 ఏళ్ల తర్వాత సరికొత్త రికార్డు నెలకొల్పే అవకాశం 

    ప్రస్తుతం టీమ్‌ఇండియా 579 టెస్టులు ఆడగా, 178 విజయాలు, 178 ఓటములు, 222 డ్రాలు, ఒక మ్యాచ్‌ టైగా ముగిసింది.

    సెప్టెంబర్ 23న బంగ్లాదేశ్‌తో జరగనున్న తొలి టెస్ట్‌లో విజయం సాధిస్తే, భారత క్రికెట్‌ జట్టు చరిత్రలో కొత్త రికార్డు నెలకొల్పుతుంది.

    భారత క్రికెట్‌ జట్టు సారధ్య బాధ్యతలు మొత్తం 36 మంది కెప్టెన్లు చేపట్టారు.

    మొదటి కెప్టెన్‌ సీకే నాయుడు నుంచి ప్రస్తుత కెప్టెన్‌ రోహిత్‌శర్మ వరకు, ప్రతి కెప్టెన్‌ జట్టుకు కీలక విజయాలను అందించారు.

    ఈ 92 ఏళ్ల ప్రయాణంలో మొత్తం 314 మంది క్రికెటర్లు భారత జట్టు తరఫున టెస్ట్‌ మ్యాచ్‌లు ఆడారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    టీమిండియా
    క్రికెట్

    తాజా

    Google Chrome: కంప్యూటర్‌లో క్రోమ్ వాడే వారికి కేంద్రం హెచ్చరిక  గూగుల్
    Bill Gates:టెక్నాలజీతో పాటు పాలనకు మార్గదర్శి చంద్రబాబు : బిల్ గేట్స్ ప్రశంసలు చంద్రబాబు నాయుడు
    Operation Sindoor: భారత్‌ పూర్తిస్థాయిలో దాడి చేస్తే పాక్‌కు పారిపోవడం తప్ప మరో అవకాశం లేదు: ఆర్మీ ఎయిర్‌డిఫెన్స్‌ డీజీ భారతదేశం
    Motivation: తలవంచిన రోజు ఉంటే.. తలెత్తే రోజు కూడా తప్పకుండా వస్తుంది! జీవనశైలి

    టీమిండియా

    T20 World Cup: విరాట్ కోహ్లీ-అర్ష్‌దీప్ భాంగ్రా డ్యాన్స్ అదుర్స్  టీ20 ప్రపంచకప్‌
    T20 World Cup: టీమిండియాకు మోదీ, రాహుల్, రాష్ట్రపతి శుభాకాంక్షలు  ద్రౌపది ముర్ము
    BCCI Prize Money: టీమిండియాకు రూ.125కోట్ల నజరానా ప్రకటించిన బీసీసీఐ  టీ20 ప్రపంచకప్‌
    Team India: టీ20 ప్రపంచకప్ విజేతల రాక కోసం అభిమానుల ఎదురు చూపులు.. ఘన స్వాగతం పలకటానికి ఏర్పాట్లు క్రీడలు

    క్రికెట్

    Bengaluru Vs Punjab: సొంత మైదానంలో బెంగళూరు విజయ పరంపర కొనసాగిస్తుందా?  ఐపీఎల్
    Charlie Dean: రికార్డు సృష్టించిన ఇంగ్లండ్ స్పిన్న‌ర్   ఇంగ్లండ్
    Venkatesh Prasad: టీ 20 వరల్డ్ కప్ భారత జట్టులో ఆ ముగ్గురు తప్పనిసరి: మాజీ క్రికెటర్ వెంకటేష్ ప్రసాద్  విరాట్ కోహ్లీ
    Rohit Sharma-Cricket: ఆ గ్రౌండ్ లో మ్యాచ్ ఆడాలంటే రోహిత్ శర్మకు వణుకే రోహిత్ శర్మ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025