NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / Bengaluru: ఆర్‌సిబి విజయోత్సవ వేడుకల్లో విషాదం.. తొక్కిసలాటలో 8మంది మృతి
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Bengaluru: ఆర్‌సిబి విజయోత్సవ వేడుకల్లో విషాదం.. తొక్కిసలాటలో 8మంది మృతి
    ఆర్‌సిబి విజయోత్సవ వేడుకల్లో విషాదం.. తొక్కిసలాటలో 8మంది మృతి

    Bengaluru: ఆర్‌సిబి విజయోత్సవ వేడుకల్లో విషాదం.. తొక్కిసలాటలో 8మంది మృతి

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jun 04, 2025
    06:17 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఐపీఎల్‌ చరిత్రలో తొలిసారి టైటిల్‌ గెలిచింది. ఈ సందర్భంగా నిర్వహించిన విజయోత్సవ కార్యక్రమంలో ను విషాదం చోటు చేసుకుంది.

    18 సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న టైటిల్‌ను ఎట్టకేలకు సొంతం చేసుకున్న ఆర్సీబీ జట్టును అభినందించేందుకు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ప్రత్యేక సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

    ఈ కార్యక్రమానికి వేలాదిగా అభిమానులు తరలివచ్చారు. స్టేడియం గేట్లు, పరిసర ప్రాంతాల్లోని గోడలు, చెట్లపైకి కూడా ఎక్కారు.

    గేట్-2 వద్ద ఒక్కసారిగా స్టేడియంలోకి ప్రవేశించేందుకు జనం ఒక్కసారిగా పరుగులు తీశారు.

    అదుపు తప్పిన ఈ పరిస్థితిని నియంత్రించేందుకు పోలీసులు లాఠీఛార్జ్ చేయాల్సి వచ్చింది. దీంతో తీవ్రంగా తోపులాట జరగడంతో పరిస్థితి బీభత్సంగా మారింది.

    వివరాలు 

    బెంగళూరు విమానాశ్రయంలో ఘనస్వాగతం.. 

    ఈ దుర్ఘటనలో 8 మంది ప్రాణాలు కోల్పోగా, 50 మందికిపైగా గాయాలపాలయ్యారు.

    గాయపడిన వారిని సమీపంలోని పలు ఆసుపత్రులకు తరలించి అత్యవసర చికిత్స అందిస్తున్నారు.

    ఆర్సీబీ టీమ్‌ తొలి టైటిల్‌ను గెలుచుకున్న సందర్భంగా,దేశవ్యాప్తంగా జట్టుకు చెందిన అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు.

    జట్టు ట్రోఫీతో తొలిసారి బెంగళూరుకు వచ్చిన సందర్భంగా బెంగళూరు విమానాశ్రయంలో గ్రాండ్ వెల్‌కమ్ ఏర్పాటు చేశారు.

    కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీ కే శివకుమార్ స్వయంగా విమానాశ్రయానికి వచ్చి జట్టుకు స్వాగతం పలికారు.

    విరాట్ కోహ్లీ, కృనాల్ పాండ్యా, టిమ్ డేవిడ్, దినేశ్ కార్తిక్ తదితర ఆటగాళ్లకు పుష్పగుచ్ఛాలు అందించి అభినందనలు తెలిపారు.

    వివరాలు 

     'ఎర్ర సముద్రం'లా విధాన సౌధ

    అనంతరం ఆర్సీబీ జట్టు ప్రత్యేక బస్సులో విధాన సౌధకు బయలుదేరింది.

    వీరి రాకకు వేలాది అభిమానులు సిద్ధంగా ఉండి, చేతుల్లో ఆర్సీబీ జెండాలతో విధాన సౌధ వద్ద భారీగా గుమిగూడారు.

    ఆ ప్రాంతం మొత్తం ఎర్ర జెండాలతో నిండిపోవడంతో 'ఎర్ర సముద్రం'లా మారిపోయింది.

    జట్టు బస్సు ప్రయాణించే మార్గంలోనూ అభిమానులు భారీ సంఖ్యలో హాజరై తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    బెంగళూరు

    తాజా

    Bengaluru: ఆర్‌సిబి విజయోత్సవ వేడుకల్లో విషాదం.. తొక్కిసలాటలో 8మంది మృతి బెంగళూరు
    Tomato: ప్రాణాంతక బ్యాక్టీరియాతో టమాటోలు.. అమెరికాలో సాల్మొనెల్లా కలకలం! అమెరికా
    TG Inter Board: ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. పాఠ్య పుస్తకాల ముద్రణ, పంపిణీ కార్యక్రమం ప్రారంభం తెలంగాణ
    Hyderabad: మాజీ ఎమ్మెల్సీ మాగం రంగారెడ్డి కన్నుమూత హైదరాబాద్

    బెంగళూరు

    Bengaluru: ఉచిత టొమాటోలను పంపినందుకు స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌పై మండిపడిన బెంగళూరు వ్యక్తి  స్విగ్గీ
    Flying taxis: త్వరలో బెంగళూరును పలకరించనున్న ఎగిరే ట్యాక్సీలు..1.50 గంటల ప్రయాణం 5 నిమిషాల్లోనే!  భారతదేశం
    Bengaluru Rains: బెంగళూరులో భారీ వర్షాలు..సిటీకి ఆరెంజ్ అలర్ట్ జారీ- స్కూళ్లు బంద్..!!  భారీ వర్షాలు
    Bengaluru Rains: బెంగళూరులో భారీ వర్షాలు.. స్కూళ్లకు సెలవు.. ఉద్యోగులు వర్క్‌ఫ్రమ్ హోమ్  భారీ వర్షాలు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025