మూడో టీ-20లో దక్షిణాఫ్రికా చిత్తు.. క్లీన్స్వీప్ చేసిన ఆస్ట్రేలియా
దక్షిణాఫ్రికా గడ్డపై మూడు మ్యాచ్ల టీ-20 సిరీస్ ను ఆస్ట్రేలియా క్లీన్స్వీప్ చేసింది. ఆదివారం జరిగిన చివరి మ్యాచ్లో కంగారు జట్టు ఐదు వికెట్లతో గెలిపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణఆఫ్రికా 20 ఓవర్లలో 8 ఓవర్లకు 190 పరుగులు సాధించింది.అనంతరం 191 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన ఆసీస్, 17.5 ఓవర్లలో 191/5 స్కోరుతో విజయదుందుభి మోగించింది. ఈ మేరకు ఆరో అత్యధిక ఛేదనతో ఆసీస్ రికార్డు నెలకొల్పింది. సిరీస్ ఆసాంతం ఆసీస్ బ్యాటర్లలో కెప్టెన్ మిచెల్ మార్ష్, టిమ్ డేవిడ్ విధ్వంసం సృష్టించారు. టీ20 సీరిస్ లో అద్భుతంగా రాణించిన ఆసీస్ కెప్టెన్ మిచెల్ మార్ష్ మ్యాన్ ఆఫ్ ద సిరీస్ గా ఎంపికయ్యారు.