NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / IND vs ENG ODI: టాస్ గెలిచిన ఇంగ్లాండ్‌.. తొలి వన్డేకు విరాట్ కోహ్లీ దూరం..!
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    IND vs ENG ODI: టాస్ గెలిచిన ఇంగ్లాండ్‌.. తొలి వన్డేకు విరాట్ కోహ్లీ దూరం..!

    IND vs ENG ODI: టాస్ గెలిచిన ఇంగ్లాండ్‌.. తొలి వన్డేకు విరాట్ కోహ్లీ దూరం..!

    వ్రాసిన వారు Sirish Praharaju
    Feb 06, 2025
    01:54 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    భారత్‌-ఇంగ్లాండ్‌ మధ్య నాగ్‌పూర్‌లో తొలి వన్డే జరగనుంది.

    ఇప్పటికే టీ20 సిరీస్‌ను 4-1 తేడాతో గెలుచుకున్న టీమిండియా, అదే ఉత్సాహంతో వన్డేల్లోనూ విజయం సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

    ఇంగ్లాండ్‌ మాత్రం కీలకమైన ఛాంపియన్స్ ట్రోఫీ ముందు వన్డేల్లో మెరుగైన ప్రదర్శన చేయాలని భావిస్తోంది.

    నాగ్‌పూర్‌ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ కెప్టెన్‌ జోస్‌ బట్లర్‌ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు.

    టాస్‌ సందర్భంగా భారత కెప్టెన్‌ రోహిత్‌ శర్మ మాట్లాడుతూ, విరాట్‌ కోహ్లీ ఈ మ్యాచ్‌ ఆడడం లేదని ప్రకటించాడు. మోకాలి గాయం కారణంగా అతను ఈ మ్యాచ్‌కు దూరమైనట్లు వివరించాడు.

    వివరాలు 

    మహ్మద్‌ షమీకి వన్డే జట్టులో చోటు 

    ఈ మ్యాచ్‌లో తొలిసారిగా యశస్వి జైస్వాల్‌, హర్షిత్‌ రాణా భారత జట్టుకు వన్డేల్లో అరంగేట్రం చేయనున్నారు.

    ఈ సందర్భంగా ఇద్దరికీ టీమ్‌ మేనేజ్‌మెంట్‌ అధికారిక క్యాప్‌ను అందజేసింది.

    ఇంతకుముందు, హర్షిత్‌ రాణా ఇంగ్లాండ్‌తో జరిగిన నాల్గో టీ20 మ్యాచ్‌లో కంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌గా అరంగేట్రం చేసి ఆకట్టుకున్నాడు.

    ఈ ప్రదర్శన వల్ల వన్డే జట్టులో కూడా అతనికి అవకాశం దక్కింది.

    2023 వన్డే ప్రపంచకప్‌ అనంతరం తొలిసారి భారత ఫాస్ట్‌ బౌలర్‌ మహ్మద్‌ షమీ వన్డేల్లో ఆడనున్నారు.

    ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాతో మ్యాచ్‌ తర్వాత గాయపడిన షమీ, దీర్ఘకాలం క్రికెట్‌కు దూరమయ్యాడు.

    వివరాలు 

    తుది జట్లు ఇవే..

    ఇటీవలే ఇంగ్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో తిరిగి అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగు పెట్టాడు.

    ఇప్పుడు, నాగ్‌పూర్‌ వేదికగా జరుగుతున్న వన్డేలో షమిని తుదిజట్టులో ఎంపిక చేసిన టీమ్‌ మేనేజ్‌మెంట్‌, అతను చాంపియన్స్‌ ట్రోఫీకి ముందు బంతితో ప్రభావం చూపాలని ఆశిస్తోంది.

    ఇంగ్లాండ్ జట్టు : బెన్ డకెట్, ఫిల్ సాల్ట్ (వికెట్ కీపర్),జో రూట్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్ (కెప్టెన్), లియామ్ లివింగ్‌స్టోన్, జాకబ్ బెథెల్, బ్రైడాన్ కార్స్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, సాకిబ్ మహమూద్.

    భారత జట్టు : రోహిత్ శర్మ (కెప్టెన్),యశస్వి జైస్వాల్, శ్రేయాస్ అయ్యర్,శుభ్‌మాన్ గిల్ (వైస్ కెప్టెన్), హార్దిక్ పాండ్యా,అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్),రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    క్రికెట్

    తాజా

    Motivational: భయాన్ని దాటితే విజయమే! జానకి కథ మీలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది ప్రేరణ
    Kamal Haasan: కన్నడ ప్రజల మనోభావాలు గాయపర్చే ఉద్దేశం లేదు : కమల్ హాసన్ లేఖ కమల్ హాసన్
     Pardeep Narwal: కబడ్డీకి పర్దీప్ నర్వాల్ రిటైర్మెంట్ స్పోర్ట్స్
    CDS Anil Chauhan: యుద్ధంలో నష్టం అనేది ముఖ్యం కాదు.. దాని ఫలితమే ప్రధానం: సీడీఎస్ అనిల్ చౌహాన్.. ఆపరేషన్‌ సిందూర్‌

    క్రికెట్

    Jay Shah: 2032 బ్రిస్బేన్ ఒలింపిక్స్ ఉన్నత అధికారులతో భేటీ అయ్యిన ఐసీసీ ఛైర్మన్ జే షా  ఒలింపిక్స్
    WPL 2025 Auction: మహిళా ప్రీమియర్ లీగ్.. వేలంలో ఆకట్టుకునే ప్లేయర్లు ఎవరంటే?  ఉమెన్స్ ఐపీఎల్ లీగ్
    WPL 2025 Auction: 16 ఏళ్ల అమ్మాయికి రికార్డు ధర.. సొంతం చేసుకున్న ముంబై ఇండియన్స్  ఉమెన్స్ ఐపీఎల్ లీగ్
    ICC Rankings: ఐసీసీ ర్యాంకింగ్స్ రిలీజ్.. టాప్-3లోకి మంధాన! స్మృతి మంధాన
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025