NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / IPL 2025: రికార్డుల వర్షం.. ఐపీఎల్-2025లో 200+ స్కోర్ల సంచలనం!
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    IPL 2025: రికార్డుల వర్షం.. ఐపీఎల్-2025లో 200+ స్కోర్ల సంచలనం!
    రికార్డుల వర్షం.. ఐపీఎల్-2025లో 200+ స్కోర్ల సంచలనం!

    IPL 2025: రికార్డుల వర్షం.. ఐపీఎల్-2025లో 200+ స్కోర్ల సంచలనం!

    వ్రాసిన వారు Jayachandra Akuri
    May 24, 2025
    09:32 am

    ఈ వార్తాకథనం ఏంటి

    లక్నోలోని ఏకానా క్రికెట్ స్టేడియంలో శుక్రవారం రాత్రి బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్ (ఆర్‌సీబీ), సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్‌) మధ్య జరిగిన హై-స్కోరింగ్ మ్యాచ్‌తో ఐపీఎల్ 2025 సీజన్ ఓ అరుదైన మైలురాయిని చేరింది.

    ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ 231 పరుగుల భారీ స్కోరు చేసింది. రికార్డు స్థాయిలో 200కి పైగా వ్యక్తిగత జట్టు స్కోర్లు నమోదు అయిన అత్యధిక సీజన్‌గా 2025 నిలిచింది.

    ఈ 18వ ఎడిషన్‌లో ఇప్పటివరకు మొత్తం 42 సార్లు జట్లు 200కు పైగా స్కోర్లు నమోదు చేశాయి.

    గత రికార్డుల ప్రకారం, 2024లో 41 సార్లు, 2023లో 37 సార్లు, 2022లో 18, 2018లో 15 సార్లు 200+ స్కోర్లు నమోదయ్యాయి.

    Details

    టాప్ లో గుజరాత్

    మిగిలిన మ్యాచ్‌లు ఇంకా జరిగే అవకాశం ఉన్నందున ఈ సంఖ్య మరింత పెరిగే సూచనలు ఉన్నాయి.

    ఈ సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ (జీటీ) అత్యధికంగా 7 సార్లు 200కు పైగా స్కోర్లు చేసి అగ్రస్థానంలో ఉంది.

    తదుపరి స్థానాల్లో పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్‌): 6 సార్లు, లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్‌జీ), రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్‌): చెరో 5 సార్లు, కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్‌), ముంబయి ఇండియన్స్ (ఎంఐ): చెరో 4 సార్లు, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ): 3 సార్లు చేశాయి.

    Details

    ఆర్సీబీ ఓటమి

    నిన్నటి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ 42 పరుగుల తేడాతో బెంగళూరును ఓడించింది. 232 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్‌సీబీ, కేవలం 189 పరుగులకే ఆలౌట్ అయింది.

    ఇప్పటికే ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించిన ఆర్‌సీబీకి ఈ ఓటమి గట్టి దెబ్బ ఇచ్చింది. పాయింట్ల పట్టికలో ఆర్‌సీబీ మూడో స్థానానికి పడిపోయింది.

    ప్రస్తుతం గుజరాత్ టైటాన్స్ 18 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. సీజన్‌లో రన్ ఫెస్టివల్ కొనసాగుతూనే ఉండే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్

    తాజా

    IPL 2025: రికార్డుల వర్షం.. ఐపీఎల్-2025లో 200+ స్కోర్ల సంచలనం! బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్
    Prabhas: ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. 'ది రాజాసాబ్' టీజర్‌పై ఎస్‌కేఎన్ కీలక ప్రకటన ప్రభాస్
    NITI Aayog: నేడు దిల్లీలో మోడీ నేతృత్వంలో నీతి ఆయోగ్ పాలక మండలి భేటీ నరేంద్ర మోదీ
    Donald Trump: ఆపిల్ సహా విదేశీ ఫోన్లపై ట్రంప్ భారీ సుంకాల ప్రకటన అమెరికా

    బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్

    ఓడిపోయిన ఆర్సీబీకి మరోషాక్.. కెప్టెన్‌కు భారీ జరిమానా ఐపీఎల్
    IPL 2023: బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్ ఘనవిజయం   ఐపీఎల్
    IPL 2023: సీఎస్కే, ఆర్సీబీ మ్యాచ్‌లో సూపర్ రికార్డు  చైన్నై సూపర్ కింగ్స్
    టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్ కింగ్స్ క్రీడలు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025