Page Loader
IPL 2025: రికార్డుల వర్షం.. ఐపీఎల్-2025లో 200+ స్కోర్ల సంచలనం!
రికార్డుల వర్షం.. ఐపీఎల్-2025లో 200+ స్కోర్ల సంచలనం!

IPL 2025: రికార్డుల వర్షం.. ఐపీఎల్-2025లో 200+ స్కోర్ల సంచలనం!

వ్రాసిన వారు Jayachandra Akuri
May 24, 2025
09:32 am

ఈ వార్తాకథనం ఏంటి

లక్నోలోని ఏకానా క్రికెట్ స్టేడియంలో శుక్రవారం రాత్రి బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్ (ఆర్‌సీబీ), సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్‌) మధ్య జరిగిన హై-స్కోరింగ్ మ్యాచ్‌తో ఐపీఎల్ 2025 సీజన్ ఓ అరుదైన మైలురాయిని చేరింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ 231 పరుగుల భారీ స్కోరు చేసింది. రికార్డు స్థాయిలో 200కి పైగా వ్యక్తిగత జట్టు స్కోర్లు నమోదు అయిన అత్యధిక సీజన్‌గా 2025 నిలిచింది. ఈ 18వ ఎడిషన్‌లో ఇప్పటివరకు మొత్తం 42 సార్లు జట్లు 200కు పైగా స్కోర్లు నమోదు చేశాయి. గత రికార్డుల ప్రకారం, 2024లో 41 సార్లు, 2023లో 37 సార్లు, 2022లో 18, 2018లో 15 సార్లు 200+ స్కోర్లు నమోదయ్యాయి.

Details

టాప్ లో గుజరాత్

మిగిలిన మ్యాచ్‌లు ఇంకా జరిగే అవకాశం ఉన్నందున ఈ సంఖ్య మరింత పెరిగే సూచనలు ఉన్నాయి. ఈ సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ (జీటీ) అత్యధికంగా 7 సార్లు 200కు పైగా స్కోర్లు చేసి అగ్రస్థానంలో ఉంది. తదుపరి స్థానాల్లో పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్‌): 6 సార్లు, లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్‌జీ), రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్‌): చెరో 5 సార్లు, కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్‌), ముంబయి ఇండియన్స్ (ఎంఐ): చెరో 4 సార్లు, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ): 3 సార్లు చేశాయి.

Details

ఆర్సీబీ ఓటమి

నిన్నటి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ 42 పరుగుల తేడాతో బెంగళూరును ఓడించింది. 232 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్‌సీబీ, కేవలం 189 పరుగులకే ఆలౌట్ అయింది. ఇప్పటికే ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించిన ఆర్‌సీబీకి ఈ ఓటమి గట్టి దెబ్బ ఇచ్చింది. పాయింట్ల పట్టికలో ఆర్‌సీబీ మూడో స్థానానికి పడిపోయింది. ప్రస్తుతం గుజరాత్ టైటాన్స్ 18 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. సీజన్‌లో రన్ ఫెస్టివల్ కొనసాగుతూనే ఉండే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.