NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / Champions Trophy tour: పీఓకేలో ఛాంపియన్స్‌ ట్రోఫీ టూర్‌ రద్దు.. కారణం ఏంటంటే?
    తదుపరి వార్తా కథనం
    Champions Trophy tour: పీఓకేలో ఛాంపియన్స్‌ ట్రోఫీ టూర్‌ రద్దు.. కారణం ఏంటంటే?
    పీఓకేలో ఛాంపియన్స్‌ ట్రోఫీ టూర్‌ రద్దు.. కారణం ఏంటంటే?

    Champions Trophy tour: పీఓకేలో ఛాంపియన్స్‌ ట్రోఫీ టూర్‌ రద్దు.. కారణం ఏంటంటే?

    వ్రాసిన వారు Sirish Praharaju
    Nov 15, 2024
    05:29 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఛాంపియన్స్‌ ట్రోఫీ టూర్‌ (Champions Trophy tour) విషయంలో పాకిస్థాన్‌ అనైతిక యత్నాలకు ఐసీసీ (ICC) చెక్‌ పెట్టింది.

    పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీర్‌ (పీవోకే)లో ఆ దేశ క్రికెట్‌ బోర్డు నిర్వహించాలనుకున్న ఛాంపియన్స్‌ ట్రోఫీ టూర్‌ను ఐసీసీ రద్దు చేసింది.

    ఈ విషయంలో బీసీసీఐ (BCCI) ఐసీసీని సంప్రదించగా వెంటనే ఈ నిర్ణయం తీసుకుంది.

    వచ్చే ఏడాది జరగాల్సిన ఛాంపియన్స్‌ ట్రోఫీకి సంబంధించి అధికారిక షెడ్యూల్‌ ను ఐసీసీ ఇంకా ప్రకటించలేదు.

    కానీ, ఛాంపియన్స్‌ ట్రోఫీ టూర్‌ను మాత్రం పాకిస్థాన్‌ ప్రారంభించింది. ఇందులో భాగంగా పాకిస్థాన్‌ కి మొదటగా ట్రోఫీని పంపింది.

    తద్వారా పాక్‌ క్రికెట్‌ బోర్డు టూర్‌ షెడ్యూల్‌ను తాజాగా ప్రకటించింది.

    వివరాలు 

    పాకిస్థాన్ కుటిల ప్రయత్నాలకు చెక్‌ పెట్టిన భారత్ 

    నవంబరు 16న ఇస్లామాబాద్‌ నుంచి ఈ ట్రోఫీ టూర్‌ ప్రారంభం కానుంది. కానీ, ఈ షెడ్యూల్‌లో పాకిస్థాన్‌ ఆక్రమించిన పీవోకే ప్రాంతంలోని స్కర్దూ, హుంజా, ముజఫరాబాద్‌ ప్రాంతాలను కూడా చేర్చింది.

    ఇది భారత దేశాన్నిరెచ్చగొట్టడానికి మాత్రమే పాకిస్థాన్‌ తీసుకున్న చర్యగా భావిస్తున్నారు.

    అయితే, భారత జట్టు ఈ టూర్‌లో భాగంగా పాక్‌ పర్యటించదని బీసీసీఐ ఇప్పటికే ప్రకటించింది. ఈ నిర్ణయంతో పాక్‌ తన వక్ర బుద్ధిని మరోసారి కనబరచింది.

    పాకిస్థాన్ కుటిల ప్రయత్నాలకు చెక్‌ పెట్టేందుకు భారత్‌ వెంటనే స్పందించింది. ఐసీసీ వద్ద తన అభ్యంతరాలను వెల్లడించింది.

    వివరాలు 

    హైబ్రిడ్‌ పద్ధతిలో ఈ టోర్నీని నిర్వహించాలని కోరిన భారత్ 

    దీన్ని దృష్టిలో పెట్టుకుని ఐసీసీ పీవోకే టూర్‌ను రద్దు చేసింది. దీంతో పాకిస్థాన్‌ మరోసారి అంతర్జాతీయ వేదికలపై తన పరువు కోల్పోయింది.

    మరోవైపు, ఛాంపియన్స్‌ ట్రోఫీ మ్యాచ్‌లను పాకిస్థాన్‌లోని లాహోర్‌, రావల్పిండి, కరాచీ వేదికలపై నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

    అయితే, భారత్‌ ఐసీసీకి ఈ టోర్నీ కోసం పాకిస్థాన్‌కు వెళ్లడానికి సిద్ధంగా లేదని స్పష్టం చేసింది.

    భారత్‌ హైబ్రిడ్‌ పద్ధతిలో ఈ టోర్నీని నిర్వహించాలని కోరింది. అయితే, పీసీబీ (PCB) దీనికి అంగీకరించకపోవడంతో షెడ్యూల్‌ ప్రకటన ఆలస్యమవుతోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఐసీసీ
    పాకిస్థాన్

    తాజా

    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ

    ఐసీసీ

    వరల్డ్ కప్ చరిత్రలో ఇండియా- పాకిస్థాన్ మ్యాచ్‌లలో నమోదైన రికార్డులు ఇవే..  తాజా వార్తలు
    CRICKET OLYMPICS: 2028 ఒలింపిక్స్​లో క్రికెట్.. 128 ఏళ్ల తర్వాత తొలిసారిగా క్రికెట్ ఒలింపిక్స్
    ICC Rankings: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో అదరగొట్టిన విరాట్ కోహ్లీ విరాట్ కోహ్లీ
    ICC Cricket World Cup: సౌతాఫ్రికా వర్సెస్ నెదర్లాండ్స్‌.. సఫారీల జోరు కొనసాగుతుందా?  ప్రపంచ కప్

    పాకిస్థాన్

    Pakistan: పాకిస్థాన్‌లో అత్యంత ప్రమాదకర పర్యాటక ప్రాంతం.. భద్రతకు పెను ముప్పు ప్రపంచం
    Pakistan : వాయువ్య పాకిస్థాన్‌లో రెండు తెగల మధ్య ఘర్షణ.. 30 మంది మృతి  ప్రపంచం
    Mpox outbreak: ఆఫ్రికా-స్వీడన్ తర్వాత, పాకిస్తాన్‌ చేరిన Mpox వైరస్.. మొదటి కేసు నిర్ధారణ  అంతర్జాతీయం
    Pakistan: పాకిస్థాన్‌లో పోలీసు వాహనాలపై రాకెట్ దాడి.. 11 మంది పోలీసులు మృతి అంతర్జాతీయం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025