
Rishabh Pant: బాల్ మార్పు వివాదం.. పంత్ పై చర్యలు తీసుకొనే అవకాశం!
ఈ వార్తాకథనం ఏంటి
లీడ్స్ హెడింగ్లీ వేదికగా ఇంగ్లాండ్తో జరుగుతున్న తొలి టెస్ట్ మూడో రోజు టీమిండియా వికెట్కీపర్ రిషబ్ పంత్ ఆన్ఫీల్డ్ అంపైర్ పాల్ రీఫెల్తో ఘాటుగా మాట్లాడాడు. ఆపై బంతిని మైదానంలోకి విసిరేస్తూ ముందుకు నడిచాడు. ఈ ప్రవర్తనతో పంత్ ఐసీసీ నుంచి శిక్ష ఎదుర్కొనే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ 61వ ఓవర్లో మహ్మద్ సిరాజ్ వేసిన బంతిని హ్యారీ బ్రూక్ బౌండరీ కొట్టాడు. తరువాత బంతి స్థితిపై రిషభ్ పంత్ అసంతృప్తిని వ్యక్తం చేసి, అంపైర్ పాల్ రీఫెల్ వద్దకు తీసుకువెళ్ళాడు. అంపైర్ బంతిని గేజ్ ద్వారా పరిశీలించి 'బంతి బాగానే ఉంది' అని చెప్పాడు. దీనిపై పంత్ విభేదించి, బంతిని మైదానంలోకి విసిరేస్తూ వెళ్లిపోయాడు.
Details
ఇతర వస్తువులపై విసరడం నేరం
ఈ ప్రవర్తనను వ్యాఖ్యాత మార్క్ బౌచర్ 'అనవసరమని వ్యాఖ్యానించాడు. క్రికెట్ విశ్లేషకుల ప్రకారం, పంత్ రెండు రకాల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించినట్లు ఐసీసీ తేల్చే అవకాశం ఉంది. ఇందులో అంపైర్ నిర్ణయంపై బహిరంగ అసంతృప్తి వ్యక్తం చేయడమే కాకుండా, మ్యాచ్ సమయంలో బంతి, నీటిసీసా లేదా ఇతర వస్తువులను విసరడం కూడా నేరంగా పరిగణించబడుతుంది. ఇక ఈ మ్యాచ్లో రిషభ్ పంత్ ఒక అరుదైన రికార్డును కూడా నమోదు చేసుకున్నాడు. ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్ చేసిన బంతిని ఓలి పోప్ ఎడ్జ్ చేయగా పంత్ అందుకున్నాడు.
Details
మూడో వికెట్ కీపర్ గా రికార్డు
దీంతో టెస్టుల్లో 150 క్యాచ్ల మైలురాయిని చేరుకున్న మూడో భారత వికెట్కీపర్గా రికార్డులోకెక్కాడు. పంత్ ఇప్పటివరకు 151 క్యాచ్లు, 15 స్టంపింగ్స్ (మొత్తం 166 డిస్మిసల్స్) పూర్తి చేశాడు. ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉన్న మహేంద్ర సింగ్ ధోనీ 256 క్యాచ్లు, 38 స్టంపింగ్స్ (మొత్తం 294 డిస్మిసల్స్) సాధించగా, రెండో స్థానంలో సయ్యద్ కిర్మాణీ (160 క్యాచ్లు) ఉన్నారు.