NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / Team india: ఇంగ్లాండ్ టూర్‌కు ముందు కీలక నిర్ణయం.. కెప్టెన్ ఎవరో తేలేది ఆ రోజే!
    తదుపరి వార్తా కథనం
    Team india: ఇంగ్లాండ్ టూర్‌కు ముందు కీలక నిర్ణయం.. కెప్టెన్ ఎవరో తేలేది ఆ రోజే!
    ఇంగ్లాండ్ టూర్‌కు ముందు కీలక నిర్ణయం.. కెప్టెన్ ఎవరో తేలేది ఆ రోజే!

    Team india: ఇంగ్లాండ్ టూర్‌కు ముందు కీలక నిర్ణయం.. కెప్టెన్ ఎవరో తేలేది ఆ రోజే!

    వ్రాసిన వారు Jayachandra Akuri
    May 21, 2025
    04:50 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    భారత టెస్టు జట్టుకు కొత్త అధ్యాయం మొదలవబోతోంది. జూన్ 20నుంచి ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా ఐదు టెస్టుల సిరీస్‌లో పాల్గొననున్న భారత్ జట్టు కోసం సంస్కరణలు ప్రారంభమయ్యాయి.

    ఇందులో భాగంగా భారత జట్టు ఎంపిక, కొత్త కెప్టెన్ నిర్ణయం మే 24న తీసుకోనున్నారన్న సమాచారం వెలువడింది.

    అదేరోజు సెలెక్షన్ కమిటీ సమావేశం అనంతరం దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశముంది.

    ఇటీవలే రోహిత్ శర్మ టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలకడంతో కొత్త కెప్టెన్ ఎవరు అనే ఉత్కంఠ మొదలైంది.

    ఇప్పటివరకు శుభ్‌మన్ గిల్, జస్ప్రీత్ బుమ్రా, రిషభ్ పంత్ పేర్లు తెరపైకి వచ్చాయి. అయితే, తాజా సమాచారం ప్రకారం బుమ్రా ఈ రేసు నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది.

    Details

    మే 24న నిర్ణయం

    అతడు పూర్తిస్థాయిలో సిరీస్‌ను ఆడే అవకాశాలు తక్కువగా ఉండడంతో కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించడం అనిశ్చితమని సమాచారం.

    మరోవైపు శుభ్‌మన్ గిల్ టెస్టు జట్టులో స్థిరమైన స్థానం సంపాదించలేదన్న కారణంతో తనకు వెంటనే కెప్టెన్సీ ఇవ్వడాన్ని సెలక్టర్లలో కొందరు వ్యతిరేకించారు. అతనికి ముందుగా వైస్ కెప్టెన్‌ హోదా ఇవ్వాలని భావిస్తున్నారని తెలిసింది.

    ఇక రిషబ్ పంత్ పేరు మరోసారి చర్చకు వచ్చినప్పటికీ, గాయం నుంచి తిరిగొచ్చిన నేపథ్యంలో జట్టు ఎంపికపై స్పష్టత కోసం అధికారిక ప్రకటనను వేచిచూడాల్సిందే.

    ఇంగ్లండ్ పర్యటనను దృష్టిలో పెట్టుకుని టెస్టు జట్టు రూపకల్పన కీలకమైనదిగా మారింది. బీసీసీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. టెస్టు కెప్టెన్సీ ఊహాగానాలకు మే 24న తెరపడనుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    భారత జట్టు
    ఇంగ్లండ్

    తాజా

    Team india: ఇంగ్లాండ్ టూర్‌కు ముందు కీలక నిర్ణయం.. కెప్టెన్ ఎవరో తేలేది ఆ రోజే! భారత జట్టు
    Nambala Kesava Rao: ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్.. మావోయిస్టు అగ్ర నేత నంబాల కేశవరావు మృతి  ఛత్తీస్‌గఢ్
    Virat Anushka: పికిల్‌బాల్ కోర్టులో విరాట్, అనుష్క జంట  విరాట్ కోహ్లీ
    Stock market: లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. సెన్సెక్స్‌ 410 పాయింట్లు, నిఫ్టీ 129 పాయింట్లు  స్టాక్ మార్కెట్

    భారత జట్టు

    ఇండియా-ఆస్ట్రేలియా నాలుగో టెస్ట్ మ్యాచ్ కు అతిధులుగా ఇరుదేశాల ప్రధానమంత్రులు క్రికెట్
    గంటల వ్యవధిలో అమ్ముడుపోయిన విశాఖ వన్డే మ్యాచ్ టికెట్లు క్రికెట్
    సీబీఎస్ఈ 10వ ఫలితాలు విడుదల; రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి ఇండియా లేటెస్ట్ న్యూస్
    భారత క్రికెట్ టీమ్ లీడ్ స్పాన్సర్‌గా 'డ్రీమ్ 11': బీసీసీఐ ప్రకటన  బీసీసీఐ

    ఇంగ్లండ్

    Ollie Pope : 147 ఏళ్ల క్రికెట్ చరిత్రలో ఒలి పోప్ సరికొత్త రికార్డు క్రికెట్
    Moeen Ali: అంతర్జాతీయ క్రికెట్‌కు ఇంగ్లండ్ క్రికెటర్ మొయిన్ అలీ గుడ్ బాయ్  క్రీడలు
    Travis Head: ఒకే ఓవర్​లో 30 రన్స్.. సామ్ కర్రన్​ను చితకబాదిన ట్రావిస్ హెడ్! ఆస్ట్రేలియా
    Somerset vs Surrey: 1 ఫ్రేమ్‌లో 13 మంది ఆటగాళ్లు.. సోషల్ మీడియాలో వైరల్ క్రికెట్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025