Page Loader
Team india: ఇంగ్లాండ్ టూర్‌కు ముందు కీలక నిర్ణయం.. కెప్టెన్ ఎవరో తేలేది ఆ రోజే!
ఇంగ్లాండ్ టూర్‌కు ముందు కీలక నిర్ణయం.. కెప్టెన్ ఎవరో తేలేది ఆ రోజే!

Team india: ఇంగ్లాండ్ టూర్‌కు ముందు కీలక నిర్ణయం.. కెప్టెన్ ఎవరో తేలేది ఆ రోజే!

వ్రాసిన వారు Jayachandra Akuri
May 21, 2025
04:50 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత టెస్టు జట్టుకు కొత్త అధ్యాయం మొదలవబోతోంది. జూన్ 20నుంచి ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా ఐదు టెస్టుల సిరీస్‌లో పాల్గొననున్న భారత్ జట్టు కోసం సంస్కరణలు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా భారత జట్టు ఎంపిక, కొత్త కెప్టెన్ నిర్ణయం మే 24న తీసుకోనున్నారన్న సమాచారం వెలువడింది. అదేరోజు సెలెక్షన్ కమిటీ సమావేశం అనంతరం దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశముంది. ఇటీవలే రోహిత్ శర్మ టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలకడంతో కొత్త కెప్టెన్ ఎవరు అనే ఉత్కంఠ మొదలైంది. ఇప్పటివరకు శుభ్‌మన్ గిల్, జస్ప్రీత్ బుమ్రా, రిషభ్ పంత్ పేర్లు తెరపైకి వచ్చాయి. అయితే, తాజా సమాచారం ప్రకారం బుమ్రా ఈ రేసు నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది.

Details

మే 24న నిర్ణయం

అతడు పూర్తిస్థాయిలో సిరీస్‌ను ఆడే అవకాశాలు తక్కువగా ఉండడంతో కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించడం అనిశ్చితమని సమాచారం. మరోవైపు శుభ్‌మన్ గిల్ టెస్టు జట్టులో స్థిరమైన స్థానం సంపాదించలేదన్న కారణంతో తనకు వెంటనే కెప్టెన్సీ ఇవ్వడాన్ని సెలక్టర్లలో కొందరు వ్యతిరేకించారు. అతనికి ముందుగా వైస్ కెప్టెన్‌ హోదా ఇవ్వాలని భావిస్తున్నారని తెలిసింది. ఇక రిషబ్ పంత్ పేరు మరోసారి చర్చకు వచ్చినప్పటికీ, గాయం నుంచి తిరిగొచ్చిన నేపథ్యంలో జట్టు ఎంపికపై స్పష్టత కోసం అధికారిక ప్రకటనను వేచిచూడాల్సిందే. ఇంగ్లండ్ పర్యటనను దృష్టిలో పెట్టుకుని టెస్టు జట్టు రూపకల్పన కీలకమైనదిగా మారింది. బీసీసీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. టెస్టు కెప్టెన్సీ ఊహాగానాలకు మే 24న తెరపడనుంది.